అదానీ చేతికి గోపాల్పుర్ పోర్ట్
ఒడిశాలోని గోపాల్పుర్ పోర్ట్ను రూ.3,350 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువ వద్ద రూ.1349 కోట్లకు అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజడ్కు (ఏపీఎస్ఈజడ్) విక్రయించినట్లు షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూపు మంగళవారం వెల్లడించింది.
రూ.1,349 కోట్లకు విక్రయించిన ఎస్పీ గ్రూపు
దిల్లీ: ఒడిశాలోని గోపాల్పుర్ పోర్ట్ను రూ.3,350 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువ వద్ద రూ.1349 కోట్లకు అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజడ్కు (ఏపీఎస్ఈజడ్) విక్రయించినట్లు షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూపు మంగళవారం వెల్లడించింది. నిర్మాణ దశలోనే ఈ పోర్టును 2017లో ఎస్పీ గ్రూపు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ పోర్టు హ్యాండ్లింగ్ సామర్థ్యం సంవత్సరానికి 20 మిలియన్ టన్నులు. ఎల్ఎన్జీ రీగ్యాస్ఫికేషన్ టర్మినల్ ఏర్పాటు నిమిత్తం ఇటీవలే పెట్రోనెట్ ఎల్ఎన్జీతో గోపాల్పుర్ పోర్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల దీర్ఘకాలంలో పోర్ట్కు ఆదాయం పెరగొచ్చన్నది అంచనా. గోపాల్పుర్ పోర్టులో ఎస్పీ గ్రూపునకు చెందిన 56% వాటాను, ఒడిశా స్టీవ్డోర్స్ లిమిటెడ్కు చెందిన 39% వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఏపీఎస్ఈజడ్ తెలిపింది.
గత కొన్ని నెలల్లో ఎస్పీ గ్రూపు వాటా విక్రయించిన రెండో పోర్ట్ ఇది. మహారాష్ట్రలో ఉన్న ధరమ్తార్ పోర్ట్లో వాటాను జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.710 కోట్ల విలువ వద్ద ఎస్పీ గ్రూపు విక్రయించింది. ఆ పోర్ట్ను ఎస్పీ గ్రూపు 2015లో కొనుగోలు చేసినప్పుడు, పోర్ట్ వార్షిక సామర్థ్యం 1 మిలియన్ టన్నుల లోపే ఉండేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సామర్థ్యం 5 మిలియన్ టన్నులకు చేరుతుందనే అంచనా ఉంది.
‘ధరమ్తార్, గోపాల్పుర్ పోర్ట్లలో గణనీయ విలువ వద్ద వాటా విక్రయించడం ద్వారా, స్వల్పకాలంలో వాటాదార్లకు మంచి విలువను సృష్టించడం, ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్మాణంలో మాకున్న బలాన్ని తెలియజేస్తోంద’ని షాపూర్జీ పల్లోంజీ గ్రూపు అధికార ప్రతినిధి తెలిపారు. గ్రూపు రుణ భారాన్ని తగ్గించుకోవడానికే కాకుండా, వృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ఈ విక్రయ లావాదేవీలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్పీ గ్రూపునకు సుమారు రూ.20,000 కోట్ల అప్పు ఉంది. తమ వినియోగదార్లకు సేవలను మరింతగా అనుసంధానం చేసేందుకు గోపాల్పుర్ పోర్ట్ కొనుగోలు ఉపయోగపడుతుందని ఏపీఎస్ఈజడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.