Air India: ఎయిరిండియాకు డీజీసీఏ జరిమానా

సివిల్‌ ఏవియేషన్‌ రిక్వైర్‌మెంట్స్‌ అమలు చేయనందుకు ఎయిరిండియా సంస్థకు డీజీసీఏ జరిమానా విధించింది. దాంతోపాటు షోకాజ్‌ నోటీసు కూడా జారీ చేసింది. 

Published : 07 Nov 2023 19:31 IST

దిల్లీ: ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) రూ.10 లక్షల జరిమానా విధించింది. సివిల్‌ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్‌ (CAR) అమలు చేయనందుకుగానూ ఈ జరిమానా విధించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దాంతోపాటు షోకాజ్ నోటీసు జారీ చేసింది. విమానయాన సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రయాణికులకు సర్వీస్‌లను అందించాల్సిన అవసరం ఉందని డీజీసీఏ స్పష్టం చేసింది. 

‘‘విమాన సర్వీసులు రద్దైనా, ఆలస్యమైనా, ఏదైనా కారణంచేత ప్రయాణికులను బోర్డింగ్‌కు అనుమతించకున్నా.. విమానయాన సంస్థలు వారికి తగిన సౌకర్యాలు కల్పించాలి. ఎయిరిండియా దేశీయ విమాన సర్వీసులకు సంబంధించి ఈ ఏడాది మే నెలలో డీజీసీఏ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఎయిరిండియా సంస్థ సీఏఆర్‌ను అమలు చేయడంలేదని గుర్తించాం. దానిపై వివరణ ఇవ్వాలని సంస్థకు నోటీసులు జారీ చేశాం. అదే సమయంలో గతేడాది నిర్వహించిన తనిఖీలకు సంబంధించి సీఏఆర్‌ అమలు చేయనుందుకు రూ.10 లక్షలు జరిమానా విధించాం’’ అని డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ తనిఖీలు ఏయే నగరాల్లోని విమానాశ్రయాల్లో నిర్వహించారన్న వివరాలను డీజీసీఏ వెల్లడించలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని