జగన్ పెత్తనం.. పట్టణాలకు పెనుశాపం!
‘నగరాలు, పట్టణాల్లో రోడ్లు, మురుగు నీటి కాల్వలు సహా ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలి’’ అని సీఎంగా చిటికెల పందిళ్లు వేశారు జగన్.
‘‘నగరాలు, పట్టణాల్లో రోడ్లు, మురుగు నీటి కాల్వలు సహా ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలి’’ అని సీఎంగా చిటికెల పందిళ్లు వేశారు జగన్. అదే మనిషి.. రోడ్ల మీది గుంతల్లో పట్టణాభివృద్ధిని పాతిపెట్టేశారు. ఆస్తిపన్నును అడ్డగోలుగా పెంచేసిన జగన్- మౌలిక సదుపాయాల కల్పనకు నిధులివ్వకుండా నగరాలను నరక కూపాలుగా మార్చేశారు. చెత్తపన్నుతో జనాన్ని చావగొట్టి, వాళ్ల కష్టార్జితాలను కొల్లగొట్టేశారు. ఆపై ఎక్కడి చెత్త కుప్పలను అక్కడే వదిలేసి ప్రజారోగ్యాన్ని జబ్బుల పాల్జేశారు. మంచినీళ్లు రావు.. మురుగునీళ్లు పోవు.. వీధి దీపాలు వెలగవు.. వైకాపా విధ్వంసక ఏలుబడిలో పట్టణ, నగరవాసుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చెత్తపాలనతో ప్రజలను చిత్రవధ చేసిన జగన్ పాతకాలెన్నో లెక్కతేల్చడం ఆ చిత్రగుప్తుడి వల్ల కూడా కాదు!
రాజ్యాంగ ద్రోహి జగన్
ప్రజాస్వామ్య పునాదులపై పట్టణ ప్రాంతాలు సమగ్ర అభివృద్ధికి నోచుకోవాలన్న లక్ష్యంతో 74వ రాజ్యాంగ సవరణ జరిగింది. దాని ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత లభించింది. పుర పాలికలు స్వపరిపాలనా సంస్థలుగా పని చేసేందుకు అవసరమైన తోడ్పాటును రాష్ట్ర ప్రభుత్వం అందించాలని 243(డబ్ల్యూ) రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తోంది. ప్రజాస్వామ్యం పేరు వింటేనే ఒంటిపై తేళ్లూ జెర్రులు పాకినట్లు కంపరమెత్తిపోయే జగన్- రాజ్యాంగ ఆశయాలను పాతాళానికి తొక్కేశారు. పురపాలక సంఘాల నిధులను దొడ్డిదారిలో తన వశం చేసుకుని- స్థానిక ప్రభుత్వాల స్వతంత్రతకు సమాధికట్టారు. ‘‘ఆర్థికంగా బలంగా లేని మున్సిపాలిటీలకు నిధులు సమకూర్చడంలో ఉన్న ఇబ్బందులను తొలగించాలి’’ అని 2020లో జగన్ మహా గొప్పగా సెలవిచ్చారు. అదే చేతల్లోకి వచ్చేసరికి పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లోని సొమ్మునూ తన గుప్పిట్లోనే పెట్టేసుకున్నారు. మొన్న ఫిబ్రవరి నాటికి మున్సిపాలిటీలకు రూ.450 కోట్ల వరకు బకాయిలను పేరబెట్టారు జగన్. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులపైనా కర్రపెత్తనం చేసిన జగన్- పట్టణ ప్రాంత ప్రజలను సమస్యల సుడిగుండంలోకి నెట్టేశారు. పగిలిపోయిన తాగునీటి పైపులైన్లను మార్చడం నుంచి దోమల నివారణ దాకా దేనికీ మున్సిపాలిటీల దగ్గర డబ్బు లేకుండా చేశారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో అత్యధికం వైకాపా చేతుల్లోనే ఉన్నాయి. అయినా ప్రజాసమస్యలేవీ తీరడం లేదంటే కారణం జగనే. పాలనలో దార్శనికత, ప్రజల బాగోగులపై పట్టింపు లేని ఆయన వల్ల ఏపీలోని పట్టణాలన్నీ ప్రగతికి దూరమయ్యాయి.
పచ్చి మోసాల మనిషి!
