ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి.
2033కు రావొచ్చు: ఎన్ఎల్బీ సర్వీసెస్
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. 2033 నాటికి దేశంలో ప్రయాణ, పర్యాటక రంగాల్లో 5.82 కోట్ల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని గ్లోబల్ టెక్నాలజీ, డిజిటల్ నైపుణ్యాలు అందించే ఎన్ఎల్బీ సర్వీసెస్ అంచనా వేసింది. ‘దేశంలో ప్రయాణ, పర్యాటక రంగం వృద్ధి జోరు కొనసాగుతోంది. ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో స్థిరమైన ఉపాధి కల్పనకు ఇది దారితీయనుంది. 2020 నాటికి చూస్తే పర్యాటక రంగంలో 3.9 కోట్ల మంది పనిచేస్తున్నారు. దేశం మొత్తం ఉద్యోగుల్లో ఇది 8 శాతానికి సమానం. కరోనా తర్వాత వేగంగా పుంజుకున్న రంగాల్లో ఇదొకటి’ అని ఎన్ఎల్బీ సర్వీసెస్ సీఈఓ సచిన్ అలుగ్ తెలిపారు. 2023 ఆగస్టులో పర్యాటక రంగంలో నిపుణులకు గిరాకీ 44% పెరిగిందని, 2023 క్యాలెండర్ సంవత్సరంలో 16 లక్షల అదనపు ఉద్యోగాలు లభించాయని అన్నారు. విదేశీ మారకపు ద్రవ్యం ఆర్జించేందుకు కీలక వనరుగా ప్రయాణ - పర్యాటక రంగం ఉందని, 2022లో భారత ఆర్థిక వ్యవస్థకు రూ.15.9 లక్షల కోట్లు (దాదాపు రూ.191.25 బిలియన్ డాలర్లు) సమకూర్చిందని వెల్లడించారు. 2023లో ఇది రూ.16.5 లక్షల కోట్లుగా నమోదు కావచ్చని అంచనా వేశారు.
దేశీయ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్న అగ్రగామి అయిదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయి. నియామకాలు ఎక్కువగా ఉన్న అగ్రశేణి నగరాల్లో దిల్లీ ఎన్సీఆర్, ముంబయి, బెంగళూరు, పుణె, కొచి.. ద్వితీయ శ్రేణి నగరాల్లో జైపుర్, అహ్మదాబాద్, చండీగఢ్ నిలిచాయి.
ఉద్యోగాల వారీగా చూస్తే.. విక్రయాలు (18%), బిజినెస్ డెవలప్మెంట్ (17%), చెఫ్లు (15%), ట్రావెల్ కన్సల్టెంట్లు (15%), టూర్ ఆపరేటర్లు (15%), ట్రావెల్ ఏజెంట్లు (15%), హోటలియర్స్ (15%), గైడ్లు (20%), వైల్డ్లైఫ్ ఎక్స్పర్ట్లు (12%), ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడర్ల (15%)కు అధిక గిరాకీ ఉంది.
- ఇవి దూసుకెళ్తాయ్: ప్రయాణ, పర్యాటక రంగం మార్పులకు లోనవుతోందని.. ఉపవిభాగాలైన డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రావెల్, మత ప్రయాణాలు, అంతర్జాతీయ పర్యాటకం, అడ్వెంచర్ స్పోర్ట్స్ టూరిజం, ఎకో టూరిజం, కల్చరల్ టూరిజం, రూరల్ టూరిజం వంటివి వచ్చే దశాబ్దాంలో దూసుకెళ్లొచ్చని సచిన్ తెలిపారు.
- ఈ రంగంలో గిరాకీని అందుకునేందుకు గిగ్ విధానాన్ని సైతం కంపెనీలు అందిపుచ్చుకుంటున్నాయి. ట్రాన్స్లేటర్లు, ఫోటోగ్రాఫర్లు, టూర్ గైడ్లు వంటి తాత్కాలిక ఉద్యోగాలు 14% పెరిగాయి. వచ్చే రెండేళ్లలో ఇవి 18-20% పెరిగే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం కొంతసేపు పనిచేశాయి. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు లాభాల్లో సాగుతున్నాయి. -
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు