పదేళ్ల తర్వాతే యాజమాన్య హక్కులా?
పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం పరిధిలో ఉన్నట్లు గుర్తించిన మిగులు భూముల క్రమబద్ధీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మరోసారి వివాదాస్పదమైంది.
ప్రభుత్వ షరతుపై బాధితుల ఆవేదన
పాత ఉత్తర్వుల్లో కానరాని ‘డి.పట్టా’ ప్రస్తావన
ఈనాడు, అమరావతి: పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం పరిధిలో ఉన్నట్లు గుర్తించిన మిగులు భూముల క్రమబద్ధీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మరోసారి వివాదాస్పదమైంది. ఈ భూముల క్రమబద్ధీకరణకు గతంలో నిర్ణయించిన ఫీజుల్లో కాస్త వెసులుబాటు ఇస్తూనే... పదేళ్ల తర్వాతే యాజమాన్య హక్కుల బదలాయింపునకు అనుమతిస్తామని ప్రభుత్వం పేర్కొనడంపై విమర్శలు వస్తున్నాయి. కిందటేడాది జనవరిలో జారీ చేసిన జీఓ 36లో స్థల విస్తీర్ణంతో సంబంధం లేకుండా బేసిక్ విలువకు ఒకటిన్నర రెట్లు ఫీజు చెల్లించాలని షరతు విధించింది. విజయవాడలో 300 గజాల స్థల యజమానికి రూ.2.7 కోట్లు చెల్లించాలని నోటీసు వచ్చింది. దీనిపై బాధితుల నుంచి విమర్శలు చెలరేగడంతో గత నెలలో జీఓ 84ను ప్రభుత్వం జారీచేసింది. 150 చదరపు గజాల వరకు ఉచితంగా, 150-300 చ.గజాల వరకు బేసిక్ విలువలో 15%, 300 నుంచి 500 చ.గజాల వరకు 100% ఫీజు చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ జీఓలోనే పదేళ్ల తర్వాతే యాజమాన్య హక్కు బదలాయింపునకు అనుమతి లభిస్తుందని, అప్పటివరకు డి.పట్టాగానే పరిగణిస్తామని ప్రభుత్వం పేర్కొనడం వివాదానికి కేంద్రమైంది. 2008లో కొందరి భూములను క్రమబద్ధీకరించారు. అప్పటి ఉత్తర్వుల్లో గానీ, గతేడాది ఇచ్చిన జీఓ 36లో గానీ... డి.పట్టా గురించి ప్రస్తావించలేదు.
డి పట్టా అంటే ప్రభుత్వ భూమి
‘డి (దరఖాస్తు) పట్టా అంటే ప్రభుత్వ భూమిగా పరిగణించి ఇచ్చేది. సీలింగ్ పరిధిలో ఉన్నందున ప్రభుత్వం క్రమబద్ధీకరణకే చర్యలు తీసుకోవాలి. కానీ, చేతులు మారుతూ వచ్చిన ఈ భూముల్లో ఇళ్లు వెలిశాయి. ఈ పరిస్థితుల్లో వీరికి డి.పట్టా ఇచ్చి... పదేళ్ల తర్వాతే యాజమాన్య బదలాయింపు హక్కు కల్పిస్తామనడం విడ్డూరంగా ఉంది’ అని రెవెన్యూ శాఖ విశ్రాంత అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
రికార్డుల్లో ప్రభుత్వ భూమి
బాధితులు విజయవాడలోని అధికారులను స్పందిస్తే ‘‘రికార్డుల్లో మీ భూమి ప్రభుత్వ భూమిగా ఉంది. అందువల్లే డి-పట్టాగా పరిగణిస్తామని జీఓలో పేర్కొన్నారు’’ అని బదులిచ్చారు. ‘మా భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి కదా’ అని ప్రశ్నిస్తే మౌనంగా ఉన్నారని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు.
నేపథ్యం ఇదీ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం 1976లో అమల్లోకి వచ్చింది. విజయవాడ, గుంటూరు, విశాఖ, హైదరాబాద్లోనే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం చర్యలు తీసుకోవడంతో కొంత భూమి ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే పలువురు న్యాయస్థానాలు/రెవెన్యూ ట్రైబ్యునళ్లను ఆశ్రయించారు. తర్వాత ఈ భూములు చేతులు మారుతూ వచ్చాయి. మరోవైపు వీటిని నిషిద్ధ భూముల జాబితా 22 (1) (డి) పరిధిలోకి చేర్చారు. దీనిపై సరైన సమాచారం లేకపోవడం, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి అభ్యంతరాలు రాకపోవడంతో క్రయ, విక్రయాలు జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడలో 1,205, విశాఖ నగరంలో సుమారు 3,500 మంది చొప్పున ఈ భూముల పరిధిలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్