Ambani succession plan: నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అంబానీ వారసులు.. షేర్హోల్డర్ల ఆమోదం
Ambani succession plan: గత ఏడాదే మూడు విభాగాల వ్యాపార నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన ముకేశ్ అంబానీ వారసులు ఇకపై నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల హోదాలో వ్యవహరించనున్నారు.
Ambani succession plan | ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) వారసులు ఈశా అంబానీ, ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీలను నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమిస్తూ చేసిన తీర్మానానికి కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని రిలయన్స్ (Reliance Industries) శుక్రవారం స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది. కంపెనీ 46వ వార్షిక సాధారణ సమావేశంలో ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తన వారసత్వ ప్రణాళికను వెల్లడించిన విషయం తెలిసిందే. తమ ముగ్గురు పిల్లలు వ్యాపార నిర్వహణ బాధ్యతలను స్వీకరించనున్నారని ప్రకటించారు.
కవలలైన ఈశా, ఆకాశ్ల నియామకానికి 98 శాతం ఓట్లు లభించినట్లు కంపెనీ తెలిపింది. అలాగే అనంత్ అంబానీ (Anant Ambani)కి 92.75 శాతం ఓట్లతో మద్దతు తెలిపినట్లు పేర్కొంది. వీరి నియామకాన్ని ఆమోదిస్తూ కంపెనీ బోర్డు ఆగస్టులోనే తీర్మానం చేసింది. దీనికి తాజాగా షేర్హోల్డర్ల అనుమతి కూడా లభించడంతో వారు నాన్- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించడం లాంఛనమైంది. మరోవైపు ముకేశ్ సతీమణి నీతా అంబానీ (Nita Ambani) బోర్డు డైరెక్టర్గా వైదొలగిన విషయం తెలిసిందే. తమ పిల్లలకు మార్గం సుగమం చేయడం కోసమే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమె పూర్తిగా రిలయన్స్ ఫౌండేషన్ కార్యకలాపాలను చూసుకోనున్నారు.
గత ఏడాది రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్ బాధ్యతల్ని ఆకాశ్ అంబానీ (Akash Ambani) స్వీకరించారు. జియో ప్లాట్ఫామ్స్కు ఇన్ఫోకామ్ అనుబంధ సంస్థగా ఉంది. ప్లాట్ఫామ్స్ మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries). జియో ప్లాట్ఫామ్స్లో గూగుల్, మెటా వంటి బడా సంస్థలకు వాటాలు ఉన్నాయి. మరోవైపు ఈశా అంబానీ (Isha Ambani) రిలయన్స్ రిటైల్ బాధ్యతల్ని తీసుకున్నారు. అలాగే అనంత్ అంబానీ (Anant Ambani) నూతన ఇంధన రంగ బిజినెస్ నిర్వహణని స్వీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.