నరసరావుపేట రణరంగం
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో వైఎస్సార్ విగ్రహం తొలగింపు అనంతర పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. తెదేపా-వైకాపా నాయకుల పోటాపోటీ ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలతో జొన్నలగడ్డ, నరసరావుపేట పట్టణం రణరంగాన్ని తలపించాయి.
వైఎస్ విగ్రహం మాయంపై తమ కార్యకర్తలను అరెస్టు చేశారని తెదేపా ధర్నా
తోపులాటలో నియోజకవర్గ ఇన్ఛార్జి అరవిందబాబుకు అస్వస్థత
ఆయనను ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్సుపై వైకాపా కార్యకర్తల దాడి
తెదేపా రాష్ట్ర నేతల నిరసన..అరవిందబాబుకు పరామర్శ
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే-నరసరావుపేట పట్టణం: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో వైఎస్సార్ విగ్రహం తొలగింపు అనంతర పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. తెదేపా-వైకాపా నాయకుల పోటాపోటీ ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలతో జొన్నలగడ్డ, నరసరావుపేట పట్టణం రణరంగాన్ని తలపించాయి. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబుపై పోలీసులు శనివారం చేయి చేసుకున్నారని, ఆయన ప్రయాణిస్తున్న అంబులెన్సుపై వైకాపా కార్యకర్తలు రాళ్లు రువ్వారని తెదేపా నేతలు ఆరోపించారు. పార్టీ నాయకులు ఆదివారం ఉదయాన్నే పేటకు చేరుకుని పోలీసు, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరవిందబాబును పరామర్శించారు.
వివాదం ఇదీ..
వైఎస్సార్ విగ్రహం తొలగింపు కేసులో తెదేపా కార్యకర్తలు జొన్నలగడ్డకు చెందిన అనిల్, రాజేష్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారిని విడుదల చేయాలని డాక్టర్ అరవిందబాబు శనివారం సాయంత్రం జొన్నలగడ్డ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ నిలిచిపోతోందని చెప్పినా ధర్నా కొనసాగించటంతో పోలీసులు ఆయనను బలవంతంగా అక్కడి నుంచి లేవదీస్తుండగా తెదేపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఈ పెనుగులాటలో అరవిందబాబు కిందపడి, అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే పోలీసులు అంబులెన్సు రప్పించి నరసరావుపేట తరలిస్తుండగా దారిలో జొన్నలగడ్డ సాయిబాబా కాలనీ వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై వైకాపా కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ దాడిలో అంబులెన్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం అరవిందబాబును ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. తెదేపా రాష్ట్ర నేతలు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, జవహర్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, సీనియర్ నేతలు యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, తెనాలి శ్రావణ్కుమార్, ఎమ్మెల్సీ అశోక్బాబు, పిల్లి మాణిక్యాలరావు తదితరులు ఆదివారం పేటకు వచ్చి అరవిందబాబును పరామర్శించారు.
ఇద్దరి అరెస్టు... విడుదల
వైఎస్ విగ్రహాన్ని తొలగించిన వారిని 24 గంటల్లో అరెస్టు చేయాలని గుంటూరు-కర్నూలు రహదారిపై నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ధర్నా చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితులను పట్టుకుంటామని హామీనిచ్చి డాగ్స్క్వాడ్తో జొన్నలగడ్డ, రంగారెడ్డిపాలెం గ్రామాల్లో తనిఖీలు చేయించారు. వేలిముద్రలు సేకరించారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలు తీసి వెతికారు. ఆ రోజు గ్రామానికి చెందిన ఇద్దరు తెదేపా కార్యకర్తలు బైకుపై విగ్రహం వద్దకు వెళ్లినట్లు నిర్ధారించుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు అరెస్టు చేసిన అనిల్, రాజేష్ షరతులతో కూడిన బెయిలుపై ఆదివారం విడుదలయ్యారు. వారిపై 153, 379, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ ఇంటివద్ద హాజరుపరచగా, ఆయన విచారించి, బెయిలు మంజూరు చేశారు.
దాడులన్నింటికీ చక్రవడ్డీ సహా చెల్లిస్తాం
వైకాపా పాలనలో తెదేపా నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న ప్రతి దాడికి భవిష్యత్తులో చక్రవడ్డీతో కలిపి చెల్లిస్తామని మాజీమంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. జొన్నలగడ్డ ఘటనపై తెదేపా ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ వైకాపా పాలనలో బీసీలపై దాడిని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ బలహీనవర్గాలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు వైకాపా నేతలు దాడులు చేస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, తెనాలి శ్రావణకుమార్ తదితరులు మాట్లాడారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ అరవిందబాబును పరామర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..