China: భారత్పై దుష్ప్రచారమే లక్ష్యంగా చైనా నుంచి నకిలీ ఫేస్బుక్ ఖాతాలు
China: భారత్ సహా కొన్ని కీలక దేశాలపై తప్పుడు వార్తలను ప్రచారం చేయడమే లక్ష్యంగా చైనా గడ్డ నుంచి కొన్ని నకిలీ ఫేస్బుక్ ఖాతాలు ఉద్భవిస్తున్నాయని మెటా నివేదిక వెల్లడించింది.
దిల్లీ: భారత్పై విషం చిమ్మడమే లక్ష్యంగా చైనా గడ్డ నుంచి ఉద్భవిస్తున్న నకిలీ ఫేస్బుక్ ఖాతాల (Fake Facebook accounts from China) ముప్పును టెక్ దిగ్గజం మెటా తాజాగా వెలుగులోకి తీసుకొచ్చింది. మన దేశంపై తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా అవి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. అందుకోసం అధునాతన వ్యూహాలను అనుసరిస్తున్నట్లు తెలిపింది. మంగళవారం విడుదల చేసిన ఓ త్రైమాసిక నివేదికలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
చైనా నుంచి ఉద్భవిస్తున్న అనేక నకిలీ ఖాతాలను (Fake Facebook accounts from China) గుర్తించి రద్దు చేసినట్లు మెటా వెల్లడించింది. భారతీయులుగా నటిస్తూ.. దేశ రాజకీయాలు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో ఈ ఖాతాలు చురుకుగా వ్యవహరిస్తున్నాయని వివరించింది. పాత్రికేయులు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలుగా చెప్పుకొంటూ ఈ నకిలీ ఖాతాలను నిర్వహిస్తున్నారని తెలిపింది. ఎక్కువగా ఇంగ్లిష్లో పోస్ట్లు పెడుతున్నారని.. అప్పుడప్పుడు హిందీ, చైనీస్ భాషలను కూడా ఉపయోగించినట్లు వెల్లడించింది. స్థానిక వార్తలు, సంస్కృతి, క్రీడలు, టిబెట్, అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించిన అంశాలపైనా పోస్టులు చేస్తున్నారని పేర్కొంది.
కొన్ని నకిలీ ఖాతాలు (Fake Facebook accounts from China) టిబెట్పై దృష్టి సారించినట్లు మెటా నివేదిక తెలిపింది. భారత్లో ఆశ్రయం పొందుతున్న బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా, ఆయన అనుచరులు అవినీతి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించాయని వెల్లడించింది. అరుణాచల్ లక్ష్యంగా పనిచేస్తున్న నకిలీ ఖాతాలు భారత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసినట్లు తెలిపింది. అలాగే మణిపూర్లో హింసను ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్లు దుష్ప్రచారం చేశాయని బహిర్గతం చేసింది. పైగా ఇదంతా అధీకృత సమాచారమని నమ్మించేందుకు.. పోస్టులపై కామెంట్లు చేయడం, వారి మధ్యలో వారే షేర్ చేయడం కూడా చేసినట్లు పేర్కొంది.
అలాంటి ఖాతాలను (Fake Facebook accounts from China) గుర్తించి తమ సామాజిక మాధ్యమ వేదికలన్నింటి నుంచి తొలగించినట్లు మెటా వెల్లడించింది. మరికొన్ని ఖాతాలు అమెరికా లక్ష్యంగానూ పనిచేసినట్లు తెలిపింది. గర్భ విచ్ఛిత్తి, అధ్యక్ష అభ్యర్థులు, అమెరికా-చైనా సంబంధాలు తదితర అంశాలపై తప్పుడు వార్తలు ప్రచారం చేసినట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.