ATF Price hike: జనవరిలో రెండోసారి పెరిగిన విమాన ఇంధన ధరలు

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నందున విమాన ఇంధన (ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌-ఏటీఎఫ్‌) ధరను 4.2 శాతం పెంచినట్లు ఆదివారం చమురు మార్కెటింగ్‌ సంస్థలు ప్రకటించాయి...

Published : 16 Jan 2022 21:43 IST

దిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నందున విమాన ఇంధన (ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌-ఏటీఎఫ్‌) ధరను 4.2 శాతం పెంచినట్లు ఆదివారం చమురు మార్కెటింగ్‌ సంస్థలు ప్రకటించాయి. ఈ నెలలో ధరలు పెరగడం ఇది రెండోసారి. కానీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మాత్రం గత 72 రోజులుగా ఎలాంటి మార్పు లేకపోవడం విశేషం.

విమానాల ఇంధన ధర దిల్లీలో కిలోలీటర్‌కు రూ.3,232.87 పెరిగి, రూ.79,294.91కి చేరింది. జనవరి 1నే ఏటీఎఫ్‌ ధరను 2.75 శాతం అంటే కిలోలీటర్‌కు రూ.2,039.63 పెంచారు. నవంబరు 2021 మధ్యలో ఏటీఎఫ్‌ ధరలు కిలోలీటర్‌కు రూ.80,835.04 వద్ద గరిష్ఠానికి చేరాయి. దీంతో డిసెంబరు 1, 15న రెండు దఫాల్లో 8.4 శాతం మేర ధరల్ని తగ్గించారు. దీంతో డిసెంబరు చివరికి కిలోలీటర్‌ ఏటీఎఫ్‌ ధర గరిష్ఠం నుంచి రూ.6,812.25 తగ్గింది. కానీ, తిరిగి జనవరిలో ధరలను పెంచుతుండడం గమనార్హం.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర నవంబరు 5, 2021న 82.74 డాలర్లకు చేరింది. అనంతరం డిసెంబరు 1 నాటికి 68.87 డాలర్లు పడిపోయింది. దీంతో చమురు మార్కెటింగ్‌ సంస్థలు డిసెంబరులో ఏటీఎఫ్‌ ధరల్ని తగ్గించాయి. తర్వాత ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 85 డాలర్ల వద్ద ఉంది. దీంతో ఏటీఎఫ్‌ ధరల్ని సంస్థలు మళ్లీ పెంచుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు