లీజుకు క్వార్టర్లు!
రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు వీల్లేదని మార్చి 3న హైకోర్టు విస్పష్టంగా తీర్పు చెప్పినా ప్రభుత్వ వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివాసం కోసం
అమరావతిలో గ్రూప్-డి ఉద్యోగుల టవర్ను విట్ యూనివర్సిటీకి ఇవ్వాలని నిర్ణయం
ఏటా రూ.10 కోట్ల ఆదాయం అంచనా
నిర్ణయంపై వివిధ వర్గాల ఆందోళన
హైకోర్టు తీర్పును ఉల్లంఘించడమేనంటున్న రాజధాని ప్రజలు
ఈనాడు - అమరావతి
రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు వీల్లేదని మార్చి 3న హైకోర్టు విస్పష్టంగా తీర్పు చెప్పినా ప్రభుత్వ వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివాసం కోసం రాజధానిలో నిర్మించిన అపార్ట్మెంట్ టవర్లను ప్రైవేటు సంస్థలకు లీజుకివ్వాలని తాజాగా నిర్ణయించింది. నిధుల సమీకరణకు రాజధానిలో భూములు విక్రయించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. రాజధానిలో నాలుగో తరగతి (గ్రూప్-డి) ఉద్యోగుల కోసం నిర్మించిన అపార్ట్మెంట్ టవర్లలో ఒకటి విట్ యూనివర్సిటీకి లీజుకివ్వాలని తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది. ఒక టవర్తో మొదలుపెట్టి దశలవారీగా అన్ని టవర్లను ప్రైవేటు సంస్థలకు లీజుకిచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు రాజధానిని ఇక్కడే కొనసాగించాలన్న ఆలోచనే ఉంటే, ఉద్యోగుల కోసం నిర్మించిన టవర్లను ప్రైవేటు సంస్థలకు ఎందుకు లీజుకిస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజధానిలో పనులు జరుగుతున్నట్లుగా భ్రమ కలిగించేందుకు అరకొర పనులు చేస్తూ, కోర్టులో అఫిడవిట్లు వేస్తూ నెట్టుకొస్తున్న ప్రభుత్వ అసలు ఉద్దేశం ఈ చర్యతో బట్టబయలైందని అమరావతి రైతులు, ప్రజలు మండిపడుతున్నారు.
అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులు మొదలు నాలుగో తరగతి (గ్రూప్-డి) ఉద్యోగుల వరకు.. వారు నివసించేందుకు గత ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ టవర్ల నిర్మాణం ప్రారంభించింది. వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉండగానే అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పనులు ఎక్కడికక్కడే నిలిపివేసింది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం నిర్మించిన అపార్ట్మెంట్ టవర్లలో పెండింగ్ పనుల్ని ప్రారంభించింది. అవి పూర్తవడానికి మరో అయిదారు నెలలు పడుతుందని సమాచారం. గెజిటెడ్ అధికారులు, ఎన్జీవోలు, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం తలపెట్టిన అపార్ట్మెంట్ టవర్లలో పెండింగ్ పనుల్ని ఇంకా ప్రారంభించలేదు. వాటిలో గ్రూప్-డి ఉద్యోగుల కోసం నిర్మించిన ఆరు టవర్లలో డి-1 టవర్ను విట్ యూనివర్సిటీకి లీజుకిచ్చేందుకు సీఆర్డీఏ ప్రతిపాదించింది. ఇటీవల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కూడా ఆమోదముద్ర వేసినట్టు తెలిసింది. నెల రోజుల క్రితం విట్ యూనివర్సిటీ ప్రతినిధులు వచ్చి ఆ టవర్లను పరిశీలించి వెళ్లినట్టు సమాచారం.
సంవత్సరానికి రూ.10 కోట్ల లీజు?
గ్రూప్-డి ఉద్యోగుల కోసం 7.76 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం ఆరు టవర్లను సీఆర్డీఏ నిర్మించింది. ఒక్కోదానిలో 120 చొప్పున మొత్తం 720 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 900 చ.అడుగులు. కామన్ ఏరియాతో కలిపి ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 1,420 చ.అడుగులు, మొత్తం టవర్లో నిర్మిత ప్రాంతం 1,70,400 చ.అడుగులని ఇటీవల ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికలో సీఆర్డీఏ పేర్కొంది. ఆ టవర్ మొత్తాన్ని లీజుకు ఇచ్చేందుకు విట్తో సంప్రదింపులు జరుగుతున్నాయని, అవి కొలిక్కి వస్తే సంవత్సరానికి లీజు రూపంలో రూ.8-10 కోట్లు వస్తుందని తెలిపింది. రాజధానిలో నిర్మించిన అపార్ట్మెంట్ టవర్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్ అధికారుల భవనాల తర్వాత, ఎక్కువ శాతం పని పూర్తయినవి గ్రూప్-డి ఉద్యోగుల టవర్లే. కొద్దిపాటి పనులు పూర్తి చేస్తే అవి సిద్ధమైపోతాయని, అందుకే వాటిని లీజుకివ్వాలని సీఆర్డీఏ నిర్ణయించిందని సమాచారం. భవిష్యత్తులో మిగతా టవర్లను లీజుకు తీసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తే ఇచ్చేసే యోచనలో సీఆర్డీఏ ఉన్నట్టు సమాచారం.
లీజులకిచ్చేస్తే రాజధాని ఎలా అవుతుంది?
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని హైకోర్టు విస్పష్టంగా తీర్పు చెప్పింది. అమరావతి నిర్మాణానికి, రాజధానికి భూములిచ్చిన రైతులకు కేటాయించిన స్థలాలు అభివృద్ధి చేసి ఇచ్చేందుకు సీఆర్డీఏకి నిర్దిష్ట గడువు విధించింది. ప్రభుత్వం మాత్రం రాజధాని పనులు చేపట్టకుండా ఎలా కాలయాపన చేయాలా అని చూస్తోంది. ఇప్పుడు ఏకంగా.. అక్కడ ఉద్యోగుల కోసం నిర్మించిన అపార్ట్మెంట్లను ప్రైవేటు సంస్థలకు లీజుకిచ్చేయాలని నిర్ణయించింది. రాజధానిలో ప్రభుత్వ అవసరాలు, ఉద్యోగుల నివాసాల కోసం నిర్మించిన భవనాల్ని లీజుకిచ్చేస్తే అది రాజధాని ఎలా అవుతుందని రాజధాని పరిరక్షణ సమితి ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్య హైకోర్టు తీర్పునకు విరుద్ధమని మండిపడుతున్నారు.
మొత్తం 53 టవర్లు
రాజధానిలోని పరిపాలన నగరంలో 5 చోట్ల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, అధికారులు, ఉద్యోగుల కోసం మొత్తం 62.3 ఎకరాల్లో 53 టవర్ల నిర్మాణాన్ని సీఆర్డీఏ ప్రారంభించింది. అవన్నీ పూర్తయితే మొత్తం 3,888 ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక రాజధాని పనులు కొనసాగించి ఉంటే.. అవన్నీ చాన్నాళ్ల క్రితమే పూర్తయి ఉద్యోగులకు అందుబాటులోకి వచ్చేవి. ఇప్పుడు వాటిని సీఆర్డీఏ పూర్తి చేసినా, ఉద్యోగులకు కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం లేనట్లు తాజా పరిణామాల్ని బట్టి అర్థమవుతోంది. త్వరలో పూర్తిస్థాయిలో సిద్ధం కానున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఏఐఎస్ అధికారుల టవర్లను ప్రభుత్వం ఏం చేయనుందన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు.
304.5 ఎకరాల విక్రయం వచ్చే నెలలో..
రాజధానిలో గతంలో బి.ఆర్.శెట్టి మెడిసిటీ ప్రాజెక్టుకు కేటాయించిన 100.02 ఎకరాల్ని, ఇండో-యూకే ఇనిస్టిట్యూట్కు కేటాయించిన 148.28 ఎకరాల్ని జులై నాలుగో వారంలో ఈ-వేలం ద్వారా విక్రయించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. నవులూరులోని అమరావతి టౌన్షిప్లో 37.48 ఎకరాల్ని ఈ-వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంది. నవులూరులోని అమరావతి టౌన్షిప్లోనే మరో 8.03 ఎకరాలు, తెనాలి చెంచుపేటలోని ఐడీఎస్ఎంటీకి చెందిన 2.81 ఎకరాలు, విజయవాడ పాయకాపురం టౌన్షిప్లోని 7.01 ఎకరాలు, ఇబ్రహీంపట్నంలోని ట్రక్ టెర్మినల్కు చెందిన 0.87 ఎకరాల్ని జులై రెండోవారంలో ఈ-వేలం ద్వారా విక్రయించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. వీటి విక్రయానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఈ నెల 6న జీవో (నం.390) జారీ చేసినట్లు ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్ వాపోయారు. -
గులకరాయి ఘటనను ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
పింఛను కుట్ర.. తీస్తోంది ప్రాణం
సీఎం గారూ.. పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? -
సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!
ఫుట్బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. -
సీఎం జగన్ను ఓడించడమే మా లక్ష్యం
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. -
యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది
‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. -
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం ‘వైనాట్.. 175’ అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? ఎందుకీ ఎదురుగాలి.. అని మదన పడుతున్నారా? -
వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి
మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి గడువు పొడిగించాలి
పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. -
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
సీఎం జగన్ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా... అక్కడ విధ్వంసం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సిద్ధం సభ జరిగింది. -
‘అ’భివృద్ధి ‘నిల్’.. అవినీతి ఫుల్!
ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్ అనగానే టక్కున గుర్తుకొస్తారు. జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM