టిడ్కో ఇళ్లపై జగన్ పిడుగు
‘‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజల సొంతింటి కలను నిజం చేస్తాం... ఇళ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిస్తాం’’ అని ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి అరచేతిలో స్వర్గం చూపించారు.
అందమైన ఇళ్లు అన్నారు..
జగనన్న ఊళ్లు అన్నారు..
సీఎం మాటలు నమ్మిన పేదలు..
కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు.
ఐదేళ్లలో ఊళ్లు నిర్మించడం కాదు కదా...
చిన్నగూడు కూడా పూర్తి చేయలేదు...
గత ప్రభుత్వం కట్టిన టిడ్కో ఇళ్లనూ
కక్షతో గాలికొదిలేసిందీ వివక్ష సర్కారు!
‘‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజల సొంతింటి కలను నిజం చేస్తాం... ఇళ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిస్తాం’’ అని ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి అరచేతిలో స్వర్గం చూపించారు. అధికారంలోకి వచ్చాక అదే చేత్తో పేదల కంచంలో మట్టిపోశారు. బీదసాదల కోసమని గత ప్రభుత్వం చేపట్టి, దాదాపుగా పూర్తిచేసిన ‘టిడ్కో’ ఇళ్లను జగన్ మూలనపడేశారు. తలదాచుకోవడానికి తమకంటూ ఒక సొంతగూడు సమకూరబోతోందని సంతోషించిన లక్షలాది బడుగు జీవుల కళ్లల్లో కారంకొట్టారు.
బడుగుల నెత్తిన బండరాయి
ప్రజలకు మేలుచేసే పనులకు మోకాలొడ్డటంలో జగన్ ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా పట్టణ ప్రాంత పేదలకోసం ఉద్దేశించిన ‘టిడ్కో’ ఇళ్ల విషయంలో ఆయన నిర్వాకాలన్నీ ప్రజావ్యతిరేకమైనవే. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో గత తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 3.13 లక్షల నివాసగృహాల నిర్మాణం చేపట్టింది. అత్యాధునిక సాంకేతికతతో సకల సౌకర్యాలతో 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు కట్టించి లబ్ధిదారులకు అందజేయాలని నాటి సర్కారు తలపోసింది. అర్హతలకు అనుగుణంగా లబ్ధిదారులనూ ఎంపిక చేసింది. ‘టిడ్కో’ గృహాల నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో లక్షన్నర రూపాయల చొప్పున సాయంచేస్తాయి. లబ్ధిదారులు తమ వాటా కింద 300 చ.అ. ఇంటికి రూ.500 చెల్లించాలి. 365, 430 చ.అ. గృహ లబ్ధిదారులేమో రూ.50వేలు, లక్ష రూపాయల వంతున కట్టాలి. నిర్మాణవ్యయంలో ప్రభుత్వ రాయితీ, లబ్ధిదారుల వాటా పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణాల ద్వారా ‘టిడ్కో’ సమకూర్చుకుంటుంది. లబ్ధిదారుల పేరిట తీసుకునే ఆ అప్పులపై రెండేళ్ల మారటోరియం ఉంటుంది. ఆ లోపు పనులన్నీ పూర్తిచేసి లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించేస్తే, ఆపై నెలవారీ వాయిదాల్లో వారు రుణాలను తిరిగి చెల్లిస్తారు. ఈ పద్ధతిలో 2019 ఎన్నికల నాటికి 81,040 ఇళ్ల పనులు తొంభైశాతం పూర్తయ్యాయి. మరో 71,488 నివాస గృహాలేమో 75-90శాతం నిర్మితమయ్యాయి. జగన్కు నిజంగానే పేదలపై ప్రేమ ఉంటే- దాదాపుగా ఒక ఆకారానికి వచ్చిన ఆ ఇళ్లకు వీలైనంత త్వరగా తుదిమెరుగులు దిద్దించి, లబ్ధిదారులకు అందజేయాలి కదా. ఆ పని చేయడానికి ఆయనకు మనసొప్పలేదు. సరికదా- రాజకీయ రాగద్వేషాలతో పేదలకు తీరని అన్యాయం చేశారు. ‘‘ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా పక్కా ఇళ్లు కట్టిస్తాం’’ అని ఎన్నికల మ్యానిఫెస్టోలో, ప్రచార సభల్లో జగన్ ఊదరగొట్టారు. సీఎం కుర్చీ ఎక్కీ ఎక్కగానే ఆ వాగ్దానాన్ని ఏట్లో కలిపి 51,616 ‘టిడ్కో’ ఇళ్ల కేటాయింపులను రద్దు చేసి పారేశారు. తెదేపా సానుభూతిపరులు కావొచ్చు అన్న అనుమానంతో వేలాది సామాన్యులకు మొండిచెయ్యి చూపించి, వారి కుటుంబాల ఉసురుపోసుకున్నారు.
అడకత్తెరలో పోకచెక్కలు
రద్దు చేసినవి పోను మిగిలిన 2.62 లక్షల ఇళ్లనైనా జగన్ వేగంగా పూర్తిచేయించి, పంపిణీ చేశారా అంటే అదీ లేదు. మరేమి చేశారయ్యా ఆ మహానుభావుల వారంటే- ‘టిడ్కో’ కాలనీల పేరును ‘వైయస్ఆర్ జగనన్న నగర్’ అని మార్పించారు. ఆయా గృహసముదాయాలకు వైకాపా రంగులు కొట్టించారు. ఇదిగిదిగో ఇళ్లు సిద్ధమవుతున్నాయ్... అదిగదిగో ఆ రోజుకల్లా లబ్ధిదారుల చేతుల్లో తాళాలు పెట్టేస్తామంటూ మాయ మాటలు చెబుతూ కాలం గడిపేసింది జగన్ సర్కారు. దాంతో పట్టించుకునే నాథుడు లేక అప్పటికే ఒక కొలిక్కి వచ్చిన ‘టిడ్కో’ ఇళ్లకు చెదలు పట్టాయి. కొన్ని చోట్ల కిటికీలు, స్విచ్బోర్డులు, వైర్లు వంటివి దొంగల పాలయ్యాయి. తెదేపా హయాంలో గృహనిర్మాణాలకు రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చిన బ్యాంకులు- ఆర్థిక అరాచకత్వానికి పేరుమోసిన జగన్ జమానాలో వెనక్కిపోయాయి. దానికితోడు అంతకు మునుపు మంజూరైన రుణాలపై మారటోరియం గడువు తీరిపోవడంతో ఇళ్లు చేతిలోకి రాకమునుపే డబ్బులు తిరిగికట్టాల్సిన దుస్థితిలోకి చాలామంది లబ్ధిదారులు జారిపోయారు. ఒకపక్క ఇంటి అద్దెలు, మరోవైపు బ్యాంకు వాయిదాల చెల్లింపుల భారాన్ని పేదలపై మోపిన జగన్- వారి బతుకులను అడకత్తెరలో పడేశారు.
అక్షరాలా నయవంచన
మూడొందల చ.అ. ‘టిడ్కో’ గృహాలను రూపాయికే అందిస్తామన్న జగన్- 365, 430 చ.అ. ఇళ్ల లబ్ధిదారుల వాటాలోనూ యాభైశాతం రాయితీ ఇస్తామని ఊరించారు. సంబంధిత నిధుల విడుదలలోనూ విపరీతమైన జాప్యంతో బాధితుల శాపనార్థాలను చవిచూశారు. ఇలా లబ్ధిదారులకు రకరకాలుగా చుక్కలు చూపించిన జగన్- సంవత్సరాల తరబడి ‘టిడ్కో’ ఇళ్లకు బూజుపట్టించారు. పుణ్యకాలమంతా గడచిపోయాక గత నెలాఖరు నాటికి కేవలం 90,472 ఇళ్లను పంపిణీ చేశారు. కానీ, అందులోనూ ఆయన గొప్పేమీ లేదు. లబ్ధిదారులకు అందించిన ‘టిడ్కో’ ఇళ్లలో అత్యధికం తెదేపా ఏలుబడిలోనే దాదాపుగా సిద్ధమయ్యాయి. ఆయా గృహ సముదాయాల్లో మిగిలిపోయిన చిన్నాచితకా పనులు పూర్తిచేసి, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన జగన్ సర్కారు- వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. చాలాచోట్ల ఒట్టిగా ప్రచారంకోసం కనీస వసతుల్లేని ‘టిడ్కో’ ఇళ్లను లబ్ధిదారులకు అంటగట్టేసింది. దాంతో ఆ గృహాల్లోకి అడుగుపెట్టిన వారిలో అనేకులు నానా అగచాట్ల పాలవుతున్నారు. కరెంటు, తాగునీరు తదితరాలకూ దిక్కులేక అల్లాడిపోతున్నారు. ఆ గృహ సముదాయాల్లో సదుపాయాలన్నీ ఎప్పటికీ ఏర్పాటవుతాయో, మిగిలిన 1.70 లక్షలకు పైగా ‘టిడ్కో’ ఇళ్లు పూర్తయ్యేది ఎన్నటికో ఎవరికీ తెలియదు. జగన్ చేతకానితనం, ప్రజాప్రయోజనాలను నెరవేర్చడంలో ఆయన నేరపూరిత నిర్లక్ష్యాల ఫలితమిది. పేదలతో ఆశల మేడలు కట్టించి, వాటినే మెట్లుగా మార్చుకుని అధికార పీఠాన్ని అధిరోహించిన వైకాపా అధినేత దగాకోరు పాలన ప్రతిఫలమిది!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. -
సింహాచలంలో విద్యుత్ బస్సు
తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
కిర్గిజ్స్థాన్లో దాడులు.. ఇక్కడి తల్లిదండ్రుల్లో ఆందోళన
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో గత రెండు రోజులుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ గొడవలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వైద్య విద్యకు ఏపీ నుంచి కిర్గిజ్స్థాన్ వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. -
వైభవంగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు రెండో రోజు శనివారం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరారు.