సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం.
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు
దిల్లీ: డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. ఇదే సమయంలో ఆదాయం రూ.10,594 కోట్ల నుంచి రూ.12,727 కోట్లకు పెరిగింది. నీ 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ ఏకీకృత నికరలాభం రూ.2536 కోట్లకు పెరిగింది. 2022-23లో ఇది రూ.2378 కోట్లే. ఇదే సమయంలో ఏకీకృత ఆదాయం కూడా రూ.42,840 కోట్ల నుంచి రూ.50,789 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన 41తో కలిపి, మొత్తం విక్రయశాలల సంఖ్య 365కు చేరింది. ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని, డెలివరీ ఇస్తున్న డీమార్డ్ రెడీ వ్యాపార విభాగం కూడా రాణిస్తోందని, దేశంలోని 23 నగరాల్లో ఈ సేవలందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
జెన్ టెక్నాలజీస్ ఆకర్షణీయ ఫలితాలు
ఈనాడు, హైదరాబాద్: జెన్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.138.04 కోట్ల ఆదాయాన్ని, రూ.33.03 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్ రూ.3.96గా నమోదైంది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం రూ.74.33 కోట్లు, నికరలాభం రూ.17.27 కోట్లే ఉన్నాయి. దీంతో పోలిస్తే ప్రస్తుతం ఆదాయం, లాభం బాగా పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి జెన్ టెక్నాలజీస్ రూ.444.20 కోట్ల ఆదాయాన్ని, రూ.129.23 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. వార్షిక ఈపీఎస్ రూ.15.61 నమోదైంది. 2022-23లో ఆదాయం రూ.168.48 కోట్లు, నికరలాభం రూ.37.63 కోట్లు, ఈపీఎస్ రూ.4.75గా ఉన్నాయి. వాటాదార్లకు 100 శాతం (రూ.1 ముఖ విలువ కల ఒక్కో షేరుకు రూ.1 చొప్పున) తుది డివిడెండ్ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. కంపెనీ చేతిలో ప్రస్తుతం రూ.1,402 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి.
44% పెరిగిన ఐడీబీఐ బ్యాంక్ లాభం
దిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,628 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,133 కోట్లతో పోలిస్తే ఇది 44% ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.7,014 కోట్ల నుంచి రూ.7,887 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ.3,280 కోట్ల నుంచి రూ.3,688 కోట్లకు చేరింది.
- 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 55% పెరిగి జీవన కాల (ఆల్టైమ్) గరిష్టమైన రూ.5,634 కోట్లకు చేరింది. 2022-23లో ఇది రూ.3,645 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.24,942 కోట్ల నుంచి రూ.30,037 కోట్లకు పెరిగింది.
- రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.1.50 (15%) చొప్పున డివిడెండ్ను చెల్లించేందుకు బ్యాంక్ బోర్డు ప్రతిపాదించింది.
రష్యా నుంచి అధికం.. సౌదీ, ఇరాక్ నుంచి తగ్గింపు
ఏప్రిల్లో చమురు దిగుమతులు ఇలా
దిల్లీ: భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. మన దేశానికి రష్యానే అతిపెద్ద ముడిచమురు సరఫరాదారుగా కొనసాగుతుంది. మార్చితో పోలిస్తే ఏప్రిల్లో రష్యా నుంచి మనదేశానికి చమురు దిగుమతులు పెరగ్గా, ఇరాక్, సౌదీ అరేబియా నుంచి తగ్గినట్లు కెప్లెర్, ఎల్ఎస్ఈజీల గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. రష్యా నుంచి భారత రిఫైనరీ సంస్థల చమురు కొనుగోళ్లు ఏప్రిల్లో 13-17% పెరిగాయి. ఇరాక్ నుంచి 20-23% తగ్గాయి. ఏప్రిల్లో రష్యా నుంచి చమురు దిగుమతులు రోజుకు 1.75 మిలియన్ బ్యారెళ్లుగా ఉండగా, మే నెలలో ఈ మొత్తం రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్లకు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక, తక్కువ ధరకు లభిస్తున్నందున రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు పెంచిన సంగతి తెలిసిందే. రష్యా చమురు ఎగుమతులపై పాశ్చాత్య దేశాల ఆంక్షల దృష్ట్యా, చౌకగా చమురు లభించడాన్ని భారత్ తనకు అనుకూలంగా మల్చుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం కొంతసేపు పనిచేశాయి. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు లాభాల్లో సాగుతున్నాయి. -
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు