అర్బన్‌వర్క్‌ నుంచి కొత్త ఫ్లెక్సీ కేంద్రం

కంపెనీలకు ఫ్లెక్సీ కార్యాలయ స్థలాన్ని అందించే అర్బన్‌వర్క్‌, హైదరాబాద్‌ రహేజా మైండ్‌స్పేస్‌లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది.

Published : 01 May 2024 03:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: కంపెనీలకు ఫ్లెక్సీ కార్యాలయ స్థలాన్ని అందించే అర్బన్‌వర్క్‌, హైదరాబాద్‌ రహేజా మైండ్‌స్పేస్‌లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. దాదాపు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 900 సీట్ల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేసింది. 50 నుంచి 500 మంది ఉద్యోగులున్న సంస్థలకు ఇది అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్‌లో 2020లో 35,500 సీట్లు అద్దెకు వెళ్లగా, 2023లో ఇది 1,67,700 సీట్లకు చేరిందని పేర్కొంది. టెక్‌ సంస్థలు, బీఎఫ్‌ఎస్‌ఐ, జీసీసీల నుంచి అధిక గిరాకీ ఉంటున్నట్లు అర్బన్‌వర్క్‌ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అనుజ్‌ మునోట్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని