కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు.
ఈనాడు, హైదరాబాద్: ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. గురువారం కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ నియామకాన్ని ఖరారు చేశారు. ఆయన వెంటనే పదవీ బాధ్యతలు చేపడతారు. అరుణ్ 2021 ఫిబ్రవరి నుంచి సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ఛైర్మన్గా పనిచేస్తున్నారు. కంపెనీ ఛైర్మన్, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న ఏ.వేలాయన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇకపై గౌరవ ఛైర్మన్గా వ్యవహరిస్తారు.
తగ్గిన ఆదాయం, లాభాలు: మార్చి త్రైమాసికానికి రూ.4,027 కోట్ల మొత్తం ఆదాయం, రూ.209 కోట్ల నికరలాభాన్ని సంస్థ ప్రకటించింది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం రూ.5,519 కోట్లు, నికరలాభం రూ.262 కోట్లుగా ఉన్నాయి. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం 27%, నికరలాభం 20% తగ్గాయి.
- 2023-24 పూర్తి కాలానికి సంస్థ రూ.22,308 కోట్ల ఆదాయంపై రూ.1,719 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఆదాయం రూ.29,784 కోట్లు, నికరలాభం రూ.2,035 కోట్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 25%, నికరలాభం 16% తగ్గాయి.
- రుతుపవనాలు అనుకూలించకపోవడం, చెరువుల్లో నీటి నిల్వ తక్కువగా ఉండటంతో సాగు విస్తీర్ణం తగ్గినందునే ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తుల అమ్మకాలు క్షీణించినట్లు కోరమాండల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అరుణ్ అలగప్పన్ అన్నారు. దీనికి తోడు సబ్సిడీ తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లో సవాళ్లూ ఆదాయాలపై ప్రభావం చూపినట్లు తెలిపారు. తమ ఎరువుల కర్మాగారాలు 95% ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేశాయని, సస్య రక్షణ ఉత్పత్తుల అమ్మకాలు 20% పెరిగాయని వివరించారు.
లారస్ ల్యాబ్స్కు తగ్గిన లాభాలు
ఈనాడు, హైదరాబాద్: లారస్ ల్యాబ్స్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.1,440 కోట్ల ఆదాయం, రూ.76 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్ రూ.1.40గా నమోదైంది. 2022-23 ఇదేకాలంతో పోల్చితే ఆదాయం 4% పెరిగినా, నికరలాభం 26% క్షీణించింది. సమీక్షా త్రైమాసికంలో ఎబిటా (వడ్డీ, పన్ను, తరుగుదల, ఇతర కేటాయింపుల కంటే ముందు ఆదాయం) మిగులు 18% ఉంది. వాటాదార్లకు ఒక్కో షేరుకు 40 పైసల చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని కంపెనీ యాజమాన్యం ప్రతిపాదించింది.
గత ఆర్థిక సంవత్సరం (2023-24) పూర్తి కాలానికి ఈ సంస్థ రూ.5,041 కోట్ల ఆదాయాన్ని, రూ.161 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. వార్షిక ఈపీఎస్ రూ.2.9గా ఉంది. ఎబిటా మిగులు 15.8% కాగా, నికర లాభాలు 3.2 శాతంగా ఉన్నాయి. 2022-23తో పోల్చితే, గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 17%, నికరలాభం 80% తగ్గాయి.
కారణాలివీ: కొవిడ్ మందుల అమ్మకాలు తగ్గడంం లారస్ ల్యాబ్స్ ఆదాయాలు, లాభాలపై ప్రభావం చూపింది. కానీ ఎఫ్డీఎఫ్, సీడీఎంఓ, ఆంకాలజీ ఏపీఐ, బయోటెక్ విభాగాల్లో మెరుగైన పనితీరు నమోదు చేసినట్లు లారస్ ల్యాబ్స్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్పష్టమైన కార్యచరణతో ముందుకు సాగేందుకు బలమైన పునాదులు వేసినట్లు తెలిపారు. లాభాలు పెంచుకోడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. జంతు రక్షణ, సస్యరక్షణ మందులు, బయోటెక్నాలజీ, సెల్- జీన్ థెరపీ మందులు అందించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు.
బోర్డు ఛైర్మన్గా డాక్టర్ రవీంద్రనాధ్: లారస్ ల్యాబ్స్ డైరెక్టర్ల బోర్డులో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు డైరెక్టర్ల బోర్డుకు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా వ్యవహరించిన డాక్టర్ ఎం.వీ.జీ.రావు పదవీ కాలం మే 17వ తేదీతో ముగియనుంది. ఆయన స్థానంలో డాక్టర్ రవీంద్రనాధ్ కంచర్లను ఎంపిక చేశారు. మే 18 నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుంది. డాక్టర్ రవీంద్రనాధ్ లారస్ ల్యాబ్స్ బోర్డులో 2017 నుంచి ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కృష్ణ చైతన్య చావ, సౌమ్య చావ నియమితులయ్యారు. స్వతంత్ర డైరెక్టర్గా కరణం శేఖర్ను ఎంపిక చేశారు.
ఒలెక్ట్రా గ్రీన్టెక్కు రూ.77 కోట్ల వార్షిక లాభం
10,000కు మించి విద్యుత్తు బస్సుల ఆర్డర్లు
సీతారాంపూర్ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్: ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1154.14 కోట్ల ఆదాయాన్ని, రూ.76.83 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.2022-23తో పోల్చితే ఆదాయం 5.8%, నికరలాభం 17.1% పెరిగాయి. ఎబిటా (వడ్డీ, పన్ను, ఇతర కేటాయింపుల కంటే ముందు ఆదాయం) 20.5% నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో 8,232 విద్యుత్తు బస్సుల సరఫరాకు ఆర్డర్లు లభించాయని, బెస్ట్- ముంబయి నుంచి లభించిన 3,000 బస్సుల రిపీట్ ఆర్డర్ ఇందులో ఉన్నట్లు ఒలెక్ట్రా గ్రీన్టెక్ సీఎండీ కేవీ ప్రదీప్ వెల్లడించారు. దీంతో తాము సరఫరా చేయాల్సిన బస్సుల సంఖ్య 10,000ను మించిందని అన్నారు. ఇప్పటి వరకు 1,746 విద్యుత్తు బస్సులను వినియోగదార్లకు అందించామన్నారు. 2023-24 మార్చి త్రైమాసికంలో 131 బస్సులను సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తమ చేతిలో 10,969 బస్సులకు ఆర్డర్లు ఉన్నందున, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించినట్లు వివరించారు. హైదరాబాద్ సమీపంలోని సీతారాంపూర్ యూనిట్లో పాక్షికంగా బస్సుల ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ యూనిట్ నుంచి మొదటి బ్యాచ్ విద్యుత్తు బస్సులను వినియోగదార్లకు సరఫరా చేసినట్లు తెలిపారు.
సైయెంట్ లాభం రూ.173 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్, ఐటీ సేవల సంస్థ సైయెంట్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.1,489 కోట్ల ఆదాయాన్ని, రూ.173 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాలంతో పోల్చి చూస్తే ఆదాయం 2.8%, నికరలాభం 9.1% పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి సైయెంట్ ఆదాయం రూ.5,911 కోట్లు కాగా, దీనిపై నికరలాభం రూ.689 కోట్లు నమోదైంది. వార్షికాదాయం 16%, నికరలాభం 31.6% పెరిగాయి. వాటాదార్లకు ఒక్కో షేరుపై రూ.30 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ యాజమాన్యం ప్రతిపాదించింది. గత ఆర్థిక సంవత్సరం అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు నమోదు చేసినట్లు సైయెంట్ సీఎండీ కృష్ణ బొదనపు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తమ ఆర్డర్ బుక్ ఎంతో ఆకర్షణీయంగా ఉందని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
Warren Buffett: భారత మార్కెట్లో ఉన్న అవకాశాలను భవిష్యత్తులో అందిపుచ్చుకునేందుకు తమ కంపెనీ బెర్క్షైర్ హాత్వే సిద్ధంగా ఉందని వారెన్ బఫెల్ తెలిపారు. -
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
IPO: రూ.6,400 కోట్ల సమీకరణ లక్ష్యంతో వచ్చేవారంలో మూడు కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. 2004 నుంచి సాధారణ ఎన్నికల సమయంలో మే నెలలో ఐపీఓలు ఉండడం ఇదే తొలిసారి. -
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
యాపిల్ వాచ్ ఓ మహిళ ప్రాణాల్ని కాపాడింది. అసలు ఒక స్మార్ట్ గడియారం ఆమెను ఎలా రక్షించగలిగిందంటే. -
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
USA: అమెరికా టెక్ పరిశ్రమలో భారతీయులది కీలక పాత్ర అని సిలికాన్ వ్యాలీ సెంట్రల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ సీఈఓ హర్బీర్ కె భాటియా తెలిపారు. వారు లేనిదే ఆ పరిశ్రమ మనుగడ సాగించలేదని అభిప్రాయపడ్డారు. -
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
-
లఖ్నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్