Reliance: సబ్బులు.. శీతల పానీయాల్లో ధరల పోటీ
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 2016లో జియో 4జీతో టెలికాం సేవల రంగంలోకి ప్రవేశించి, ఈ రంగం స్వరూపాన్నే మార్చేసింది.
రిలయన్స్ ప్రవేశంతో మారుతున్న చిత్రం
నాడు టెలికాంలో
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 2016లో జియో 4జీతో టెలికాం సేవల రంగంలోకి ప్రవేశించి, ఈ రంగం స్వరూపాన్నే మార్చేసింది. కేవలం డేటాకే ఛార్జీలు.. అది కూడా అప్పటి ధరలతో పోలిస్తే నామమాత్రం వసూలు చేసి, కాల్స్ పూర్తి ఉచితంగా మాట్లాడుకునే వీలు కల్పించింది. జియో రాకకు ముందు 1 జీబీ డేటా కొనుగోలుకు చందాదార్లు కనీసం రూ.250 వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఆ ఛార్జీకే నెలలో 45 జీబీకి మించి డేటాను జియో ఇవ్వడంతో, మొబైల్ వాడకం తీరే మారింది. జియో మార్గాన్నే ఇతర సంస్థలూ అనుసరించాల్సి వచ్చింది.
ఇప్పుడు ఎఫ్ఎంసీజీలో
110 బిలియన్ డాలర్ల (రూ.9 లక్షల కోట్ల) విలువైన దేశీయ ఎఫ్ఎంసీజీ రంగంపై ఆర్ఐఎల్ దృష్టి సారించింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్) పూర్తి స్థాయి అనుబంధ ఎఫ్ఎంసీజీ సంస్థ ఆర్సీపీఎల్ ప్రస్తుతం ఎంపిక చేసిన మార్కెట్లలోనే అందుబాటులో ఉంది. దేశం మొత్తం డీలర్ నెట్వర్క్ను నిర్మించి, సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో తమ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూసుకునేందుకు సిద్ధమవుతోంది. పలు బ్రాండ్లను కొనుగోలు చేయడంతో పాటు సబ్బుల నుంచి శీతల పానీయాల వరకు ఉత్పత్తులను విడుదల చేస్తోంది. ఈ రంగంలోని దిగ్గజ సంస్థలైన హెచ్యూఎల్, పీఅండ్జీ, రెకిట్, నెస్లే ఉత్పత్తుల కంటే 30-35% తక్కువ ధరలకే ఆఫర్ చేస్తూ, కొనుగోలుదార్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.
* సుమారు 9 బిలియన్ డాలర్ల (రూ.74,000 కోట్ల) విలువైన శీతల పానీయాల విపణిలో అంతర్జాతీయ దిగ్గజాలైన పెప్సికో, కోకకోలాలతో ఆర్ఐఎల్ పోటీని ప్రారంభించింది. వేసవి కలిసి రావడంతో, కాంపా కోలాను మళ్లీ విడుదల చేసి, జియో మార్ట్, రిలయన్స్ రిటైల్ స్టోర్లలో 500 మి.లీ. బాటిల్ను రూ.20కు; 2 లీటర్ల సీసాను రూ.49కే అందుబాటులో ఉంచింది.
* 2022లో దేశంలో సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల అమ్మకాలు 21.65 బి.డాలర్ల (రూ.1.78 లక్షల కోట్ల) స్థాయిలో జరిగాయని అంచనా. గ్లిమ్మర్ బ్యూటీ సబ్బులు, గెట్ రియల్ నేచురల్ సబ్బులు, ప్యూరిక్ హైజీన్ సబ్బులను 100 గ్రాములకు ఆర్సీపీఎల్ రూ.25కే విక్రయిస్తోంది. ఈ విభాగంలో ఇతర కంపెనీల సబ్బులు రూ.34-49 శ్రేణిలో ఉన్నాయి. వాషింగ్మెషీన్ లిక్విడ్ డిటర్జెంట్ 2 లీటర్ల ప్యాక్ను రిలయన్స్ రూ.250కే అందుబాటులోకి తెచ్చింది. ఇలాంటివే వేరే కంపెనీవి రూ.325పైన ఉన్నాయి.
* పాత్రలను శుభ్రం చేసే సబ్బులను రూ.5, రూ.10, రూ.15 శ్రేణిలో, లిక్విడ్ జెల్ ప్యాక్లను రూ.10, రూ.30, రూ.45 శ్రేణిలో ఆర్సీపీఎల్ అందిస్తోంది. రూ.1 నుంచీ లిక్విడ్ జెల్ శాచెట్లను విక్రయిస్తూ, పేద వర్గాలనూ ఆకర్షిస్తోంది.
కాంట్రాక్టు తయారీ సంస్థలకూ కలిసి వస్తుంది
ముడిపదార్థాల లభ్యత బాగున్నందున, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను తయారు చేసి అందించే సంస్థలు గత అయిదేళ్లలో బాగా పెరిగాయి. అందువల్ల తాము కోరిన ప్రమాణాల్లో, ఉత్పత్తులను తయారు చేయించుకుని, తమ బ్రాండ్పై విడుదల చేయడం ఈ రంగంలోని సంస్థలకు సులభమవుతోందని డెలాయిట్ ఇండియా కన్సల్టింగ్ భాగస్వామి రజత్ వహి పేర్కొన్నారు. రిలయన్స్ వంటి సంస్థలు కొత్త బ్రాండ్లను ప్రవేశపెడుతుండటం వీటికి కలిసి వస్తుందని అంచనా వేశారు. దేశంలోని 1.10-1.13 కోట్ల మేర ఉన్న కిరాణా దుకాణాలకు తమ ఉత్పత్తులను చేరవేయడమే సంస్థలకు ఉన్న అసలైన సవాలుగా వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?