సగానికి తగ్గిన ఐఓసీ లాభం
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం సగానికి పైగా తగ్గి రూ.4,837.69 కోట్లకు పరిమితమైంది.
ఇంధన ధరల కోత వల్లే
తుది డివిడెండ్ 70%
దిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం సగానికి పైగా తగ్గి రూ.4,837.69 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.10,058.69 కోట్లు కావడం గమనార్హం. 2023 అక్టోబరు- డిసెంబరులోనూ సంస్థ లాభం రూ.8,063.39 కోట్లుగా ఉంది. ముడిచమురు వ్యయాలు పెరిగినప్పటికీ, ఎన్నికల కారణంగా మార్చి మధ్యలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను 2% తగ్గించినందునే.. పెట్రో రసాయనాల వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల, మార్జిన్లపై ప్రభావం పడినట్లు ఐఓసీ తెలిపింది. వంట గ్యాస్ ధరలను ప్రభుత్వం యథాతథంగా ఉంచడం వల్ల వాటిల్లిన రూ.1,017 కోట్ల నష్టంపై ప్రభుత్వం నుంచి పరిహారం అందకపోవడమూ మరో కారణంగా పేర్కొంది. త్రైమాసిక ఆదాయం రూ.2.28 లక్షల కోట్ల నుంచి రూ.2.21 లక్షల కోట్లకు పరిమితమయ్యింది.
పూర్తి ఆర్థిక సంవత్సరానికి: 2023-24లో ఐఓసీ రూ.39,618.84 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. కంపెనీ చరిత్రలోనే ఇదే అత్యధికం. ఇప్పటివరకు చూస్తే, 2021-22లో నమోదైన రూ.24,184.10 కోట్లే అత్యధిక లాభంగా ఉంది. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను సుమారు రెండేళ్లపాటు యథాతథంగా ఉంచడం వల్లే వార్షిక లాభం ఇంతలా ఉంది. 2023-24లో ఐఓసీ ఆదాయం రూ.8.71 లక్షల కోట్లకు తగ్గింది. 2022-23లో ఇది రూ.9.41 లక్షల కోట్లుగా ఉంది.
పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.7 (70%) తుది డివిడెండును ఐఓసీ ప్రకటించింది. ఇంతకుమునుపు చెల్లించిన రూ.5 మధ్యంతర డివిడెండుకు ఇది అదనం.
పెట్రో రసాయనాల వ్యాపారంలో నష్టం: జనవరి- మార్చి త్రైమాసికంలో పెట్రో రసాయనాల వ్యాపారంలో రూ.400 కోట్ల నష్టాన్ని ఐఓసీ చవిచూసింది. పెట్రో రసాయనాల ఉత్పత్తుల విక్రయాలు 23.73 మిలియన్ టన్నులకు పెరిగాయి. 2022-23 ఇదే త్రైమాసికంలో ఇవి 22.95 మిలియన్ టన్నులుగా ఉండగా.. అక్టోబరు- డిసెంబరులో 23.32 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఇంధన అమ్మకాలు 90.65 మిలియన్ టన్నుల నుంచి 92.31 మిలియన్ టన్నులకు పెరిగాయి.
2023-24లో బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడం ద్వారా 12.05 డాలర్లను ఆర్జించింది. అంతకుముందు త్రైమాసికంలో ఆర్జించిన 19.52 డాలర్లతో పోలిస్తే ఇది తక్కువే.
పునరుత్పాదక విద్యుత్పై రూ.5,215 కోట్ల పెట్టుబడి: దేశంలో 1 గిగావాట్ పునరుత్పాక విద్యుత్ సామర్థ్య ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు రూ.5,215 కోట్ల పెట్టుబడులు పెట్టే యోచనలో ఐఓసీ ఉంది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. సౌర/పవన/ సౌర- పవన హైబ్రిడ్ ప్రాజెక్టుగా ఇది ఉండే అవకాశం ఉందని కంపెనీ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. దీనిని దశలవారీగా అభివృద్ధి చేస్తామని పేర్కొంది.
జనవరి- మార్చిలో నికర లాభం సగానికి పైగా తగ్గడంతో బీఎస్ఈలో ఐఓసీ షేరు 4.44% నష్టంతో రూ.168.95 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో 4.41% క్షీణతతో రూ.168.95 వద్ద స్థిరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏఐపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్ సీటీఓ సూచనలు
ఏఐని సమర్థంగా అర్థం చేసుకోగల వారిదే భవిష్యత్ అని ఇన్ఫోసిస్ సీటీఓ రఫీ అన్నారు. ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐ టూల్స్ నేర్చుకోవడం ముఖ్యమని చెప్పారు. -
రాజస్థాన్లో రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న JSW సిమెంట్
రాజస్థాన్లో కొత్త సిమెంట్ తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు JSW సిమెంట్ రూ.3,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. -
నీ తండ్రి స్థాయేంటో తెలుసా అన్నారు : జొమాటో సీఈఓ
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తాను స్టార్టప్ ప్రారంభించాలనుకున్న తొలి రోజుల గురించి గుర్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
బీఎస్ఈ మార్కెట్ క్యాప్ @ 5 ట్రిలియన్.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 52 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడింది. -
రీకాల్, కోక్రియేట్ ఫీచర్లతో ఏఐ తరం కోసం మైక్రోసాఫ్ట్ కోపైలట్+ పీసీలు
Microsoft Copilot+ PCs: ఏఐ ఫీచర్లతో మైక్రోసాఫ్ట్ కోపైలట్+ పేరిట కొత్త పీసీలను విడుదల చేసింది. వీటిలో రీకాల్, కోక్రియేట్ వంటి అత్యాధునిక ఏఐ ఫీచర్లు ఉన్నాయి. -
చైనాలో ఐఫోన్లపై యాపిల్ భారీ డిస్కౌంట్స్.. ఏడాదిలో రెండోసారి.. ఎందుకంటే?
చైనాలో ఐఫోన్లపై యాపిల్ సంస్థ భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఏడాదిలో ఇలా డిస్కౌంట్ ఇవ్వడం ఇది రెండోసారి. -
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,455
Stock Market Opening bell: ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టపోయి 73,906 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు కుంగి 22,455 దగ్గర కొనసాగుతోంది. -
పారిశ్రామిక ప్రముఖులు ఓటేశారు
లోక్సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్లో, సోమవారం ముంబయిలో పారిశ్రామిక ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
విద్యుత్తు విధాన మార్గదర్శకాలు త్వరలో
మనదేశంలో విద్యుత్తు వాహనాల (ఈవీ) ఉత్పత్తి, వినియోగాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఈవీ నూతన విధాన మార్గదర్శకాలను ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. -
సానుకూలతలున్నా.. అప్రమత్తతే!
ఎన్నికల అనంతరం అధికారం చేపట్టే పార్టీ విషయమై అనిశ్చితి వల్ల అప్రమత్తతతో ఉన్నా, నిఫ్టీ-50 ఈ వారం సానుకూలతలను కనబరచొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
74,360 ఎగువన లాభాలు కొనసాగొచ్చు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం సూచీలు లాభాల్లో ముగిశాయి. డీఐఐల కొనుగోళ్లు, స్థిరమైన చమురు ధరలు ఇందుకు దోహదపడ్డాయి. -
ఇండియా సిమెంట్స్కు తగ్గిన నష్టం
ఇండియా సిమెంట్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.50.06 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. -
ఆయిల్ ఇండియా 2 షేర్లకు ఒకటి బోనస్
ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆయిల్ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.2,332.94 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. -
దిల్లీలో ఉబర్ బస్సు సేవలు
‘దిల్లీ ప్రీమియం బస్ స్కీమ్’ కింద దేశ రాజధానిలో బస్సులు తిప్పేందుకు దిల్లీ రవాణా విభాగం నుంచి అగ్రిగేటర్ లైసెన్స్ పొందినట్లు ఉబర్ వెల్లడించింది. -
ఎస్బీఐ ఛైర్మన్ పదవికి నేడు ఇంటర్వ్యూలు
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ పదవికి అర్హులైన అభ్యర్థుల ఇంటర్వ్యూలను ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) మంగళవారం నిర్వహించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్స్లో ఐఎస్బీకి దేశంలో ప్రథమ స్థానం
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్- 2024 లో మనదేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. -
విస్తరణ దిశగా నెక్స్ట్వేవ్
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే హైదరాబాదీ ఎడ్యుటెక్ అంకురం నెక్ట్స్వేవ్ విస్తరణ బాట పట్టింది. -
మార్చిలో 14.41 లక్షల మంది చేరిక: ఈపీఎఫ్ఓ
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో ఈ ఏడాది మార్చిలో నికరంగా 14.41 లక్షల మంది సభ్యులు చేరారు. -
సుగంధ ద్రవ్యాల ఎగుమతులపై కేంద్రం మార్గదర్శకాలు
మనదేశం నుంచి ఎగుమతి అయ్యే సుగంధ ద్రవ్యాలు ఎథిలీన్ ఆక్సైడ్ (ఈటీఓ)తో కలుషితం కాకుండా ఉండేలా చూడడం కోసం కేంద్రం సవివర మార్గదర్శకాలను జారీ చేసింది. -
సంక్షిప్త వార్తలు
పవర్ మెక్ ప్రాజెక్ట్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,311.86 కోట్ల ఆదాయంపై రూ.84.41 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
తాజా వార్తలు (Latest News)
-
సీనియర్లుగా జట్టులో మీ బాధ్యత అదే కదా..: హర్భజన్
-
ఆ బాలుడికి పోలీస్స్టేషన్లో పిజ్జా, బిర్యానీ
-
అంతరిక్షంలో ఆయుధాలు.. అమెరికా-రష్యా మాటల యుద్ధం
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ అభ్యర్థన వెనక స్టార్ హీరో సతీమణి
-
ఏఐపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్ సీటీఓ సూచనలు
-
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?: కేటీఆర్