Adani group: అదానీ గ్రూప్లో వాటాలు పెంచుకున్న ప్రమోటర్ గ్రూప్
Adani group: అదానీ ఎంటర్ప్రైజెస్లో నెల వ్యవధిలోనే రెండోసారి ప్రమోటర్ గ్రూప్ సంస్థలు వాటాలను పెంచుకున్నాయి.
దిల్లీ: అదానీ గ్రూప్ (Adani group)లోని రెండు కంపెనీల్లో బిలియనీర్ గౌతమ్ అదానీ (Gautam Adani) నేతృత్వంలోని ప్రమోటర్ గ్రూప్ తమ వాటాలను పెంచుకుంది. అదానీ ఎంటర్ప్రైజెస్లో 69.87 శాతం వాటాను 71.93 శాతానికి పెంచుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్లో వెల్లడించారు. ఈ కంపెనీ నెల వ్యవధిలోనే రెండోసారి వాటా పెంచుకోవడం గమనార్హం. మరోవైపు అదానీ పోర్ట్స్ అండ్ సెజ్లో వాటాను 65.23 శాతం నుంచి 63.06 శాతానికి పెంచుకున్నారు. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత గ్రూప్ (Gautam Adani) కంపెనీల షేర్ల విలువ పతనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మదుపర్లలో విశ్వాసం నింపాలనే వ్యూహంలో భాగంగానే ప్రమోటర్ గ్రూప్ వాటాల కొనుగోలు ప్రక్రియ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్లో ‘రిస్టర్జెంట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్’ తాజాగా దాదాపు ఒక శాతం వాటాను సొంతం చేసుకుంది. మరో 1.2 శాతం వాటాను ఎమర్జింగ్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ డీఎంసీసీ కొనుగోలు చేసింది. ఈ రెండూ ప్రమోటర్ గ్రూప్ సంస్థలే. మరోవైపు అదానీ ఎంటర్ప్రైజెస్లో కెంపాస్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫైనైట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ తమ వాటాలను పెంచుకున్నాయి. బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా ఆగస్టు 14 నుంచి సెప్టెంబరు 8 మధ్య ఆయా కంపెనీలు వాటాలను కొనుగోలు చేశాయి. అదానీ గ్రూప్ (Adani group) సంస్థల్లో అమెరికా పెట్టుబడుల సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ వాటాలను కొనుగోలు చేసిన కొన్ని వారాల్లోనే ప్రమోటర్ సంస్థలు కూడా తమ వాటాలను పెంచుకోవడం గమనార్హం.
జీక్యూజీ పార్ట్నర్స్కు ఇప్పుడు అదానీ గ్రూప్ (Adani group)లోని ఐదు నమోదిత కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. ఆగస్టు 16న అదానీ పవర్లో అదనంగా 7.73 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ప్రమోటర్ గ్రూప్ సంస్థలైన ఎమర్జింగ్ మార్కెట్ హోల్డింగ్, ఆఫ్రో ఏషియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ బ్లాక్ డీల్ ద్వారా ఆగస్టు 16న 8.09 శాతం వాటాలను విక్రయించాయి. వీటి నుంచే జీక్యూజీ 7.73 శాతం వాటాను సొంతం చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