ఆఖర్లో అమ్మకాలు
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, మంగళవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి.
సమీక్ష
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, మంగళవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ షేర్లు డీలాపడ్డాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనుండటంతో మదుపర్లు అప్రమత్తత పాటించారు. డాలర్తో పోలిస్తే రూపాయి 2 పైసలు పెరిగి 83.43 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో షాంఘై మినహా మిగతావి లాభపడ్డాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 74,800.89 పాయింట్ల వద్ద దూకుడుగా ప్రారంభమైంది. అదే జోరు కొనసాగిస్తూ, 440 పాయింట్ల లాభంతో 75,111.39 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరింది. ఆఖర్లో అమ్మకాలతో నష్టాల్లోకి జారుకున్న సూచీ, 74,346.40 పాయింట్లకు పడిపోయింది. చివరకు 188.50 పాయింట్ల నష్టంతో 74,482.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 38.55 పాయింట్లు తగ్గి 22,604.85 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,783.35 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది.
- జేఎన్కే ఇండియా షేరు అరంగేట్రం అదిరింది. ఇష్యూ ధర రూ.415తో పోలిస్తే, బీఎస్ఈలో 49.39% లాభంతో రూ.620 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 71.56% పరుగులు తీసి రూ.712 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 67.21% లాభపడి రూ.693.95 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.3,859.81 కోట్లుగా నమోదైంది.
- త్రైమాసిక లాభం రెట్టింపు కావడంతో జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేరు 19.99% దూసుకెళ్లి రూ.599 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని, అప్పర్ సర్క్యూట్ను తాకి.. అక్కడే ముగిసింది. సంస్థ మార్కెట్ విలువ రూ.1,043.82 కోట్లు పెరిగి రూ.6,264.96 కోట్లకు చేరింది.
- మార్చి త్రైమాసికంలో రూ.818 కోట్ల నష్టాన్ని చవిచూడటంతో టాటా కెమికల్స్ షేరు 2.43% కోల్పోయి రూ.1,072.30 దగ్గర స్థిరపడింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 17 డీలాపడ్డాయి. టెక్ మహీంద్రా 2.08%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 1.50%, టాటా స్టీల్ 1.46%, హెచ్సీఎల్ టెక్ 1.41%, సన్ఫార్మా 1.29%, టీసీఎస్ 1.24%, ఎల్ అండ్ టీ 1.09%, కోటక్ బ్యాంక్ 1.01%, ఇన్ఫీ 0.97% నష్టపోయాయి. ఎం అండ్ ఎం 4.53%, పవర్గ్రిడ్ 2.71%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.87%, బజాజ్ ఫైనాన్స్ 1.52%, బజాజ్ ఫిన్సర్వ్ 1.27% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో టెక్, ఐటీ, లోహ, కమొడిటీస్, టెలికాం 0.98 వరకు పడ్డాయి. వినియోగ, ఆర్థిక సేవలు, యుటిలిటీస్, వాహన, స్థిరాస్తి, విద్యుత్ రాణించాయి. బీఎస్ఈలో 2014 షేర్లు నష్టాల్లో ముగియగా, 1804 స్క్రిప్లు లాభపడ్డాయి. 132 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
- ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు మణప్పురం ఫైనాన్స్ అనుబంధ సంస్థ ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్కు సెబీ అనుమతి లభించింది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.1500 కోట్ల వరకు సమీకరించాలని భావిస్తోంది.
- రైల్వే సిగ్నలింగ్ వ్యాపారం కోసం హెచ్ఐఎంఏ మిడిల్ ఈస్ట్ ఎఫ్జడ్ఈ, దుబాయ్తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (భెల్) తెలిపింది.
- పైలట్ల శిక్షణలో లోపాలకు గాను విమానయాన సంస్థ విస్తారా అధికారి విక్రమ్ మోహన్ దయాల్ను డీజీసీఏ సస్పెండ్ చేసింది.
- జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి పతంజలి ఫుడ్స్ షోకాజ్ నోటీసు అందుకుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద పొందిన రూ.27.46 కోట్లు ఎందుకు వెనక్కి తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కంపెనీని ప్రభుత్వం ఆదేశించింది.
- నోకియా డిజిటల్ వర్క్ప్లేస్ సేవల్లో మార్పులు చేసేందుకు మిలియన్ డాలర్ల కాంట్రాక్టును విప్రో దక్కించుకుంది. అంతర్జాతీయంగా నోకియాకు 130 దేశాల్లో 86,700 మంది యూజర్లు ఉన్నారు.
- కోటక్ మహీంద్రా బ్యాంక్ జాయింట్ ఎండీ కేవీఎస్ మణియన్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ తెలిపింది.
నేటి బోర్డు సమావేశాలు: అదానీ పవర్, అంబుజా సిమెంట్, అదానీ విల్మర్, బొండాడ ఇంజినీరింగ్, ధంపూర్ షుగర్, మంగళం సిమెంట్, నెట్వెబ్ టెక్నాలజీస్
టాటాప్లేలో 70 శాతానికి టాటాసన్స్ వాటా
టాటా ప్లేలో తమ వాటాను 70 శాతానికి టాటా సన్స్ పెంచుకుంది. టాటా ప్లేలో సింగపూర్ ప్రభుత్వ సంస్థ టెమాసెక్కు ఉన్న 10% వాటాను దాదాపు 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.835 కోట్ల)కు టాటా సన్స్ కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా టాటా ప్లే విలువను 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8300 కోట్లు)గా లెక్కకట్టారు. కరోనాకు ముందు ఈ విలువ 3 బి.డాలర్లు (సుమారు రూ.25000 కోట్లు)గా ఉంది.
నేడు మార్కెట్లకు సెలవు
మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా బుధవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. బులియన్, ఫారెక్స్ మార్కెట్లు కూడా పని చేయవు. కమొడిటీ మార్కెట్లు సాయంత్రం 5 గంటల నుంచి పనిచేయనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెజాన్-ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ రివార్డులు ఉండవిక..
అమెజాన్పే- ఐసీఐసీఐ కో బ్రాండ్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? అయితే జూన్ 18 నుంచి రివార్డు పాయింట్లలో కొన్ని మార్పులు రానున్నాయి. -
ఏఐపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్ సీటీఓ సూచనలు
ఏఐని సమర్థంగా అర్థం చేసుకోగల వారిదే భవిష్యత్ అని ఇన్ఫోసిస్ సీటీఓ రఫీ అన్నారు. ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐ టూల్స్ నేర్చుకోవడం ముఖ్యమని చెప్పారు. -
రాజస్థాన్లో రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న JSW సిమెంట్
రాజస్థాన్లో కొత్త సిమెంట్ తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు JSW సిమెంట్ రూ.3,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. -
నీ తండ్రి స్థాయేంటో తెలుసా అన్నారు : జొమాటో సీఈఓ
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తాను స్టార్టప్ ప్రారంభించాలనుకున్న తొలి రోజుల గురించి గుర్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
బీఎస్ఈ మార్కెట్ క్యాప్ @ 5 ట్రిలియన్.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 52 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడింది. -
రీకాల్, కోక్రియేట్ ఫీచర్లతో ఏఐ తరం కోసం మైక్రోసాఫ్ట్ కోపైలట్+ పీసీలు
Microsoft Copilot+ PCs: ఏఐ ఫీచర్లతో మైక్రోసాఫ్ట్ కోపైలట్+ పేరిట కొత్త పీసీలను విడుదల చేసింది. వీటిలో రీకాల్, కోక్రియేట్ వంటి అత్యాధునిక ఏఐ ఫీచర్లు ఉన్నాయి. -
చైనాలో ఐఫోన్లపై యాపిల్ భారీ డిస్కౌంట్స్.. ఏడాదిలో రెండోసారి.. ఎందుకంటే?
చైనాలో ఐఫోన్లపై యాపిల్ సంస్థ భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఏడాదిలో ఇలా డిస్కౌంట్ ఇవ్వడం ఇది రెండోసారి. -
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,455
Stock Market Opening bell: ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టపోయి 73,906 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు కుంగి 22,455 దగ్గర కొనసాగుతోంది. -
పారిశ్రామిక ప్రముఖులు ఓటేశారు
లోక్సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్లో, సోమవారం ముంబయిలో పారిశ్రామిక ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
విద్యుత్తు విధాన మార్గదర్శకాలు త్వరలో
మనదేశంలో విద్యుత్తు వాహనాల (ఈవీ) ఉత్పత్తి, వినియోగాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఈవీ నూతన విధాన మార్గదర్శకాలను ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. -
సానుకూలతలున్నా.. అప్రమత్తతే!
ఎన్నికల అనంతరం అధికారం చేపట్టే పార్టీ విషయమై అనిశ్చితి వల్ల అప్రమత్తతతో ఉన్నా, నిఫ్టీ-50 ఈ వారం సానుకూలతలను కనబరచొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
74,360 ఎగువన లాభాలు కొనసాగొచ్చు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం సూచీలు లాభాల్లో ముగిశాయి. డీఐఐల కొనుగోళ్లు, స్థిరమైన చమురు ధరలు ఇందుకు దోహదపడ్డాయి. -
ఇండియా సిమెంట్స్కు తగ్గిన నష్టం
ఇండియా సిమెంట్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.50.06 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. -
ఆయిల్ ఇండియా 2 షేర్లకు ఒకటి బోనస్
ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆయిల్ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.2,332.94 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. -
దిల్లీలో ఉబర్ బస్సు సేవలు
‘దిల్లీ ప్రీమియం బస్ స్కీమ్’ కింద దేశ రాజధానిలో బస్సులు తిప్పేందుకు దిల్లీ రవాణా విభాగం నుంచి అగ్రిగేటర్ లైసెన్స్ పొందినట్లు ఉబర్ వెల్లడించింది. -
ఎస్బీఐ ఛైర్మన్ పదవికి నేడు ఇంటర్వ్యూలు
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ పదవికి అర్హులైన అభ్యర్థుల ఇంటర్వ్యూలను ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) మంగళవారం నిర్వహించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్స్లో ఐఎస్బీకి దేశంలో ప్రథమ స్థానం
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్- 2024 లో మనదేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. -
విస్తరణ దిశగా నెక్స్ట్వేవ్
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే హైదరాబాదీ ఎడ్యుటెక్ అంకురం నెక్ట్స్వేవ్ విస్తరణ బాట పట్టింది. -
మార్చిలో 14.41 లక్షల మంది చేరిక: ఈపీఎఫ్ఓ
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో ఈ ఏడాది మార్చిలో నికరంగా 14.41 లక్షల మంది సభ్యులు చేరారు. -
సుగంధ ద్రవ్యాల ఎగుమతులపై కేంద్రం మార్గదర్శకాలు
మనదేశం నుంచి ఎగుమతి అయ్యే సుగంధ ద్రవ్యాలు ఎథిలీన్ ఆక్సైడ్ (ఈటీఓ)తో కలుషితం కాకుండా ఉండేలా చూడడం కోసం కేంద్రం సవివర మార్గదర్శకాలను జారీ చేసింది. -
సంక్షిప్త వార్తలు
పవర్ మెక్ ప్రాజెక్ట్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,311.86 కోట్ల ఆదాయంపై రూ.84.41 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
తాజా వార్తలు (Latest News)
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సినీనటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షోపై రాళ్ల దాడి!
-
మరో వీడియో పోస్ట్ చేసిన నటి హేమ
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం
-
బ్రిజ్ భూషణ్కు షాక్.. అభియోగాలు నమోదు