Indian Banks: మన బ్యాంకులకు ఇబ్బందేమీ లేదు
అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్ అయిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్తో పాటు సిగ్నేచర్ బ్యాంక్ కూడా దివాలా తీయడం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
రిటైల్ డిపాజిట్లే కాపాడుతున్నాయ్
ఈనాడు - హైదరాబాద్: అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్ అయిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్తో పాటు సిగ్నేచర్ బ్యాంక్ కూడా దివాలా తీయడం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ప్రభావం అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలపై ఏ మేరకు ఉంటుందనే అంశంపై ఆర్థికవేత్తలు, బ్యాంకింగ్ నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. అయితే భారత్లో బ్యాంకుల అప్పులు-ఆస్తుల నిర్వహణ సమర్థంగా ఉండటం, రిటైల్ డిపాజిట్లు అధికంగా ఉన్నందున ఎస్వీబీ ప్రభావం పెద్దగా ఉండదని ఆస్ట్రేలియా కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మెక్వారీ అంచనా వేస్తోంది. మన బ్యాంకులు దేశీయ డిపాజిట్లపైనే ఎక్కువగా ఆధారపడతాయి. విదేశాల నుంచి మన బ్యాంకుల్లో డిపాజిట్లు పెద్ద మొత్తంలో ఉండవు. మన బ్యాంకులు ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టడమూ తక్కువే. అక్కడి సంస్థలకూ రుణాలు అంత తేలిగ్గా ఇవ్వవు. ఈ లావాదేవీలు చేయాలంటే ఎన్నో నిబంధనలు పాటించాల్సి వస్తుంది. ఎస్వీబీలో మన దేశీయ బ్యాంకులకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎలాంటి డిపాజిట్లు లేవు. ప్రపంచంలోని ఇతర బ్యాంకుల్లోనూ దేశీయ బ్యాంకుల డిపాజిట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
60 శాతం ప్రజలవే
మన దేశంలోని బ్యాంకుల్లో రిటైల్ డిపాజిట్లే అధికం. బ్యాంకు టర్మ్ డిపాజిట్లలో దాదాపు 60% ప్రజల పొదుపు సొమ్మే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు, ఇతర సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి మిగతా సొమ్ము ఉంటుంది. వడ్డీరేట్లు పెంచుతున్నందున, ఇటీవల మళ్లీ డిపాజిట్లు పెరుగుతున్నాయి. గత, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకు డిపాజిట్లలో దాదాపు 15 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. ఈ సొమ్మునే దేశీయ సంస్థలకు రుణాలివ్వడంతో పాటు ప్రభుత్వ సెక్యూరిటీల్లో బ్యాంకులు మదుపు చేస్తుంటాయి. అందువల్ల విదేశీ లావాదేవీలు బాగా తక్కువ.
రుణ ఖాతాలు మెరుగ్గా
ఈ మధ్యకాలంలో బ్యాంకులు మొండి బాకీలు తగ్గించుకుంటున్నాయి. నిరర్థక ఆస్తుల నుంచీ రికవరీలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. మొండి బాకీలకు కేటాయింపులు (పీసీఆర్) 70-80% వరకు ఉంటున్నాయి. కొత్త రుణ ఖాతాలు మొండి బకాయిలుగా మారడం తగ్గింది. మూలధన నిష్పత్తి (సీఏఆర్) 11 శాతంగా ఉండాలనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధన. దేశంలోని బ్యాంకులన్నింటి సీఏఆర్ దీనికంటే ఎంతో అధికంగా ఉంది. 14-15% వరకు సీఏఆర్ ఉన్న బ్యాంకులున్నాయి. దేశీయ బ్యాంకుల పనితీరును ఆర్బీఐ అనుక్షణం గమనిస్తుండటమే ఉపకరిస్తోందని బ్యాంకింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే స్వల్పకాలానికి మాత్రం సెంటిమెంట్ కాస్త బలహీనం కావచ్చు.
బ్యాంకింగ్ సూత్రాలకు విరుద్ధంగా
40 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఎస్వీబీ బ్యాంకు కుప్పకూలడానికి ప్రధాన కారణం.. స్వల్పకాలిక డిపాజిటర్ల సొమ్మును తీసుకెళ్లి, దీర్ఘకాలిక రుణాలుగా ఇవ్వడమే. ఇది బ్యాంకింగ్ ప్రాథమిక విధానాలకు విరుద్ధం. ఒక్కసారిగా డిపాజిటర్లు తమ డబ్బును వెనక్కి తీసుకెళ్లడం ప్రారంభించడంతో, ఇవ్వలేక కుప్పకూలింది. మన దేశంలోనూ ఐఎల్అండ్ఎఫ్ఎస్ సంక్షోభంలో కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థల డెట్ ఫథకాలకు ఇబ్బంది ఎదురవ్వడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434