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్రెడ్డి కోయని కోతల్లేవు. ‘‘జగన్ ఏదైనా చెబితే చేస్తాడన్న విశ్వసనీయతే నాకున్న ఆస్తి’’ లాంటి డైలాగులు చెబుతూ అప్పట్లో ఆయన ఊరూరా ఏకపాత్రాభినయాలు చేశారు. ‘‘నంద్యాల అభివృద్ధిని నాకు వదిలేయండి.. సీఎం కుర్చీలో కూర్చున్నాక దాన్ని పరుగులు పెట్టిస్తా’’ వంటి వాగ్దానాలతో ప్రతి చోటా జనాన్ని బులిపించారు జగన్. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకును పట్టి చూస్తే తెలిసిపోతుంది. నంద్యాల దుర్గతిని చూస్తే చాలు- జగన్మోహన్రెడ్డి అంటే మాట తప్పి మడమ తిప్పే పచ్చి మోసాల మనిషి అని తేలిపోతుంది. ముఖ్యమంత్రి అయ్యాక నంద్యాలను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతానన్న జగన్- ఆఖరికి అక్కడ కనీసం మురుగునీటి కాల్వల నిర్మాణాన్ని కూడా పూర్తిచేయలేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు తదితర నగరాల్లో మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో నడుంకట్టింది. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా కేంద్ర నిధులతో వందల కిలోమీటర్ల మేర పనులు చేయించింది. అవి పూర్తయ్యే లోపే ప్రభుత్వం మారిపోయింది. అభివృద్ధిని అసహ్యించుకునే జగన్ జమానాలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనులు ఎక్కడికక్కడ పడకేశాయి. దాంతో చిన్న చినుకు పడితే చాలు- రోడ్లన్నీ మురుగునీటి చెరువులవుతున్నాయి. డోన్ వంటి పట్టణాల్లో కాల్వల్లేక ఇళ్లలో వాడుకునే నీళ్లన్నీ వీధులను ముంచెత్తుతున్నాయి. అనంతపురం, ఆత్మకూరు, గుత్తి, గుంతకల్లు, గూడూరు తదితర చోట్ల మురుగు కంపును భరించలేక జనం నానా పాట్లూ పడుతున్నారు. ప్రజాసమస్యల పరిష్కారాన్ని పక్కకు తోసేసిన జగన్ ప్రత్యర్థులపై పగ సాధించడానికే పదవిని వాడుకున్నారు.
జగన్ సర్వభ్రష్ట పాలన
‘‘మురుగునీరు నేరుగా నదుల్లో కలవకుండా చూడాలి. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలి’’ అంటూ నీతిశతకాలెన్నో చెప్పిన జగన్- ఆ పనులకు నిధులేమీ విదల్చలేదు. కేంద్ర ప్రభుత్వ ‘అమృత్’ పథకం కింద తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో వందల కోట్ల రూపాయలతో కొత్త మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు పనులు ప్రారంభించింది. వాటిని పూర్తి చేస్తే ప్రజారోగ్యానికి రోగాల ముప్పు ఉండదని తెలిసినా జగన్ ఆ పని చేయలేదు. ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్వహణ లోపాలతో మూతపడుతున్నా ఆయన బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నారు. దానివల్ల ఏమైంది.. పట్టణాలు, నగరాల్లో రోజూ ఉత్పత్తయ్యే 288 కోట్ల లీటర్ల మురుగునీటిలో ఎనభై శాతానికి పైగా జలవనరుల్లోనే కలుస్తున్నాయి. దానిమూలంగా గోదావరి, కృష్ణా, నాగావళి, పెన్నా, తుంగభద్ర నదులన్నీ కాలుష్య కాసారాలవుతున్నాయి. చిత్తూరులోని నీవా నది ఒకప్పుడు ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేది. ఇళ్లలోని మురుగు అంతా దాని కడుపులోకే చేరుతుండటంతో ఇప్పుడది అధ్వానంగా తయారైంది. మురుగునీటి శుద్ధి కేంద్రాలు కొరవడటంతో రాష్ట్రవ్యాప్తంగా అరవైకి పైగా పట్టణాల్లో వ్యర్థజలాలన్నీ నేరుగా నదుల్లోకి వచ్చిపడుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే- జగన్ మోహన్రెడ్డి సర్వభ్రష్ట పాలనకు సాక్ష్యాలెన్నో కనపడతాయి.
నోట్లో బెల్లం.. కడుపులో విషం!
‘‘77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎవరూ చేయని మార్పులు మనం చేశాం’’ అని ఎన్నికల ప్రచార సభల్లో జగన్ దరువేసుకుంటున్నారు. జనం సొమ్మును కాజేసేందుకు కొత్త కుటిల మార్గాలు కనిపెట్టడం తప్ప జనం బతుకుల్లో ఆయన తెచ్చిన మార్పులేమీ లేవు. నోట్లో బెల్లం, కడుపులో విషం పెట్టుకుని రాష్ట్రాన్ని పాలించిన జగన్- చెత్తపన్ను రూపేణా ప్రజలపై రూ.400 కోట్ల అదనపు భారాన్ని మోపారు. ఆస్తిపన్ను బాదుడుతో మరో రూ.950 కోట్లకు పైగా బరువును జనం నెత్తిన పెట్టారు. ఒకపక్క అంత డబ్బును లాక్కుంటూనే- పట్టణాల్లో కనీసం చెత్తకుప్పల బెడదనూ జగన్ తప్పించలేదు. పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగు పరిచేందుకు చెత్తనుంచి ఎరువులను తయారుచేయడం, బయోగ్యాస్ను ఉత్పత్తి చేయడం వంటి వాటికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. ఘనవ్యర్థాల నిర్వహణలో జాతీయస్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసింది. జగన్ వినాశక ఏలుబడిలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఎరువుల తయారీ పరిశ్రమలూ బయోగ్యాస్ ప్లాంట్లు మూతపడ్డాయి. డంపింగ్ యార్డుల్లో బయోమైనింగ్ మందగించింది. రోడ్లపక్కన, చెరువుల్లో చెత్తను కుప్పపోసే దృశ్యాలు ఇప్పుడు అనేక పట్టణాల్లో కనపడుతున్నాయి. తిరుపతి, ఎమ్మిగనూరు, తాడిపత్రి, కనిగిరి, పొన్నూరు, రాజమహేంద్రవరం, ఏలేశ్వరం, కాకినాడ, సాలూరు.. ఇలా ప్రతిచోటా పాలనలో జగన్ నేరపూరిత నిరక్ష్యానికి నిదర్శనంగా అపరిశుభ్రత తాండవిస్తోంది. దోమల దండయాత్రలతో ప్రజానీకం రోగాల పాలవుతోంది.
జగన్ ఒక తేనెపూసిన కత్తి!
తేనెపూసిన కత్తిలాంటి వ్యక్తిత్వం జగన్ది. అందుకే ఆయన మాటలకూ చేతలకూ పొంతన ఉండదు. నగరాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లను విస్తరించాలంటూ అధికారులకు ఉచిత సలహాలు అనేకం ఇచ్చారు జగన్. అలా వట్టి పోసుకోలు కబుర్లు చెప్పడమే తప్ప, రోడ్లపై గుంతలను పూడ్పించడానికీ ఆయన సొమ్ములివ్వలేదు. పురపాలక నిధులను జగన్ బిగపట్టేయడంతో రోడ్లూ కల్వర్టుల నిర్మాణం, మరమ్మతుల వంటివన్నీ ఆగిపోయాయి. వానాకాలంలో వెల్లువెత్తే వరదనీరు వల్ల నగర జీవనం ఎంత దుర్భరం అవుతుందో అందరికీ తెలిసిందే. ఆ సమస్యను రూపుమాపడానికి తెలుగుదేశం ప్రభుత్వం రూ.2,048 కోట్లు కేటాయించి 2,381 కిలోమీటర్ల మేర వరదనీటి కాల్వలను కట్టించింది. మరో 3,915 కి.మీ.ల మేర కాల్వల నిర్మాణ పనులనూ చేపట్టింది. వైకాపా హయాంలో ఆ పనులన్నీ పక్కకు పోయాయి. తాను సీఎం అయినప్పటి నుంచి నిరుడు డిసెంబరు నాటికి కేవలం 162 కి.మీ. మేర వరదనీటి కాల్వల నిర్మాణాన్నే పూర్తి చేయగలిగారు జగన్. దానిమూలంగా వానలొస్తే చాలు- రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలన్నీ మునిగిపోతున్నాయి. తాగునీటి ప్రాజెక్టులనూ అటకెక్కించిన వైకాపా అధినేత కారణంగా పట్టణాల్లో దాహార్తి కేకలు మిన్నంటుతున్నాయి. అలాంటి జగన్ ఇప్పుడు రోడ్డెక్కి ‘‘అయిదేళ్ల పాలనలో మేలు చేసి చూపించి ప్రజల ఇళ్ల వద్దకు వెళ్తున్నాం’’ అంటూ సిగ్గుమాలిన స్వోత్కర్షలు చేసుకుంటున్నారు.
పట్టణాంధ్రకు ప్రథమ శత్రువు
ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిస్తూ, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో పట్టణాలు, నగరాలు కీలకపాత్ర పోషిస్తాయి. మౌలిక వసతులతో తులతూగే నగరాలకు పెట్టుబడులూ విరివిగా వస్తాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నాయి. ఆ క్రమంలోనే అమరావతి, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలను స్మార్ట్సిటీలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రంతో కలిసి రూ.4 వేల కోట్లతో తెదేపా ప్రభుత్వం పలు ప్రాజెక్టులను చేపట్టింది. ముఖ్యమంత్రి కాగానే అమరావతికి ఉరిపోసిన జగన్- రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. స్మార్ట్సిటీ ప్రాజెక్టులకు అవసరమైన నిధులివ్వని జగన్ జగమొండితనం వల్ల మిగిలిన మూడు నగరాల్లోనూ ప్రజోపయోగ పనులు పూర్తి కాలేదు. స్మార్ట్సిటీల తరహాలోనే శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం నగరాల సమగ్రాభివృద్ధికి తెదేపా సర్కారు అప్పట్లో బృహత్తర ప్రణాళికలు సిద్ధంచేసింది. వాటికి చెదలు పట్టించిన జగన్- పట్టణాంధ్రకు ప్రథమ శత్రువు అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. -
సింహాచలంలో విద్యుత్ బస్సు
తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు.