అధిక పింఛనుపై ఈపీఎఫ్వో నిర్లక్ష్యం
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే కార్మికులు, ఉద్యోగుల అధిక పింఛనుకు సుప్రీంకోర్టు అనుమతించి ఏడాది అవుతున్నా ఆ ఫలాలు చందాదారులకు అందడం లేదు. దరఖాస్తులు స్వీకరించిన ఈపీఎఫ్వో పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తోంది.
సుప్రీం తీర్పు వచ్చి ఏడాదవుతున్నా అంతే
వచ్చిన దరఖాస్తులు 17.48 లక్షలు
అందులో 1.8 శాతానికే డిమాండ్ నోటీసులు
ఈనాడు, హైదరాబాద్: ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే కార్మికులు, ఉద్యోగుల అధిక పింఛనుకు సుప్రీంకోర్టు అనుమతించి ఏడాది అవుతున్నా ఆ ఫలాలు చందాదారులకు అందడం లేదు. దరఖాస్తులు స్వీకరించిన ఈపీఎఫ్వో పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తోంది. పింఛను లెక్కింపుపై ప్రాంతీయ కార్యాలయాలకు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో దరఖాస్తుల పరిష్కారాన్ని నిలిపివేశాయి. దేశవ్యాప్తంగా అధిక పింఛనుకు అర్హత కోసం 17.48 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు 32,592 మందికి ఎంత మొత్తం అదనంగా చెల్లించాలో డిమాండ్ నోటీసులు జారీ చేసింది. అంటే అందిన దరఖాస్తుల్లో 1.8 శాతానికే నోటీసులు ఇచ్చి వేతన జీవులు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.1,974 కోట్లుగా లెక్క తేల్చింది. నోటీసుల ప్రకారం కొందరు అదనంగా చెల్లించాల్సిన మొత్తం కట్టినప్పటికీ... పింఛను గణనపై స్పష్టత లేకపోవడంతో తదుపరి ప్రక్రియ నిలిచిపోయింది.
తొలి నుంచి నిర్లక్ష్యమే...
అధిక పింఛను అవకాశాన్ని సుప్రీంకోర్టు గతేడాది నవంబరులో కల్పించింది. అయినా దరఖాస్తుల స్వీకరణ, తదుపరి ప్రక్రియపై ఈపీఎఫ్వో తీవ్ర జాప్యం చేసింది. కొన్ని కార్మిక సంఘాలు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని కూడా హెచ్చరించాయి. తుదకు దరఖాస్తులు తీసుకున్నప్పటికీ వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోలేదు. అధిక పింఛనుకు అర్హత కలిగిన వేతన జీవులు ఈపీఎస్ చందాను మూలవేతనం+డీఏలో 8.33కి బదులుగా 9.49 శాతం చెల్లించాలంటూ నోటిఫికేషన్ జారీచేసింది. ఈపీఎఫ్వో నిర్ణయించే పింఛను లెక్కింపు విధానానికి కట్టుబడి ఉంటామని దరఖాస్తు సమయంలోనే హామీని తీసుకుంది. పింఛను గణనపై 2023 జూన్లో ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇలాఉంటే రవుర్కెలా ప్రాంతీయ కార్యాలయం పార్ట్-1, పార్ట్-2 విధానాన్ని తెరపైకి తెచ్చి గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. పింఛను గణనపై స్పష్టత ఇవ్వాలని, రవుర్కెలా విధానం సరికాదంటూ కార్మిక సంఘాలవారు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈపీఎఫ్వో కేంద్ర కార్యాలయం పింఛను గణనపై స్పష్టత ఇవ్వనందున దరఖాస్తుల పరిష్కారాన్ని ప్రాంతీయ కార్యాలయాలు ఇటీవల నిలిపివేశాయి.
పింఛనుదారుల్లో పరిష్కరించిన దరఖాస్తు ఒక్కటే...
సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం దాదాపు 4.10లక్షల మంది పింఛనుదారులు అధిక పింఛను కోసం దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకు ఒకరికి మాత్రమే డిమాండ్ నోటీసు జారీ చేయడం గమనార్హం. అక్టోబరు 31న జరిగిన సీబీటీ సమావేశంలో అధిక పింఛను దరఖాస్తుల స్థితిని సభ్యులు పరిశీలించారు. డిమాండ్ నోటీసుల మేరకు నగదు చెల్లించిన వారికి అదనపు పింఛను సదుపాయాలు కల్పిస్తామని ఈపీఎఫ్వో.. సీబీటీకి ఇచ్చిన నివేదికలో తెలిపింది. పింఛను గణనపై కేంద్ర కార్యాలయం, రవుర్కెలా పేర్కొన్న విధానాల్లో తీవ్ర వైరుధ్యం ఉందని.. దీనిపై వెంటనే స్పష్టత ఇవ్వాలని సీబీటీ సభ్యులు డిమాండ్ చేశారు. దరఖాస్తుల్ని వేగంగా పరిష్కరించాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. -
‘నాడు-నేడు’ అదే గోడు!
ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఐదారు నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు సంస్థలు సామగ్రి సరఫరాను నిలిపివేశాయి. చాలా బడుల్లో సిమెంటు లేక పనులు సాగట్లేదు. -
ఎగువ కాఫర్ డ్యాం సీపేజీకి కట్టడి ఎలా?
పోలవరం ప్రాజెక్టుకు పెను సవాల్గా నిలిచిన ఎగువ కాఫర్ డ్యాం సీపేజీ పరిష్కారానికి అధికారులు దారులు వెతుకుతున్నారు. కేంద్ర జలసంఘం సూచన మేరకు గుత్తేదారు ఏజెన్సీ సంస్థ తరఫున ఆఫ్రి డిజైన్ కన్సల్టెన్సీ సంస్థను నియమించారు. -
62 ఏళ్లు పూర్తయ్యేవరకూ సర్వీసులో కొనసాగొచ్చు
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)లో పనిచేస్తున్న ఉద్యోగులు 62 ఏళ్లు పూర్తయ్యేవరకు సర్వీసులో కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. పీఏసీఎస్ ఉద్యోగుల్లో ఎవరైనా 60 ఏళ్ల తర్వాత పదవీ విమరణ చేసి, ఇంకా 62 ఏళ్లు పూర్తికాకుంటే అలాంటివారిని పునర్నియమించాలని ఆదేశించింది. -
మెప్మా ఎండీపై విచారణకు ఈసీ ఆదేశం
ఎన్నికల్లో వైకాపాకి అనుకూలంగా పని చేశారని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఎండీ విజయలక్ష్మిపై వచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు. -
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు డీఓ విధానం తొలగింపు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో డిపార్టుమెంట్ అధికారి(డీఓ) నియామక విధానాన్ని రద్దు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసమంటూ.. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ విధానానికి స్వస్తి పలికారు. -
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు మృతి
ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు అలియాస్ కృష్ణబాబు(71) మంగళవారం మృతిచెందారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. -
గుంతల రోడ్లకు రెండు ప్రాణాలు బలి
రాష్ట్రంలో గుంతల రోడ్లు ప్రాణాలు తీస్తున్నాయి. గుంతల్ని చూసి అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఒకరు, బురదతో నిండిపోయిన గోతుల్లోపడి మరొకరు మంగళవారం మృతి చెందారు. రోడ్డు మీద గుంతలు పూడ్చలేని పాలకుల నిర్లక్ష్యం రెండు కుటుంబాలను దుఃఖంలో ముంచేసింది. -
తిరుమల చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
శ్రీవారి దర్శనార్థం తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. స్థానిక రచనా అతిథిగృహం వద్ద రేవంత్రెడ్డికి తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. -
5 వేల మంది ఒప్పంద ఉపాధ్యాయినుల మెడపై కత్తి
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) ఉపాధ్యాయినులు, భవిత కేంద్రాల్లోని ప్రత్యేక ఉపాధ్యాయుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. వీరి పనితీరును మదింపు చేసి ఒప్పందాన్ని పొడిగించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) చర్యలు చేపట్టింది. -
విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు
విద్యార్థుల ఇళ్లను ఉపాధ్యాయులు ఏడాదికి రెండు పర్యాయాలు సందర్శించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ సూచించారు. -
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
తమిళనాడు పరిసర ప్రాంతంలో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశముంది. -
ఇదీ సంగతి!
-
ఈవీఎంల ధ్వంసం ఘటనలపై ఎస్పీ ఆరా
పోలింగ్ రోజున ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలపై పల్నాడు ఎస్పీ మలికాగార్గ్ ఆరా తీశారు. మంగళవారం ఆమె రెంటచింతల మండలం పాల్వాయిగేటు, తుమృకోట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. -
గూగులమ్మ ఇంట ఏఐ పంట
టెక్నాలజీ రంగంలో ఎక్కడ చూసినా కృత్రిమ మేధ (ఏఐ) హవానే. గూగుల్ వార్షిక డెవలపర్ సదస్సు ఏ/ఓ 2024 కూడా దీనికే పెద్ద పీట వేసింది. ఇటీవల జరిగిన ఈ సదస్సులో గొప్ప గొప్ప కృత్రిమ మేధ నమూనాలను ప్రదర్శించింది. -
ఏబీ వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా హైకోర్టులో వ్యాజ్యం
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ హైదరాబాద్లోని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఈనెల 8న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. -
ఎన్నికల ఘర్షణ కేసుల్లో 4,668 మంది గుర్తింపు
ఎన్నికల ముందు రోజు, ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసుల్లో 4,668 మందిని గుర్తించి కొంత మందిని అరెస్ట్ చేశామని, మరికొందరికి నోటీసులు జారీ చేశామని డీజీపీ హరీశ్కుమార్ గుప్తా తెలిపారు. -
సంక్షిప్త వార్తలు
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మంగళవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.