Amaravati: అవకాశం వచ్చినా అమరావతి కనబడదా?
పదిహేనో ఆర్థిక సంఘం సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా 8 నగరాల్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరింది. ఇందుకు సరైన ఎంపిక అమరావతి అని విజ్ఞత ఉన్న ఎవరైనా చెప్పేస్తారు.
కొత్త నగర నిర్మాణం కోసం కేంద్రానికి కొప్పర్తిని ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం
అన్ని వనరులూ ఉన్న అమరావతిని కాదని, సీఎం సొంత జిల్లాలోని ప్రాంతం ప్రతిపాదన
ఈనాడు - అమరావతి
మీ పెరట్లో ఒక మామిడి చెట్టుంది. బాగా పక్వానికి వచ్చింది. చేతికందేంత ఎత్తులోనే ఉంది. అదే చెట్టుకు చిటారు కొమ్మన మరో పిందె ఉంది. ఎవరైనా ఏం చేస్తారు? చేతికందేంత ఎత్తులోని పండును కోసుకుంటారు. ఆ తర్వాత పిందె గురించి ఆలోచిస్తారు. కానీ, పరిపాలనలోనూ రివర్స్ గేర్లో వెళ్లే జగన్ ప్రభుత్వం మాత్రం పండును కాలదన్ని, పిందె కోసం అర్రులు చాస్తోంది.
కొత్త నగరాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు సరిగ్గా ఇలాగే ఉన్నాయి. మహానగరానికి కావాల్సిన సకల వనరులున్న అమరావతిని వదిలేసి, సీఎం సొంత జిల్లాలోని కొప్పర్తిని ప్రతిపాదించింది.
పదిహేనో ఆర్థిక సంఘం సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా 8 నగరాల్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరింది. ఇందుకు సరైన ఎంపిక అమరావతి అని విజ్ఞత ఉన్న ఎవరైనా చెప్పేస్తారు. భూసమీకరణ, సిద్ధమైన ప్రణాళిక, ఇప్పటికే రోడ్ల వంటి ప్రధాన వసతుల అభివృద్ధిలో ముందుకెళ్లిన ప్రాంతం కావడమే ఇందుకు కారణం. కానీ, జగన్ ప్రభుత్వం అమరావతిని వదిలేసి వైయస్ఆర్ జిల్లాలోని కొప్పర్తిని ప్రతిపాదించింది. అమరావతిపై వైకాపా ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తోందో చెప్పడానికి ఇదే నిదర్శనం.
సొంత జిల్లాపై ముఖ్యమంత్రికి అభిమానం ఉండొచ్చు..! కానీ, ఆయన ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోతే ఎలా? కొప్పర్తిలోనో, మరో ప్రాంతంలోనో కొత్త నగరాన్ని అభివృద్ధి చేయడాన్ని ఎవరూ కాదనరు. కేవలం ఒక ప్రాంతంపై కక్షతో రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టడాన్ని ఏమనాలి? ఒకవైపు వైకాపా ప్రభుత్వమూ అమరావతిని ‘శాసన రాజధాని’ అంటోంది. అలాంటప్పుడు అమరావతి నిర్మాణానికే మొదటి ప్రాధాన్యమివ్వాలి కదా? పైగా 15వ ఆర్థిక సంఘం ఏ లక్ష్యంతో కొత్త నగరాల్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిందో దానికి అమరావతి సరిగ్గా సరిపోతుంది. కొత్త నగరాల నిర్మాణం తలపెట్టినప్పుడు... ఎలాంటి సవాళ్లు, అవరోధాలు ఎదురయ్యే అవకాశముందని ఆర్థిక సంఘం అభిప్రాయపడిందో వాటన్నిటినీ అమరావతి ఇప్పటికే అధిగమించేసింది.
కేంద్రం నిర్మించాలనుకున్న ఒక్కో నగరానికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం ప్రతిపాదించింది. ఆ మేరకు ఎంపిక చేసిన ప్రాంతాల అభివృద్ధికి ఏటా రూ.250 కోట్లు కేంద్రం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్నట్లు నిధుల కొరతే అమరావతిని నిలిపివేయడానికి కారణమైతే.. ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులతోనైనా అభివృద్ధి చేయొచ్చు. అయినా అమరావతిని ఎందుకు ఎంపిక చేయలేదు.? అమరావతిపై కక్షతో జగన్ ప్రభుత్వం నాలుగేళ్లుగా ఒక్క ఇటుకా పేర్చలేదు. మరోవైపు కేంద్రం, మిగతా రాష్ట్రాలు నగరాల అవసరాన్ని గుర్తించి.. వాటి నిర్మాణంవైపు సాగుతున్నాయి.
ఆర్థిక సంఘం మాటలతోనైనా కళ్లు తెరవాలి!
* ‘‘దేశంలోని పట్టణ ప్రాంతాలు రద్దీగా మారిపోయాయి. ఒక ప్రణాళిక లేకుండా విస్తరిస్తున్నాయి. మౌలిక వసతుల అభివృద్ధి కష్టమవుతోంది. పట్టణాల్లో తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం ఎంత సమస్యాత్మకమో కొవిడ్ మహమ్మారి విజృంభించినప్పుడు చూశాం. అందుకే పాత నగరాలకు కొత్త రూపునిస్తూ, మరిన్ని కొత్త నగరాల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది’’
* ‘‘పూర్తిగా కొత్తగా నిర్మించే (గ్రీన్ఫీల్డ్) నగరాల్లో రహదారుల నిర్మాణం, తాగునీరు, మురుగునీటి పారుదల వంటి వ్యవస్థలకు పైపులైన్లు వేయడం, విద్యా సంస్థలు, పార్కులు వంటి వాటికి స్థలాలు కేటాయించడం తేలిక’’
* ఆర్థిక సంఘం వివిధ సందర్భాల్లో వెల్లడించిన అభిప్రాయాలు ఇవి. వీటిని పరిశీలిస్తే విభజన తర్వాత ఒక మహానగరమంటూ లేని ఆంధ్రప్రదేశ్లో కొత్త నగరాల ఆవశ్యకత తెలుస్తుంది. అదినూ భవిష్యత్తులో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు దీటుగా ఎదిగేందుకు అవసరమైన వనరులు, ప్రణాళిక, సాధన సంపత్తి ఉన్న నగర నిర్మాణం అవసరం. అమరావతికి అలాంటి ప్రణాళిక, వనరులు పుష్కలంగా ఉన్నా... ఉద్దేశపూర్వకంగా అమరావతి విధ్వంసానికి పూనుకొన్న వైకాపా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి.
అమరావతి అద్భుత నగరమయ్యేది
- శేఖర్గుప్తా, ప్రముఖ పాత్రికేయుడు, ‘ద ప్రింట్’ ఎడిటర్ ఇన్ చీఫ్
‘‘ఈ 21వ శతాబ్దంలో ఒక రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పాటు చేయాలనుకోడం జాతీయ విషాదం. ఇలాంటి పిచ్చి చర్యను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అమరావతిలోని పాలకులపై తుగ్లక్ ప్రభావం బలంగా ఉన్నట్టుంది. మూడు రాజధానులే కాకుండా, విశాఖ, అమరావతిల్లో హైకోర్టు బెంచ్లూ పెడతారట. వేసవిలో శాసనసభ సమావేశాలు విశాఖలో జరుపుతారట. తుగ్లక్ కంటే మూడు రెట్లు ఎక్కువగా అధికార దుర్వినియోగం కనిపిస్తోంది’’ అని ప్రముఖ పాత్రికేయుడు, ‘ద ప్రింట్’ ఎడిటర్ ఇన్ చీఫ్ శేఖర్గుప్తా అన్నారు. ముఖ్యమంత్రి జగన్ 2019 డిసెంబరులో శాసనసభలో మూడు రాజధానుల ప్రతిపాదన చేయగా... ఆ నిర్ణయాన్ని తూర్పారబడుతూ ఆ నెలాఖరులో శేఖర్గుప్తా ఒక వీడియో విడుదల చేశారు. దేశంలో కొత్త నగరాల నిర్మాణం ఎంత అవసరమో వివరిస్తూ.. అమరావతి అద్భుతమైన నగరమవుతుందని అందరూ భావించినట్టు చెప్పారు. ‘‘రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని నాయకులకు.. గొప్ప నగరం నిర్మించే అవకాశం వచ్చింది. ఆ దిశగా అడుగులూ పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచీ మంచి ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. గొప్ప డ్యామ్లు, రహదారులు వంటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీకి చెందిన కాంట్రాక్టర్లు ఉంటారు. వారిని ఆంధ్రాప్రెన్యూర్స్గా పిలిచేవారు. వారంతా కలసి అమరావతిని అద్భుత నగరంగా నిర్మిస్తారని అనుకున్నాం. దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది’’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
అంతా సిద్ధంగా ఉన్న అమరావతిని కాదని..!
ప్లాన్ సిద్ధం
కొత్త నగర నిర్మాణానికి ప్రధాన సమస్య భూసేకరణ. అమరావతికి ఆ సమస్య లేదు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33 వేల ఎకరాలకుపైగా భూమిని ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉంది.
మిగులు భూమీ ఉంది
అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రధాన మౌలిక వసతుల నిర్మాణం చేపట్టారు. భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు తిరిగి ఇవ్వగా, ప్రధాన మౌలిక వసతులు నిర్మాణానికి అవసరమైన భూములు పోగా, వివిధ సంస్థలకు కేటాయించగా... ఇంకా సీఆర్డీఏ దగ్గర ఇంకా 5,020 ఎకరాల భూమి ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఆ భూముల్ని దశలవారీగా విక్రయించి నిధులు సమీకరించేలా... స్వయం సమృద్ధి ప్రాజెక్టుగా అమరావతిని రూపొందించారు.
అందుబాటులో రుణాలు
గత ప్రభుత్వ హయాంలోనే బ్యాంకులు రూ.2,600 కోట్ల రుణం ఇచ్చాయి. ప్రపంచబ్యాంకు నుంచి రూ.3,500 కోట్ల రుణం పొందేందుకు అప్పట్లోనే అంతా సిద్ధమైంది. వైకాపా ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే... రుణం ఇచ్చేందుకు అనేక ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ముందుకొచ్చేవి. గత ప్రభుత్వ హయాంలోనే అమరావతిలో రూ.10 వేల కోట్లకుపైగా నిధుల్ని వెచ్చించారు.
జలం పుష్కలం
పక్కనే కృష్ణా నది ఉండటంతో నీటికి కొరత లేదు.
రవాణా సదుపాయాలు
జాతీయ రహదారికి పక్కనే ఉంది. రైలు, ఎయిర్ కనెక్టివిటీ ఉంది. ఇన్ని అనుకూలతలున్న అమరావతిని పక్కన పెట్టి... కొత్త నగర నిర్మాణానికి జగన్ ప్రభుత్వం మరో ప్రాంతాన్ని ప్రతిపాదించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?