Botsa: పిల్లల్ని వేరే బడుల్లో చేర్పించుకోండి: మంత్రి బొత్స
రాష్ట్రంలో 98 మందిలోపు పిల్లలున్న ప్రభుత్వ ప్రాథమికోన్నత బడుల్లోని విద్యార్థులను వేరే పాఠశాలల్లో చేర్పించుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సలహా ఇచ్చారు. ఇది ఆదేశం కాదని, విద్యార్థుల తల్లిదండ్రులకు తన అభ్యర్థన మాత్రమేనన్నారు.
98మంది పిల్లలున్న ప్రాథమికోన్నత బడులకు సబ్జెక్టు టీచర్లను ఇవ్వలేమని వ్యాఖ్య
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 98 మందిలోపు పిల్లలున్న ప్రభుత్వ ప్రాథమికోన్నత బడుల్లోని విద్యార్థులను వేరే పాఠశాలల్లో చేర్పించుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సలహా ఇచ్చారు. ఇది ఆదేశం కాదని, విద్యార్థుల తల్లిదండ్రులకు తన అభ్యర్థన మాత్రమేనన్నారు. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లను ఇవ్వలేకపోతున్నందున.. విద్యార్థులకు మంచి చదువు వస్తుందనుకున్న బడుల్లో చేర్పించుకోవాలని సూచించారు. ఒకవేళ బడి దూరమవుతుందనుకుంటే కేజీబీవీ, ఎస్సీ, బీసీ, ఇతర ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లల్లో చేర్పిస్తే మంచిదని తెలిపారు. పాఠశాల దూరంగా ఉన్నా తల్లిదండ్రులు రోజు తీసుకువెళ్లి, తీసుకువస్తే పర్వాలేదని ఉచిత సలహా ఇచ్చారు.
విజయవాడలోని సమగ్ర శిక్ష అభియాన్లో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఒక ప్రశ్నకు మంత్రి బొత్స ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రభుత్వం హేతుబద్ధీకరణ ఉత్తర్వులు-117ను తీసుకొచ్చింది. దీని ప్రకారం 98 మంది లోపు విద్యార్థులుండే ప్రీ హైస్కూల్(ప్రాథమికోన్నత) బడులకు సబ్జెక్టు టీచర్లను ఇవ్వడం లేదు. ఇక్కడ 3-8 తరగతులకు సెకండరీ గ్రేడ్ టీచర్లే(ఎస్జీటీ) చదువు చెబుతారు. ఈ అంశంపై మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 98 మందిలోపు పిల్లలు ఉన్న ప్రీహైస్కూళ్లలో అయిదుగురు సబ్జెక్టు టీచర్లను పెట్టేందుకు వీలు కాదని అభిప్రాయపడ్డారు. టీచర్లను పంపిస్తే అక్కడ అనేక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందని, పిల్లలు తక్కువై టీచర్లు ఎక్కువైతే ఎలా? అందుకే అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు. తక్కువ మంది పిల్లలున్న ప్రీహైస్కూళ్లను సమీప బడుల్లో విలీనం చేయాలని భావిస్తున్నామన్నారు.
9 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు..
‘రాష్ట్రంలో ఏకోపాధ్యాయ బడులు 9 వేలు ఉన్నాయి. వీరు సెలవు పెడితే మరో ఉపాధ్యాయుడిని కేటాయించేందుకు మండల స్థాయిలో 3-5 మంది ఉపాధ్యాయులను రిజర్వులో పెడతాం. వీరు సరిపోకపోతే ఎక్కడైన ఎక్కువ ఉన్న చోట నుంచి పంపిస్తాం. మండల విద్యాధికారి(ఎంఈఓ)-1కు సంబంధించిన 355 ఖాళీలను ప్రభుత్వ ఉపాధ్యాయులతో భర్తీ చేస్తాం. 6-10 తరగతి గదుల్లో డిసెంబరు నుంచి 60వేల ఐఎఫ్పీ ప్యానళ్లను ఏర్పాటు చేయబోతున్నాం. బదిలీలకు 82,548 మంది దరఖాస్తు చేస్తే 52,240 మందికి బదిలీలు జరిగాయి. 833 మందికి రిలీవర్లు లేకపోవడంతో అక్కడే పని చేయాల్సి వస్తోంది. బోధనేతర సిబ్బందిగా కంప్యూటర్ ఆపరేటర్లను ఇవ్వనున్నాం. ఎండల కారణంగా పిల్లలు రావడం లేదు. జగనన్న ఆణిముత్యాల కార్యక్రమం కింద 87మందిని సన్మానించనున్నాం’ అని మంత్రి తెలిపారు.
జనసేనలోనే రౌడీలున్నారు..
‘జనసేన పార్టీలోనే దొంగలు, గుండాలు, రౌడీలు ఉన్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్పై కేసులు ఉండొచ్చేమో కానీ, నాపై ఒక్క కేసూ లేదు. టిడ్కో గృహాల పంపిణీపై తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు సరైనవి కావు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు ఒక్క ఇల్లూ ఇవ్వలేదు? ఆయన మేము మొదలు పెట్టామని చెబితే పర్వాలేదు. అనవసర విమర్శలు ఎందుకు’ అని బొత్స ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
పదేళ్ల పాలనలో భాజపా ఎన్ని హామీలు అమలు చేసింది?: బండి సంజయ్కు మంత్రి పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు