Software Jobs: సాఫ్ట్వేర్ డెవలపర్ల అడ్డా... హైదరాబాద్
ఐటీ పరిశ్రమకు మూల స్తంభాలు సాఫ్ట్వేర్ డెవలపర్లే. కోడింగ్ రాయడం, ప్రాజెక్టులు పూర్తి చేయడం, అప్లికేషన్లలో ఏమైనా సమస్యలు వస్తే సత్వరం పరిష్కరించడం... ఈ పనులన్నీ సాఫ్ట్వేర్ డెవలపర్ల పర్యవేక్షణలోనే జరుగుతాయి.
నియామకాల్లో ప్రపంచ వ్యాప్తంగా 10వ స్థానం
ఎగుమతుల్లో ఏటా 15 శాతానికి పైగా వృద్ధి'
ఈనాడు, హైదరాబాద్: ఐటీ పరిశ్రమకు మూల స్తంభాలు సాఫ్ట్వేర్ డెవలపర్లే. కోడింగ్ రాయడం, ప్రాజెక్టులు పూర్తి చేయడం, అప్లికేషన్లలో ఏమైనా సమస్యలు వస్తే సత్వరం పరిష్కరించడం... ఈ పనులన్నీ సాఫ్ట్వేర్ డెవలపర్ల పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఇటువంటి డెవలపర్ల నియామకాలు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్న నగరాల్లో ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ 10వ స్థానంలో నిలిచింది. ‘కరత్.కామ్’ అనే మానవ వనరుల సేవల సంస్థ రూపొందించిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సాఫ్ట్వేర్ డెవలపర్ల నియామకాలు అధికంగా యూఎస్లోని వివిధ నగరాల్లో నమోదవుతుండగా, ఆ తర్వాత అటువంటి నగరాలు ఎక్కువ సంఖ్యలో మన దేశంలోనే ఉండటం ప్రత్యేకత. మన దేశంలో హైదరాబాద్, చెన్నై, గురుగావ్, బెంగుళూరు, పుణె, ముంబయి నగరాల్లో అధికంగా ఈ నియామకాలు నమోదవుతున్నాయి. ఇందులో హైదరాబాద్ ముందు స్థానంలో ఉండడమే కాకుండా ప్రపంచవ్యాప్త నగరాల్లో 10వ స్థానాన్ని సంపాదించింది.
ఐటీ సంస్థల ఆసక్తి..
హైదరాబాద్లో ప్రధానంగా ఆర్థిక సేవలు, బీమా, టెలికామ్ రంగాలకు సాఫ్ట్వేర్ సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీలు అధికంగా ఉండడంతో ఇది సాధ్యపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రంగాలకు సేవలు అందించే ఐటీ కంపెనీలు అధికంగా సాఫ్ట్వేర్ డెవలపర్ల నియామకాలు చేపడుతున్నాయి. డెవలపర్ల నియామకాలు అధికంగా ఉన్న దేశాల్లో యూఎస్, భారత్తో పాటు సింగపూర్, జపాన్, కెనడా, యూకే కనిపిస్తున్నాయి. ఇతర దేశాలతో పోల్చితే భారత్కున్న ప్రత్యేకత... సాఫ్ట్వేర్ డెవలపర్ల సంఖ్య ఎంతో అధికంగా ఉండడం. అదే సమయంలో వ్యయాలు కూడా ఇతర దేశాలతో పోల్చితే తక్కువగా ఉన్నాయి. దీని వల్ల కొత్తగా డెవలప్మెంట్ కేంద్రాలను మన దేశంలో ఏర్పాటు చేసేందుకు ఐటీ కంపెనీలు ఆసక్తిగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల సాఫ్ట్వేర్ డెవలపర్లకు అవకాశాలు మున్ముందు ఇంకా పెరిగేందుకే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇవన్నీ హైదరాబాద్కు కలిసి వచ్చే పరిణామాలుగా పేర్కొంటున్నాయి.
8 లక్షలకు పైగా ఉద్యోగులు
సాఫ్ట్వేర్ పరిశ్రమ హైదరాబాద్లో అధిక వృద్ధి నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రంగంలో 8 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1.83 లక్షల కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులు నమోదయ్యాయి. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో గత ఏడేళ్లలో ఏటా 15 శాతానికి పైగా వృద్ధి నమోదు కావడం గమనార్హం. గత కొన్నేళ్లలో హైదరాబాద్లో ఎంతో బలమైన ‘టెక్ ఎకో సిస్టమ్’ రూపుదిద్దుకుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యాయి. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐటీ పరిశ్రమకు విశేషమైన మద్దతు లభిస్తోంది. ఈ అంశాలన్నీ కలిసి ఐటీ రంగంలో హైదరాబాద్ను ఉన్నత స్థానంలో నిలబెడుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి. ‘‘సాఫ్ట్వేర్ డెవలపర్ల నియామకాలు అధికంగా నమోదవుతున్న నగరాల్లో హైదరాబాద్, ప్రపంచ వ్యాప్తంగా ‘టాప్ 20’ నగరాల్లో స్థానం సంపాదించిందని, ఐటీ/ ఐటీఈఎస్ రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతికి ఇది ప్రత్యేక గుర్తింపు’’ అని తాజాగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ‘ట్వీట్’ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా