Heavy Rain: పంటనష్టం రూ.3,300 కోట్లు
వరి ఊడ్చుకుపోయింది.. సెనగ పొలంలోనే కుళ్లిపోయింది.. పత్తి పూత, కాయ రాలిపోయింది.. ఇవే కాదు, మినుము, మొక్కజొన్న, చెరకు తదితర పంటలు వేల ఎకరాల్లో చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో సాగుదారులకు...
వర్షాలకు కుళ్లిపోతున్న వరి, సెనగ, మినుము పంటలు
నీరు నిలిచి మిరపకు దెబ్బ
కుంగిపోతున్న అన్నదాత
ఈనాడు, అమరావతి: వరి ఊడ్చుకుపోయింది.. సెనగ పొలంలోనే కుళ్లిపోయింది.. పత్తి పూత, కాయ రాలిపోయింది.. ఇవే కాదు, మినుము, మొక్కజొన్న, చెరకు తదితర పంటలు వేల ఎకరాల్లో చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో సాగుదారులకు కంటిమీద కునుకు కరవైంది. కదిలిస్తే చాలు కన్నీరు.. వరదై పారేలా ఉంది. నవంబరు నెలలో కురిసిన వానలకు ప్రభుత్వ అంచనాల ప్రకారమే 13 జిల్లాల్లో 13.24 లక్షల ఎకరాల్లో రూ.3,300 కోట్ల పంటనష్టం వాటిల్లింది. అంతకుముందు జూన్ నుంచి అక్టోబరు వరకూ జరిగిన నష్టమూ తక్కువేమీ కాదు. తొలకరిలో వేసిన పంట చేతికొచ్చే సమయంలో కుండపోత వానలకు అనంతపురం, చిత్తూరు జిల్లాలో లక్షల ఎకరాల్లో పశువుల మేతకూ పనికిరాని విధంగా దెబ్బతింది. మరోపక్క ఆశించిన వర్షాల్లేక కర్నూలు జిల్లాలో దెబ్బతింది. కొన్ని ప్రాంతాల్లో గులాబ్ తుపాను ధాటికి వరితో పాటు ఇతర పంటలూ పాడయ్యాయి. వైరస్, తామరపురుగు మిరప మొక్కల్ని పీల్చివేస్తుండటంతో రైతులు పంటనే దున్నేస్తున్నారు. దెబ్బమీద దెబ్బలా నవంబరులో కురిసిన వానలు సాంతం ఊడ్చిపెట్టేశాయి.
అన్ని ప్రాంతాల్లోనూ అదే వ్యధ
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లో నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న వరి 6.10 లక్షల ఎకరాల్లో దెబ్బతింది. రైతులు ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టగా.. గింజ కూడా చేతికిరాని వారు లక్షల్లో ఉన్నారు. కడప, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల నేలవాలింది. రబీలో ప్రధాన పంటగా సాగయ్యే సెనగ నవంబరు మొదటి, రెండో వారంలో కురిసిన వానలకు కుళ్లిపోయింది. నవంబరు మూడో వారంలో ముంచెత్తిన వానలు, వరదలకు కడప, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెనునష్టం సంభవించింది. వరి, సెనగ, మొక్కజొన్న, మిరప, మినుము, వేరుశనగ తదితరాలు అధికంగా దెబ్బతిన్నాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టినా రూపాయి కూడా చేతికి వచ్చేలా లేదని అన్నదాతలు వాపోతున్నారు.
సెనగ... రెండోసారి పెట్టుబడి
రబీలో వరి తర్వాత ప్రధాన పంట సెనగ. నవంబరులో కురిసిన వానలకు మొలక దశలోనే కుళ్లిపోయింది. సాగుకు ఎకరాకు రూ.10వేల వరకు ఖర్చయ్యింది. దీనికి ఇంకా ఈ-క్రాప్ కూడా నమోదుకాలేదు. కడప జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో విత్తనం వేశారు. పంటనష్టం కింద నమోదు చేయలేదని, బీమా వస్తుందో లేదోనని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం విత్తనాలను మాత్రమే రాయితీపై ఇస్తోంది. రైతులు మళ్లీ సెనగ వేసేందుకు రెండోసారి పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది.
పంటను దున్నేస్తున్నారు
మిరప సాగు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో అధికం. రాయలసీమ జిల్లాల్లో ఈ ఏడాది సాగు పెరిగింది. రైతులు ఎకరాకు రూ.70వేల నుంచి రూ.90 వేల వరకు వెచ్చించారు. తెగుళ్ల నివారణకు పురుగు మందులు చల్లుతున్న దశలోనే వర్షాల కారణంగా దెబ్బతింది. అనంతపురం జిల్లాలోనే సుమారు 11వేల ఎకరాల వరకు పాడైనట్లు అంచనా. పలుచోట్ల పంటల్ని దున్నేస్తున్నారు.
రోజుల తరబడి తడవడంతో..
చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం తిరుమలరాజుపురం రైతు అన్నామలైరెడ్డి 1.50 ఎకరాల్లో వరి వేస్తే రూ.35 వేలు ఖర్చయ్యింది. వానలకు కోత దశలోని పైరు నేలవాలింది. రోజుల తరబడి తడవడంతో వడ్లు పొలంలోనే కుళ్లి, మొలకెత్తుతున్నాయని చెబుతున్నారు.
10లో ఆరెకరాలు వర్షార్పణం
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతికి చెందిన వెంకటేశ్.. పది ఎకరాల్లో మిరప వేశారు. ఎకరాకు రూ.90వేల వరకు ఖర్చయింది. మొన్నటి వర్షం దెబ్బకు 80% పంట దెబ్బతింది. ‘ఆరెకరాల వరకు పోయినట్లే. విత్తనాలకే రూ.80 వేలు ఖర్చయింది’ అని వాపోయారు.
పైసా కూడా చేతికొచ్చేలా లేదు
నెల్లూరు జిల్లా కలిగిరికి చెందిన నరసింహారెడ్డి 13 ఎకరాల్లో మినుము వేస్తే.. వర్షాలకు పూర్తిగా పాడైపోయింది. ఎకరాకు రూ.13వేల పెట్టుబడి పెట్టారు. పైసా కూడా చేతికొచ్చేలా లేదని, రూ.1.50 లక్షల దాకా నష్టపోతున్నట్లు వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్ వాపోయారు. -
గులకరాయి ఘటనను ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
పింఛను కుట్ర.. తీస్తోంది ప్రాణం
సీఎం గారూ.. పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? -
సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!
ఫుట్బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. -
సీఎం జగన్ను ఓడించడమే మా లక్ష్యం
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. -
యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది
‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. -
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం ‘వైనాట్.. 175’ అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? ఎందుకీ ఎదురుగాలి.. అని మదన పడుతున్నారా? -
వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి
మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి గడువు పొడిగించాలి
పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. -
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
సీఎం జగన్ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా... అక్కడ విధ్వంసం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సిద్ధం సభ జరిగింది. -
‘అ’భివృద్ధి ‘నిల్’.. అవినీతి ఫుల్!
ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్ అనగానే టక్కున గుర్తుకొస్తారు. జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM