Gautam Adani: గుజరాత్లో అదానీ గ్రూప్ రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు
Gautam Adani: వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్లో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు.
గాంధీనగర్: గుజరాత్లో వచ్చే ఐదేళ్లలో రూ.రెండు లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని అదానీ గ్రూప్ (Adani Group ) ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) ప్రకటించారు. 2025 నాటికి రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల్లో రూ.55 వేల కోట్లు వెచ్చిస్తామని వెల్లడించారు. గాంధీనగర్లో జరుగుతున్న ‘వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024’ (Vibrant Gujarat Summit 2024)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బుధవారం ఈ ప్రకటన చేశారు.
‘‘ప్రధాని మోదీజీ.. మీరు భారతదేశ భవిష్యత్తు గురించి ఆలోచించడమే కాదు.. దాన్ని తీర్చిదిద్దుతున్నారు. మీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించబోతోంది. ప్రపంచ పటంలో భారత్ను మీరు శక్తిమంతమైన దేశంగా నిలిపారు. స్వయం సమృద్ధిగా మార్చారు. గత దశాబ్ద కాలంలో సాధించిన పురోగతి అనిర్వచనీయం. 2014 నుంచి దేశ ‘స్థూల దేశీయోత్పత్తి (GDP)’ 185 శాతం, తలసరి ఆదాయం 165 శాతం పెరిగింది. గత పదేళ్లలో తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొవిడ్ మహమ్మారి వంటి సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటే ఈ విజయాలు అసమానమైనవి’’ అని అదానీ (Gautam Adani) వ్యాఖ్యానించారు.
గుజరాత్ కచ్ జిల్లాలోని ఖావ్డాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన పార్కును నిర్మిస్తున్నట్లు అదానీ (Gautam Adani) తెలిపారు. 725 చదరపు కిలోమీటర్లలో ఇది విస్తరించి ఉంటుందని వెల్లడించారు. భారత్ను స్వయం సమృద్ధి దేశంగా మార్చడంలో భాగంగా అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోందని వివరించారు. సౌర ఫలకలు, విండ్ టర్బైన్లు, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్లు, హరిత అమ్మోనియా, పీవీసీ, సిమెంట్, రాగి ఉత్పత్తిని విస్తరిస్తున్నామని తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలో లక్ష మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి. -
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హిరామండీ’ నటుడు
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన