నీరుగార్చే ప్రయత్నాలెన్నో..
దళిత బాధితుల తరపున.. 28 ఏళ్ల కాలంలో అయిదుగురు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (పీపీ) వాదనలు వినిపించగా, వారిలో ముగ్గురిని వివిధ ఆరోపణలపై పక్కకు తప్పించారంటే శిరోముండనం కేసు ఎన్ని అవరోధాల నడుమ సాగిందో అర్థమవుతోంది.
ఈనాడు-విశాఖపట్నం, కాకినాడ: దళిత బాధితుల తరపున.. 28 ఏళ్ల కాలంలో అయిదుగురు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (పీపీ) వాదనలు వినిపించగా, వారిలో ముగ్గురిని వివిధ ఆరోపణలపై పక్కకు తప్పించారంటే శిరోముండనం కేసు ఎన్ని అవరోధాల నడుమ సాగిందో అర్థమవుతోంది. వైకాపా సర్కారు నుంచీ బాధితులకు సరైన సహకారం లభించలేదు. వారికి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి ప్రభుత్వం మోకాలడ్డిందంటే.. నిందితులపై ఎంత ప్రేమ చూపిందో అర్థమవుతుంది. తొలుత రఫీ అహ్మద్ అనే పీపీని నియమించారు. తర్వాత జవహర్ నియమితులయ్యారు. ఆయన తమను బెదిరిస్తున్నారని ప్రధాన నిందితుడిగా ఉన్న తోట త్రిమూర్తులు ఫిర్యాదు చేయడంతో జవహర్ను మార్చారు. అనంతరం సలాది శ్రీనివాస్ను నియమించగా.. ‘నిందితుడు, ఆయన ఒకే సామాజికవర్గానికి చెందిన వారు’ అని బాధితులు అభ్యంతరం తెలిపారు. తర్వాత పీపీగా సుజాతను నియమించగా, అదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన కీలక పత్రాలు కోర్టు నుంచి మాయమయ్యాయి. దీంతో బాధితులు నానా తిప్పలు పడి కొత్తగా కుల ధ్రువీకరణ పత్రాలను తెచ్చి పీపీ సుజాతకు ఇచ్చారు.
అవి కాస్తా హుద్హుద్ తుపాన్లో పోయాయని ఆమె చెప్పడంతో బాధితులు హైకోర్టుకు ఆశ్రయించారు. ఆమెను ఈ కేసు నుంచి తప్పించాలని 2016లో హైకోర్టు సూచించింది. తర్వాత 2018 నుంచి పీపీగా సత్యనారాయణమూర్తి వాదనలు వినిపిస్తున్నారు. ప్రధాన నిందితుడైన తోట త్రిమూర్తులు.. ఈ కేసును నీరుగార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దీంతో బాధితులు న్యాయం కోసం.. సుదీర్ఘ పోరాటం సాగించాల్సి వచ్చింది. ఫలితంగానే తోట త్రిమూర్తులుపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. 87 రోజులపాటు జైల్లో రిమాండ్లో ఉంచారు. జస్టిస్ పుట్టుస్వామి కమిషన్ ఆయనకు క్లీన్చిట్ ఇవ్వడంతో బాధితులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. 2008లో కేసును రీఓపెన్ చేశారు. 2014లో ప్రముఖ దళిత న్యాయవాది బొజ్జా తారకం ఆధ్వర్యంలో 2015 జనవరి 8న హైకోర్టులో రిట్ పిటిషన్ (మాండమస్) వేశారు. దీనిపై విచారణ జరిపి కేసును త్వరగా తేల్చి బాధితులకు న్యాయం చేయమని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎట్టకేలకు 2017లో విశాఖలోని ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది.
కుల ధ్రువీకరణకూ మోకాలడ్డిన వైకాపా సర్కారు
బాధిత దళితులు వైకాపా ప్రభుత్వంలో.. తమ కులధ్రువీకరణ పత్రాల కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. వారు ఎస్సీ కులానికి చెందినవారు కాదని క్రైస్తవ మతానికి చెందినవారని, బీసీ-సి కిందకు వస్తారని ఫిర్యాదులు వెళ్లాయి. ప్రభుత్వం విచారణకు జేసీ కోర్టు ఏర్పాటు చేసింది. ఎట్టకేలకు 2019 జూన్ 27న బాధితులకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరయ్యాయి. అవి చెల్లవంటూ వెంకటాయపాలేనికి చెందిన కొందరు, తోట త్రిమూర్తులు హైకోర్టును ఆశ్రయించారు. బాధితులకు కుల ధ్రువీకరణ ఇవ్వాల్సిందేనని జడ్జి ఆదేశించారు. దీంతో రామచంద్రపురం తహసీల్దారు డివిజన్ బెంచ్కు వెళ్లగా, ఆ బెంచ్ అప్పీల్ను డిస్మిస్ చేసింది. ఇంతజరిగినా సింగిల్ బెంచ్ తీర్పును అధికారులు అమలు చేయకపోవడంతో బాధితులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తీర్పు ఇస్తూ కేసు విచారణ కొనసాగించమని 2019లో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆదేశించారు. ఇలా ఈ కేసులో ఏళ్ల తరబడి జాప్యానికి వైకాపా ప్రభుత్వమూ కారణమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. -
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి.