TATA Power: ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయంగా టాటా పవర్
మనదేశంలోని ఉద్యోగులకు ‘అత్యంత ఆకర్షణీయ కంపెనీ బ్రాండ్’గా టాటా పవర్ కంపెనీ అవతరించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్, టాటా స్టీల్ ఉన్నట్లు మానవ వనరుల సేవల సంస్థ రాండ్స్టడ్ ఇండియా తన ‘రాండ్స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ 2023’లో పేర్కొంది.
తదుపరి స్థానాల్లో అమెజాన్, టాటా స్టీల్
రాండ్స్టడ్ ఇండియా వార్షిక నివేదిక
ముంబయి: మనదేశంలోని ఉద్యోగులకు ‘అత్యంత ఆకర్షణీయ కంపెనీ బ్రాండ్’గా టాటా పవర్ కంపెనీ అవతరించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్, టాటా స్టీల్ ఉన్నట్లు మానవ వనరుల సేవల సంస్థ రాండ్స్టడ్ ఇండియా తన ‘రాండ్స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ 2023’లో పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 75 శాతం వాటా కలిగిన 32 మార్కెట్లలోని 1.63 లక్షల మంది ఉద్యోగులను సర్వే చేసి, ఈ నివేదిక రూపొందించినట్లు సంస్థ తెలిపింది. దీని ప్రకారం మన దేశంలో..
* ఆర్థిక పరిస్థితి, మెరుగైన కీర్తిప్రతిష్ఠలు, వృత్తిజీవితంలో ఎదగడానికి అవకాశాల విషయంలో టాటా పవర్ అత్యధిక స్కోరు సాధించింది. 2022లో 9వ ర్యాంకులో ఉన్న ఈ కంపెనీ ఈ ఏడాది అగ్రస్థానంలోకి వచ్చింది.
* అమెజాన్ ఇండియా కూడా ర్యాంకుల్లో రాణించి.. రెండో స్థానంలో నిలిచింది. టాటా స్టీల్, టీసీఎస్ వరుసగా 3, 4 స్థానాలను సంపాదించాయి.
* మైక్రోసాఫ్ట్, శాంసంగ్ ఇండియా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఐబీఎమ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తొలి 10 కంపెనీల్లో టాటా గ్రూప్నకు చెందినవే 4 ఉండటం గమనార్హం.
* ఆన్లైన్ మెగాస్టోర్ అయిన బిగ్ బాస్కెట్ అత్యంత ఆకర్షణీయ అంకుర బ్రాండ్గా అవతరించింది.
వాహన రంగాన్ని ఇష్టపడుతున్నారు
వాహన (77%) రంగం అత్యంత ఆకర్షణీయమైనదిగా ఉద్యోగులు రేటింగ్ ఇచ్చారు. ఆ తర్వాతి స్థానాల్లో ఐటీ, ఐటీఈఎస్, టెలికాం(76%), ఎఫ్ఎమ్సీజీ, రిటైల్, ఇ-కామర్స్(75%) నిలిచాయి.
ఈ అంశాల ఆధారంగా
కంపెనీని ఎంచుకునేందుకు వృత్తి-జీవిత సమతౌల్యం, కీర్తిప్రతిష్ఠలు, ఆకర్షణీయ వేతనం-ప్రయోజనాలను భారతీయ ఉద్యోగులు పరిగణనలోకి తీసుకున్నారు. వీటిల్లో పని-జీవిత సమతౌల్యానికి మహిళలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
* అదనపు ఆదాయానికి ఇతరత్రా పనులు చేసుకోవడానికి అంగీకరించే కంపెనీలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయని 91% మంది ఉద్యోగులు చెప్పారు. నీ పెట్టుబడులు మాత్రమే వ్యాపార విజయానికి దోహదం చేయలేవని.. ఉద్యోగులే అందుకు కారణమవుతారని ప్రపంచవ్యాప్తంగా సంస్థలు గుర్తించాయి. నైపుణ్యం ఉన్న ఉద్యోగులు తాము ఏ బ్రాండ్లో పనిచేయాలన్న దానిపై అత్యంత శ్రద్ధ పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.