టాటా స్టీల్లో 7 లోహ కంపెనీల విలీనం
తన 7 లోహ కంపెనీలను టాటా స్టీల్లో విలీనం చేయాలని టాటా గ్రూపు నిర్ణయించింది. సామర్థ్యాలను మరింత పెంచుకునేందుకు, వ్యయాలను తగ్గించే ఉద్దేశంతో ఈ దిశగా అడుగులు వేస్తోంది. పూర్తిగా షేర్ల బదిలీ ద్వారా ఈ విలీన ప్రక్రియ జరగనుందని
సామర్థ్యాల పెంపు, వ్యయాల తగ్గింపు కోసమే
దిల్లీ: తన 7 లోహ కంపెనీలను టాటా స్టీల్లో విలీనం చేయాలని టాటా గ్రూపు నిర్ణయించింది. సామర్థ్యాలను మరింత పెంచుకునేందుకు, వ్యయాలను తగ్గించే ఉద్దేశంతో ఈ దిశగా అడుగులు వేస్తోంది. పూర్తిగా షేర్ల బదిలీ ద్వారా ఈ విలీన ప్రక్రియ జరగనుందని టాటా స్టీల్ వెల్లడించింది. అనుబంధ సంస్థలైన టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్, టాటా మెటాలిక్స్, ద టిన్ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా, టీఆర్ఎఫ్, ఇండియన్ స్టీల్ అండ్ వైర్ ప్రోడక్ట్స్, టాటా స్టీల్ మైనింగ్, ఎస్అండ్టీ మైనింగ్ కంపెనీలను విలీనం చేసుకునేందుకు టాటా స్టీల్ బోర్డు ఆమోదం తెలిపింది. టాటా మెటాలిక్స్, టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్ విలీనం కోసం ఇంతకుముందు చేసిన ప్రతిపాదనను టాటా స్టీల్ ఉపసంహరించుకుంది.
షేర్ల స్వాప్ నిష్పత్తి ఇలా..
టాటా స్టీల్లో 7 లోహ కంపెనీల విలీనానికి సంబంధించి షేర్ల స్వాప్ నిష్పతి ఇలా ఉండనుంది.
* టీఆర్ఎఫ్కు 17:10 శ్రేణిలో అంటే 10 టీఆర్ఎఫ్ షేర్లకు గాను 17 టాటాస్టీల్ షేర్లు జారీ చేస్తారు.
* టీఎస్ఎఫ్ఎల్కు 67:10 (పది టీఎస్ఎఫ్ఎల్ షేర్లకు గాను 67 టాటాస్టీల్ షేర్ల జారీ)
* టిన్ ప్లేట్కు 33:10 (10 టిన్ ప్లేట్ షేర్లకు గాను 33 టాటాస్టీల్ షేర్లు)
* టాటా మెటాలిక్స్ 79:10 (10 టిన్ ప్లేట్ షేర్లకు గాను 79 టాటా షేర్లు)
* ఏడు లోహ సంస్థల్లో మెజార్టీ వాటా టాటా స్టీల్కే ఉంది. టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్లో 74.91%, టిన్ప్లేట్లో 74.96%, టాటా మెటాలిక్స్లో 60.02%; ఇండియన్ స్టీల్ అండ్ వైర్ ప్రోడక్ట్స్లో 95.01% చొప్పున వాటా కలిగి ఉంది.
* టాటా స్టీల్ మైనింగ్, ఎస్అండ్టీ మైనింగ్లు టాటా స్టీల్కు 100 శాతం అనుబంధ సంస్థలుగా ఉన్నాయి.
* టీఆర్ఎఫ్ లిమిటెడ్ (34.11 శాతం ఈక్విటీ వాటా)ను టాటాస్టీల్లో విలీనం చేయాలని బోర్డు నిర్ణయించింది.
* ప్రతిపాదన విలీనానికి ఈ సంస్థల బోర్డులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని టాటా స్టీల్ వెల్లడించింది. ఒక్కో సంస్థ విలీన ప్రతిపాదనకు స్టాక్ ఎక్స్ఛేంజీలు, ఎన్సీఎల్టీ సహా పలు నియంత్రణ సంస్థల అనుమతిని తీసుకోవాల్సి ఉందని పేర్కొంది.
* విలీన సంస్థల వనరులను ఒక్క చోటకే తేవడం ద్వారా, వ్యయాలు తగ్గించుకుని, వాటాదార్ల విలువను మరింత పెంచేందుకు అవకాశం ఉంటుందని టాటా స్టీల్ తెలిపింది. ముడి పదార్థాలకు రక్షణ, కేంద్రీకృత సమీకరణ, వనరుల సమర్థ వినియోగం, రవాణా వ్యయాలను తగ్గించడం, ప్రాంగణాలను మెరుగ్గా వాడుకునేందుకు వీలవుతుందని పేర్కొంది.
చంద్రశేఖరన్ నేతృత్వంలో
టాటా సన్స్ ఛైర్మన్గా ఎన్.చంద్రశేఖరన్ పగ్గాలు చేపట్టాక.. గ్రూప్లో ఒకే తరహా వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థలను ఏకీకృతం చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో టాటా కన్జూమర్, టాటా కాఫీల విలీనం కూడా ఇదే కోవలోకి వస్తుంది. తాజాగా విమానయాన రంగంలోనూ ఎయిరిండియాలో ఎయిరేషియా ఇండియా, విస్తారాను విలీనం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు