సెమీకండక్టర్‌ ప్లాంట్‌లో ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్‌ రూ.5,000 కోట్ల పెట్టుబడులు

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ పెట్టుబడులున్న ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్‌, మహారాష్ట్రలోని సెమీకండక్టర్‌ ప్లాంట్‌లో వచ్చే అయిదేళ్లలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు మంగళవారం వెల్లడించింది.

Published : 27 Mar 2024 01:14 IST

ముంబయి: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ పెట్టుబడులున్న ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్‌, మహారాష్ట్రలోని సెమీకండక్టర్‌ ప్లాంట్‌లో వచ్చే అయిదేళ్లలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఇందులో సచిన్‌ వాటా ఎంత? ఇతర వాటాదార్ల వాటా ఎంత అనే వివరాలు తెలుపలేదు. శాటిలైట్‌ సిటీ అయిన నవీ ముంబయిలో 25,000 చదరపు అడుగుల ప్లాంట్‌ను సచిన్‌ తెందూల్కర్‌, మాజీ న్యూక్లియర్‌ ఫిజిసిస్ట్‌ అనిల్‌ కకోడ్కర్‌, కంపెనీ వ్యవస్థాపకులు, ఛైర్మన్‌, ప్రమోటర్‌, సీఈఓ రాజేంద్ర చోడంకర్‌ సమక్షంలో ఇటీవల ఆవిష్కరించిన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని