JIO: ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ బాటలో జియో.. ఛార్జీలు పెంపు!

మొబైల్‌ వినియోగదారులకు మరో షాక్‌. ప్రముఖ టెలికాం కంపెనీ జియో కూడా ఛార్జీలను సవరించింది. 20 శాతం మేర ఛార్జీలు పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించింది.

Updated : 28 Nov 2021 20:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్‌ వినియోగదారులకు మరో షాక్‌. ప్రముఖ టెలికాం కంపెనీ జియో కూడా ప్రీపెయిడ్‌ ఛార్జీలను సవరించింది. 20 శాతం మేర ఛార్జీలు పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించింది. పెంచిన ఛార్జీలు డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇటీవల ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. అదే బాటలో ఇప్పుడు జియో కూడా నడిచింది.

టెలికాం పరిశ్రమను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఛార్జీలను పెంచుతున్నట్లు జియో ఓ ప్రకటనలో తెలిపింది. సవరించిన అన్ని ప్లాన్ల వివరాలను వెల్లడించింది. జియో ఫోన్‌ సహా, అన్‌లిమిటెడ్‌ ప్రీపెయిడ్‌, డేటా-ఆన్స్‌ ధరలు కూడా పెరిగాయి. జియో ఫోన్‌ కోసం అందుబాటులో ఉన్న ప్రాథమిక ప్లాన్‌కు రూ.75 బదులు ఇకపై రూ.91 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ.199 ప్లాన్‌ (28 రోజులకు 1.5జీబీ/రోజుకు) ధరను రూ.239కు జియో పెంచింది. అలాగే, రూ.444 ప్లాన్‌కు రూ.533, రూ.555 ప్లాన్‌కు రూ.666 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త ప్లాన్ల వివరాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు