సంక్షిప్త వార్తలు (9)
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను వారికి అందజేశామని పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) మహేశ్వరరెడ్డి మంగళవారం హైకోర్టుకు తెలిపారు.
అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను అందజేశాం
హైకోర్టుకు నివేదించిన ఎస్జీపీ
ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను వారికి అందజేశామని పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) మహేశ్వరరెడ్డి మంగళవారం హైకోర్టుకు తెలిపారు. ఈ అంశంపై తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీకి వినతి సమర్పించడంతో సంబంధిత సమాచారాన్ని ఇచ్చామని పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సైతం వివరాలు అందినట్లు కోర్టుకు తెలిపారు. వాటిని నమోదు చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి వ్యాజ్యాలను పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అందుబాటులో ఇంటర్ షార్ట్ మెమోలు
ఈనాడు, అమరావతి: ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్ షార్ట్ మెమోలను ఇంటర్మీడియట్ విద్యామండలి వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. హాల్టికెట్ నంబరు, పుట్టిన తేదీల ద్వారా ఈ మెమోలను పొందవచ్చు. వీటిల్లో మార్కులతో పాటు గ్రేడ్లనూ పొందుపరిచారు.
సవాళ్లను అధిగమించే శక్తినివ్వాలి: గవర్నర్
ఈనాడు, అమరావతి: శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ధర్మం, ప్రేమ, సంతోషంతో కూడిన జీవితాన్ని గడిపేందుకు పురుషోత్తముడైన శ్రీరాముడు మనందరికీ మార్గదర్శనం చేయాలని.. సవాళ్లను అధిగమించేందుకు శక్తి, ధైర్యం అందిస్తూ ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం’ అని ప్రజలకు సందేశమిచ్చారు.
అవినీతిని వీరేశలింగం ఆనాడే ఎత్తిచూపారు
తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: సామాజిక దురాచారాలపై కందుకూరి వీరేశలింగం పంతులు చేసిన పోరాటం చిరస్మరణీయమని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఆనాడే ఆయన ఎత్తిచూపారని పేర్కొన్నారు. వీరేశలింగం జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా తెలుగుప్రజలకు సందేశమిచ్చారు. ‘మహిళల అభ్యున్నతికి బాటలు వేయడంలో ఆయనే స్ఫూర్తి. ఈ స్ఫూర్తికి పునరంకితమవుదాం’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
మూఢ నమ్మకాలపై అలుపెరగని పోరాటం చేసిన అనేక మంది సంఘసంస్కర్తలకు వీరేశలింగం స్ఫూర్తిగా నిలిచారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించి.. బాలికా విద్యపై ఆయన అవగాహన కల్పించారని ఎక్స్ వేదికగా కొనియాడారు.
ఉపాధి కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలి
ఈనాడు డిజిటల్, అమరావతి: ఉపాధి కూలీల బకాయిలను వెంటనే చెల్లించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కన్నబాబుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దడాల సుబ్బారావు, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. రెండు నెలలుగా సుమారు రూ.208 కోట్లు బకాయి ఉన్నట్లు మంగళవారం ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
సుజనా చౌదరి వ్యాజ్యం 19కి వాయిదా
ఈనాడు, అమరావతి: విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి వై.సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి) మంగళవారం అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారణ చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్చంద్ర వాదనలు వినిపిస్తూ.. అయిదుగురు ఎస్పీలను కేసుల వివరాలివ్వాలని కోరామన్నారు. అందులో ఇద్దరు మాత్రమే సమాచారం ఇచ్చారని తెలిపారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని హోం శాఖ జీపీని ఆదేశించారు. విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.
బాబ్లీ కేసు విచారణ 23కు వాయిదా
బోధన్ గ్రామీణం, పెద్దపల్లి, న్యూస్టుడే: బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలీ కోర్టులో మరోసారి ఈ నెల 23కు వాయిదా పడింది. మంగళవారం జరిగిన విచారణకు.. తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, చింతకుంట విజయరమణారావు, ప్రకాశ్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్షిండే, కేఎస్ రత్నం, ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనంద్బాబు తదితరులు హాజరయ్యారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సహా 9 మంది నాయకులు కేసు విచారణకు హాజరు కాలేదు.
కఠినశిక్ష పడేలా చేయడంలో ప్రభుత్వం విఫలం: కేవీపీఎస్
ఈనాడు డిజిటల్, అమరావతి: తోట త్రిమూర్తులుకు కఠినశిక్ష పడేలా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నల్లప్ప, మాల్యాద్రి విమర్శించారు. ఈ కేసులో బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని మండిపడ్డారు.
కవిత బెయిల్ పిటిషన్పై విచారణ 22కి వాయిదా
ఈనాడు, దిల్లీ: ఈడీ తనపై నమోదుచేసిన కేసులో పూర్తిస్థాయి బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. మంగళవారం దీనిపై విచారణ జరగాల్సి ఉన్నా రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా సెలవుపై వెళ్లడంతో కేసు తదుపరి విచారణను 22కి వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. -
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి.. అప్పుడలా..ఇప్పుడిలా..
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై