Ads on X: మస్క్ పోస్ట్ ఎఫెక్ట్.. ఎక్స్లో యాడ్స్ను నిలిపేసిన యాపిల్, డిస్నీ
Ads on X: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’లో తమ యాడ్స్ను నిలిపివేస్తున్నట్లు యాపిల్, డిస్నీ వంటి దిగ్గజ సంస్థలు ప్రకటించాయి. ఎలాన్ మస్క్ చేసిన ఓ పోస్టే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) యుద్ధం వేళ ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ‘ఎక్స్ (X)’ వేదికగా యూదు వ్యతిరేక పోస్టులు రావడం, వాటిల్లో కొన్నింటికి ఆ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk) మద్దతు పలకడం దుమారం రేపుతోంది. మస్క్ తీరుపై అమెరికా తీవ్రంగా మండిపడింది. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యానికి చెందిన దిగ్గజ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్స్లో తమ యాడ్స్ను నిలిపివేస్తున్నట్లు యాపిల్ (Apple), డిస్నీ (Disney) వంటి సంస్థలు ప్రకటించాయి.
ఎక్స్ వేదికగా యూదు వ్యతిరేక యూజర్లతో ఇటీవల మస్క్ విరివిగా సంభాషణలు జరిపారు. ఈ క్రమంలోనే యూదులు, శ్వేతజాతీయులను కించపర్చేలా ఓ యూజర్ పెట్టిన పోస్ట్కు మస్క్ స్పందిస్తూ.. ‘సరిగ్గా చెప్పారు’ అని అనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ తీవ్రంగా స్పందించింది. ‘‘మస్క్ స్పందన యూదు కమ్యూనిటీని ప్రమాదంలో పడేస్తోంది’’ అని మండిపడింది. అటు మస్క్ తీరుపై మండిపడిన కొన్ని దిగ్గజ సంస్థలు.. ‘ఎక్స్’లో తమ యాడ్స్ను నిలిపివేయాలని నిర్ణయించాయి.
చాట్జీపీటీ సృష్టికర్త తొలగింపు.. ఆ వెంటనే ఓపెన్ఏఐ సహ-వ్యవస్థాపకుడి రాజీనామా
యాపిల్, ఐబీఎం, ఒరాకిల్, కామ్కాస్ట్, బ్రావో టెలివిజన్ నెట్వర్క్, యూరోపియన్ కమిషన్స్, లయన్స్ గేట్ ఎంటర్టైన్మెంట్ కార్పొరేషన్, వాల్ట్ డిస్నీ, పారామౌంట్ గ్లోబల్, వార్నర్ బ్రోస్ డిస్కవరీ వంటి సంస్థలు.. ఎక్స్ వేదికగా తమ యాడ్స్ ప్రసారాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. మరోవైపు, మస్క్కు చెందిన టెస్లాలోనూ ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. టెస్లా సీఈవో పదవి నుంచి మస్క్ను సస్పెండ్ చేయాలని కొంతమంది సంస్థ వాటాదారులు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా.. యాపిల్ గతంలోనూ కొంతకాలం పాటు ఎక్స్లో తమ ప్రకటనలను నిలిపివేసింది. గతేడాది ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ను కొనుగోలు చేసిన మస్క్.. ఉద్యోగాల కోతతో పాటు పలు విధానపరమైన మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన యాపిల్.. ఎక్స్ (అప్పటి ట్విటర్)లో యాడ్స్ను నిలిపివేసింది. అయితే, గతేడాది డిసెంబరులో మస్క్ స్వయంగా యాపిల్ హెడ్క్వార్టర్స్కు వెళ్లి సంస్థ సీఈవో టిమ్ కుక్తో సమావేశమై ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నారు. ఆ తర్వాత యాపిల్.. ఎక్స్లో తమ యాడ్స్ను పునరుద్ధరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్తో ఇంగ్లీష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలనుకునే వారి కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇంగ్లీష్లో స్పీకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. -
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
electric scooter: భారత్ మార్కెట్లోకి మరో కొత్త విద్యుత్ స్కూటర్ వచ్చేసింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన యాంపియర్ ఈ స్కూటర్ను లాంచ్ చేసింది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
Nithin Kamath: కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు పాల్గొనేందుకు డెట్ సెక్యూరిటీల ముఖ విలువను తగ్గించడంపై జెరోదా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ హర్షం వ్యక్తం చేశారు. -
మ్యూచువల్ ఫండ్ల కొత్త రూల్.. జాయింట్ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!
Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయాలు తీసుకుంది. -
జీఎస్టీ చరిత్రలో రికార్డు వసూళ్లు.. ఒక్క నెలలో రూ.2.10 లక్షల కోట్లు!
GST Collections: ఏప్రిల్లో వసూలైన రూ.2.10 లక్షల కోట్లలో సీజీఎస్టీ రూ.43,846 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.53,538 కోట్లు, ఐజీఎస్టీ రూ.99,623 కోట్లుగా నమోదైంది. -
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
Credit cards: సులభంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారు. వాటిని ఎలా సమర్థంగా వినియోగించాలో తెలుసుకోండిలా.. -
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
BSNL: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు తమ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకునేవారి నుంచి ఎలాంటి ఇన్స్టలేషన్ ఛార్జీలు వసూలు చేయబోమని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. -
తగ్గిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర
LPG Price: 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి. -
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది
సబ్బుల నుంచి స్థిరాస్తి దాకా వ్యాపారాలను నిర్వహిస్తున్న, 127 ఏళ్ల చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ విడిపోయింది. వారసులు దీనిని పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. -
పసిడి ధరహాసంలోనూ గిరాకీ
పసిడి ధర జీవనకాల గరిష్ఠాలకు చేరినా.. దేశీయంగా గిరాకీ తగ్గలేదు. ఈ ఏడాది జనవరి-మార్చిలో 136.6 టన్నుల బంగారానికి గిరాకీ ఏర్పడింది. -
‘న్యుబెవాక్స్ 14’ టీకాపై క్లినికల్ పరీక్షల్లో సానుకూల ఫలితాలు
చిన్న పిల్లల్లో న్యుమోకాకల్ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాను ఆవిష్కరించడంలో హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఇ.లిమిటెడ్ (బీఇ) కీలక మైలురాయిని చేరుకుంది. -
ఆఖర్లో అమ్మకాలు
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, మంగళవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
రిటైల్ మదుపర్ల కోసం కార్పొరేట్ బాండ్ల ముఖ విలువ తగ్గింపు!
కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు మరింతగా పాల్గొనడం కోసం ఆయా డెట్ సెక్యూరిటీల ముఖ విలువను ప్రస్తుత రూ.లక్ష నుంచి రూ.10,000కు తగ్గించాలన్న ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆమోదించింది. -
అర్బన్వర్క్ నుంచి కొత్త ఫ్లెక్సీ కేంద్రం
కంపెనీలకు ఫ్లెక్సీ కార్యాలయ స్థలాన్ని అందించే అర్బన్వర్క్, హైదరాబాద్ రహేజా మైండ్స్పేస్లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. -
ఓటర్ల కోసం ప్రత్యేక రాయితీ: అభిబస్
ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు టిక్కెట్ల బుకింగ్లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు బస్ టికెట్ బుకింగ్ అగ్రిగేటర్, ఇగ్జిగో గ్రూపులో భాగమైన అభిబస్ వెల్లడించింది. -
గూగుల్లో ఉద్యోగ కోతలు
టెక్ దిగ్గజం గూగుల్ తన ఫ్లటర్, డార్ట్, పైథాన్ బృందాల్లో లేఆఫ్లు ప్రకటించింది. ఉద్యోగ కోతలు కంపెనీ వ్యాప్తంగా జరగలేదని.. కేవలం ఆయా బృందాలకు మాత్రమే పరిమితమయ్యాయని గూగుల్ స్పష్టం చేసింది. -
2024-25లోనే ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకుంటాం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే (2024-25) యూకో బ్యాంక్లో ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు.. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) అశ్వని కుమార్ తెలిపారు. -
ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లాభంలో 37% వృద్ధి
బ్యాటరీల సంస్థ ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మార్చి త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.208 కోట్లతో పోలిస్తే ఇది 37% అధికం. -
సగానికి తగ్గిన ఐఓసీ లాభం
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం సగానికి పైగా తగ్గి రూ.4,837.69 కోట్లకు పరిమితమైంది. -
సంక్షిప్తవార్తలు (8)
సనోఫి ఇండియా మనదేశంలో మధుమేహ వ్యాధికి సొలిక్వా అనే మందును విడుదల చేసింది. ఈ మందుకు ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నుంచి అనుమతి తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్తో ఇంగ్లీష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
లైంగిక దౌర్జన్యం కేసు - తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’