స్వాతంత్య్ర శతాబ్దికి భవ్య భారత్
వచ్చే 25 ఏళ్లలో భవ్యభారత్ నిర్మాణానికి యువత నడుం బిగించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. దేశం మనకు అన్నీ ఇచ్చిందని, అందువల్ల దాని రక్షణ, భద్రత, పురోగతి, శ్రేయస్సు
యువత నడుం బిగించాలి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు
ఈనాడు, దిల్లీ: వచ్చే 25 ఏళ్లలో భవ్యభారత్ నిర్మాణానికి యువత నడుం బిగించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. దేశం మనకు అన్నీ ఇచ్చిందని, అందువల్ల దాని రక్షణ, భద్రత, పురోగతి, శ్రేయస్సు కోసం శక్తివంచన లేకుండా పాటుపడతామంటూ ప్రతిజ్ఞ చేయాలని పేర్కొన్నారు. భవ్యమైన భారత్ను నిర్మించినప్పుడే మన మనుగడకు సార్థకత లభిస్తుందని అభిప్రాయపడ్డారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఆమె ఆదివారం రాత్రి తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు.
‘‘75 ఏళ్లు గడవడం అంటే భారత్లాంటి దేశానికి ఒక రెప్పపాటులాంటిదే. వ్యక్తిగతంగా మనకు అది ఒక జీవితకాలం. ఇంతవరకు మనం నేర్చుకున్న పాఠాలు మరో మైలురాయి దిశగా జాతి ముందడుగు వేయడానికి ఉపయోగపడ్డాయి. మనం అమృతకాలంలోకి ప్రవేశించి దేశ స్వాతంత్య్ర శత వసంతోత్సవాలు జరుపుకోవడానికి పునాది వేశాయి. స్వాతంత్య్ర సమరయోధులు కన్న కలలను 2047 నాటికల్లా పూర్తిగా సాకారం చేసుకుంటాం. దినదిన ప్రవర్ధమానమవుతున్న భారత్ను ప్రపంచం చూసింది. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో మనం స్పందించిన తీరుకు ప్రపంచవ్యాప్త అభినందనలు లభించాయి. మహమ్మారిని ఎదుర్కోవడంలో మనం సాధించిన లక్ష్యాలు అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా ఉన్నాయి. శాస్త్రవేత్తలు, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి రుణపడి ఉన్నాం. ప్రపంచం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నప్పుడు భారత్ మాత్రం కలిసికట్టుగా చర్యలు చేపట్టి ముందడుగు వేసింది.
వేగంగా అడుగులు వేస్తున్న ఆర్థిక వ్యవస్థ
ప్రపంచంలో వేగంగా అడుగులేస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ మారింది. అడ్డంకులను అధిగమించి మన ఆర్థిక వ్యవస్థ వికసించడానికి మన విధాన రూపకర్తలే కారణం. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భారతదేశ పేదరికం, నిరక్షరాస్యతల దృష్ట్యా ప్రజాస్వామ్య రూపంలో ప్రభుత్వం మనగలుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అది తప్పు అని రుజువు చేశాం. ప్రజాస్వామ్యం ఇక్కడ వేళ్లూనుకుంది, పరిఢవిల్లింది. దేశవ్యాప్తంగా అభివృద్ధి కళ కనిపిస్తోంది. వృద్ధి సమ్మిళితంగా సాగుతోంది.
ఆర్థిక సంస్కరణలతో భవిష్యత్తుకు బాటలు
ఆర్థిక సంస్కరణలు, విధాన నిర్ణయాలు దీర్ఘకాల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. మేథోపరమైన ఆర్థిక వ్యవస్థకు డిజిటల్ ఇండియా పునాది వేసింది. సొంతింటి కల ఎంతోమందికి సాకారమైంది. ప్రజలు తమ బాధ్యతలను తెలుసుకొని దేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి త్రికరణ శుద్ధిగా పనిచేయాలి.
ఆడబిడ్డలే ఆశాదీపాలు
దేశమే అన్నింటికంటే ముందు అన్న స్ఫూర్తితో పనిచేసినప్పుడు దాని ఫలితం ప్రతి నిర్ణయంలో ప్రతిఫలిస్తుంది. ప్రపంచం సరసన భారత్ నిలవడంలోనూ అది కనిపిస్తోంది. సామాజిక, రాజకీయ ప్రక్రియలో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యం ఎన్నో విజయాలకు దారి తీసింది. ఆడబిడ్డలే దేశ ఆశా దీపాలు. ఇటీవలి కామన్వెల్త్ క్రీడల్లో వారు మన దేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చారు. అన్నిరకాల అంతర్జాతీయ పోటీల్లో భారతీయ క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తూ దేశం గర్వపడేలా చేస్తున్నారు.
భిన్నత్వమే.. కానీ ఏకత్వం
యుద్ధ విమాన పైలట్ల నుంచి అంతరిక్ష శాస్త్రవేత్తల వరకు మన ఆడబిడ్డలు ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. మన దేశం భిన్నత్వాలతో నిండింది. కానీ అందరిలో ఏదో ఒకటి ఉమ్మడిగా ఉంది. ఆ దారమే మనల్ని ఒక్కటిగా కట్టి పడేసి ‘ఏక్భారత్- శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తితో ముందడుగు వేసేందుకు స్ఫూర్తినిస్తోంది. మాతృదేశంతో పాటు, తోటి భారతీయుల అభ్యున్నతి కోసం మనం త్యాగాలకు సిద్ధం కావాలి. 2047 కల్లా భవ్య భారత్ నిర్మాణానికి యువత నడుం బిగించాలని నేను ప్రత్యేకంగా పిలుపునిస్తున్నా’’ అని రాష్ట్రపతి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?