కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది.
విలువ రూ.7,000 కోట్లు
అపాక్స్ నుంచి కొనుగోలుకు రంగం సిద్ధం
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. హెల్తియమ్ మెడ్టెక్లో వాటా విక్రయించడానికి కొంతకాలంగా అపాక్స్ అనే పెట్టుబడుల సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఈ వాటా కోసం వివిధ ఔషధ కంపెనీలు, పీఈ సంస్థలు పోటీ పడ్డాయి. కేకేఆర్తో పాటు నోవో హోల్డింగ్స్, మ్యాన్కైండ్ ఫార్మా- క్రిస్ కేపిటల్ బిడ్లు వేశాయి. కానీ రూ.7,000 కోట్లతో అధిక బిడ్ దాఖలు చేసిన కేకేఆర్కే దీన్ని సొంతం చేసుకునే అవకాశం లభించినట్లు తెలుస్తోంది. మ్యాన్కైండ్ ఫార్మా, క్రిస్ కేపిటల్ రూ.6,500 కోట్లకు బిడ్ దాఖలు చేసినట్లు తెలిసింది. అపాక్స్కు హెల్తియమ్ మెడ్టెక్లో 99.8% వాటా ఉంది. మిగిలిన 0.2% వాటా సంస్థ ఎండీ, సీఈఓ అనీష్ బాఫ్నాకు ఉంది.
1992లో ఏర్పాటు: హెల్తియమ్ మెడ్టెక్ ను 1992లో ఎల్జీ చంద్రశేఖర్, ఎస్.సుబ్రమణియమ్ నెలకొల్పారు. ఈ ఇద్దరికీ స్మిత్ అండ్ నెఫ్యూ, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.820 కోట్ల ఆదాయాన్ని, రూ.256 కోట్ల ఎబిటాను ఈ సంస్థ నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.1000 కోట్లకు మించుతుందని, ఎబిటా రూ.350 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎబిటాకు 20 రెట్లు విలువ కట్టి, దాని ప్రకారం కేకేఆర్ ఈ సంస్థను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా 4వ అతిపెద్ద సంస్థ: సూదులు, ఇతర సర్జికల్ పరికరాల ఉత్పత్తిలో ప్రపంచ వ్యాప్తంగా హెల్తియమ్ మెడ్టెక్ నాలుగో అతిపెద్ద సంస్థ. మనదేశం నుంచి దాదాపు 90 దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. మనదేశంలో దాదాపు 18,000 ఆసుపత్రుల్లో ఈ పరికరాలను వినియోగిస్తున్నారు. సర్జికల్ పరికరాల విభాగంలో ప్రపంచ మార్కెట్లో ఎథికాన్ ఇంక్ (జాన్సన్ అండ్ జాన్సన్ గ్రూపు సంస్థ), ఆంత్రాక్స్ ఇంక్, కొవిడీన్ హోల్డింగ్ ఇంక్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఈ ఏడాదిలోనే యత్నాలు
హెల్తియమ్ మెడ్టెక్లో వాటా విక్రయించడానికి అపాక్స్ ఈ ఏడాది ప్రారంభంలో కసరత్తు మొదలు పెట్టింది. జెఫ్రీస్ను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా ఎంచుకుంది. హెల్తియమ్ మెడ్టెక్ రెండేళ్ల క్రితం యూకేలోని తన సబ్సిడరీ కంపెనీని కేకేఆర్కు విక్రయించింది. అదే కేకేఆర్ ఇప్పుడు మాతృ సంస్థనూ కొనుగోలు చేయనుండటం ఆసక్తికర అంశం. వచ్చే రెండు మూడు రోజుల్లో ఈ విషయం అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల ద్వారా తెలుస్తోంది. సంస్థ యాజమాన్యం చేతులు మారినప్పటికీ ప్రస్తుత ఎండీ, సీఈఓ అనీష్ బాఫ్నా, అదే స్థానంలో కొనసాగుతారని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం కొంతసేపు పనిచేశాయి. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు లాభాల్లో సాగుతున్నాయి. -
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు