మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది.
మళ్లీ 74,000 పాయింట్ల పైకి సెన్సెక్స్
సమీక్ష
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.28 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మదుపర్ల సంపదగా పరిగణించే, బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ గత 5 ట్రేడింగ్ రోజుల్లో రూ.11.29 లక్షల కోట్లు పెరిగి, తాజా రికార్డు గరిష్ఠమైన రూ.404.18 లక్షల కోట్ల (4.87 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది. ఇదే సమయంలో సెన్సెక్స్ 1850.45 పాయింట్లు లాభపడింది.
- సెన్సెక్స్ ఉదయం 73,572.34 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అనంతరం బలంగా పుంజుకుని లాభాల్లోకి వచ్చిన సూచీ, ఒకదశలో 74,571.25 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 486.50 పాయింట్ల లాభంతో 74,339.44 వద్ద ముగిసింది. నిఫ్టీ 167.95 పాయింట్లు పెరిగి 22,570.35 దగ్గర స్థిరపడింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 22 పరుగులు తీశాయి. ఎస్బీఐ 5.10%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 2.55%, సన్ఫార్మా 2.30%, ఐటీసీ 2.02%, ఎన్టీపీసీ 1.92%, ఎం అండ్ ఎం 1.76%, హెచ్సీఎల్ టెక్ 1.62%, బజాజ్ ఫిన్సర్వ్ 1.55% లాభపడ్డాయి. హెచ్యూఎల్, టైటన్, బజాజ్ ఫైనాన్స్ 1.25% వరకు నష్టపోయాయి.
- ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు 5.98% దూసుకెళ్లి రూ.1,127.35 దగ్గర ముగిసింది. బ్యాంక్ ఎండీ, సీఈఓగా అమిత్ ఛౌద్రీ పునర్నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. 2025 జనవరి 1 నుంచి మూడేళ్ల పాటు ఈ నియామకం వర్తిస్తుంది.
- బలహీన త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో హెచ్యూఎల్ షేరు 1.25% నష్టపోయి రూ.2,231 వద్ద ముగిసింది.
- ఫలితాల ప్రభావంతో నెస్లే ఇండియా షేరు 2.39% పెరిగి రూ.2,562.70 వద్ద ముగిసింది.
- ప్యూర్సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ను 94.5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.779 కోట్ల)కు కొనుగోలు చేయనున్నట్లు హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ ప్రకటించింది.
- మోతీలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ, సీఈఓగా ప్రతీక్ అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈఓ నవీన్ అగర్వాల్ గ్రూప్ పదవులను చేపట్టనున్నారు.
- ఐపీఓ ద్వారా రూ.10,400 కోట్ల వరకు సమీకరించేందుకు వాటాదార్లు అనుమతి ఇచ్చారని ఆహార డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది.
- 3:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేసేందుకు ఐనాక్స్ విండ్ బోర్డు ఆమోదం తెలిపింది.
- వొడాఫోన్ ఐడియా షేర్లు గురువారం రికార్డు స్థాయిలో ట్రేడయ్యాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో కలిపి మొత్తం 1055 కోట్ల షేర్లు చేతులు మారడం విశేషం. ఈనెల 23న, 308 కోట్ల వొడాఫోన్ ఐడియా షేర్లు ట్రేడవడం ఇప్పటివరకు రికార్డుగా ఉంది. ఎఫ్పీఓలో సమీకరించిన రూ.18,000 కోట్ల వల్ల సంస్థ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, సేవలను విస్తృతం చేస్తామని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా ప్రకటించడంతో.. గురువారం షేరు 6.11% పెరిగి రూ.13.89 వద్ద ముగిసింది.
- జేఎన్కే ఇండియా ఐపీఓ చివరి రోజు ముగిసేసరికి 28.07 రెట్ల స్పందన లభించింది.
- ఎమ్ఫోర్స్ ఆటోటెక్ ఐపీఓ చివరిరోజు ముగిసేసరికి 365 రెట్ల స్పందన లభించింది.
- డిజిటల్ ఛానెళ్లలో ఇటీవల వినియోగదార్లకు తప్పుగా దాదాపు 17,000 క్రెడిట్ కార్డులు జారీ అయినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.
నేటి బోర్డు సమావేశాలు: హెచ్సీఎల్ టెక్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ కార్డ్, వీఎస్టీ ఇండస్ట్రీస్
-
కోటక్ బ్యాంక్ షేరు ఢమాల్: కొత్త వినియోగదారులను ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా చేర్చుకోకుండా ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు 10.85% కుదేలై రూ.1643 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ.1620 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. సంస్థ మార్కెట్ విలువ రూ.39,768.36 కోట్లు పతనమై రూ.3.26 లక్షల కోట్లకు పరిమితమైంది. దీంతో మార్కెట్ విలువ పరంగా అత్యంత విలువైన బ్యాంక్ల్లో 5వ స్థానానికి పడిపోయింది. మొదటి నాలుగు స్థానాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. షేరు పతనంతో ఆసియాలోనే ధనిక బ్యాంకర్గా ఉన్న ఉదయ్ కోటక్ సంపద 1.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.10,800 కోట్లు) ఆవిరైంది. బ్యాంక్లో ఆయనకు 26% వాటా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
Warren Buffett: భారత మార్కెట్లో ఉన్న అవకాశాలను భవిష్యత్తులో అందిపుచ్చుకునేందుకు తమ కంపెనీ బెర్క్షైర్ హాత్వే సిద్ధంగా ఉందని వారెన్ బఫెల్ తెలిపారు. -
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
IPO: రూ.6,400 కోట్ల సమీకరణ లక్ష్యంతో వచ్చేవారంలో మూడు కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. 2004 నుంచి సాధారణ ఎన్నికల సమయంలో మే నెలలో ఐపీఓలు ఉండడం ఇదే తొలిసారి. -
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
యాపిల్ వాచ్ ఓ మహిళ ప్రాణాల్ని కాపాడింది. అసలు ఒక స్మార్ట్ గడియారం ఆమెను ఎలా రక్షించగలిగిందంటే. -
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
USA: అమెరికా టెక్ పరిశ్రమలో భారతీయులది కీలక పాత్ర అని సిలికాన్ వ్యాలీ సెంట్రల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ సీఈఓ హర్బీర్ కె భాటియా తెలిపారు. వారు లేనిదే ఆ పరిశ్రమ మనుగడ సాగించలేదని అభిప్రాయపడ్డారు. -
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!