LIC: ఎల్ఐసీ ఐపీఓ కోసం కోటి కొత్త డీమ్యాట్ ఖాతాలు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూ ఎప్పుడు జరపాలనే అంశంపై, ‘మదుపర్ల అత్యుత్తమ ప్రయోజనాల’ను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్) కార్యదర్శి
మదుపర్ల ప్రయోజనాలే లక్ష్యంగా తేదీలు నిర్ణయిస్తాం
దీపమ్ కార్యదర్శి
దిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూ ఎప్పుడు జరపాలనే అంశంపై, ‘మదుపర్ల అత్యుత్తమ ప్రయోజనాల’ను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్) కార్యదర్శి తుహిన్కాంత పాండే పేర్కొన్నారు. ‘ఎల్ఐపీ ఐపీఓ ప్రతిపాదన అనంతరం కోటి కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరచుకున్నాయంటే, ప్రజలకు ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతోంది. ఇపుడు మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 8 కోట్లకు పైగా చేరింది. మార్కెట్కు కొత్త శక్తి వచ్చింద’ని ఆయన అన్నారు.ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ ఇష్యూ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినా, అనుకోకుండా వచ్చిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల వల్ల మార్కెట్లలో తలెత్తిన పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు.‘ఎల్ఐసీ అనేది వ్యూహాత్మక పెట్టుబడి ఏమీ కాదు. అయితే అది చాలా ముఖ్యమైనద’ని ఆయన అన్నారు. వృత్తిపరమైన సలహాదారులు ఈ ఐపీఓ విషయంలో ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారని వివరించారు. ఈ ఇష్యూ ద్వారా రూ.60,000 కోట్లు సమీకరించి, 2021-22 పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యమైన రూ.78,000 కోట్లను సాధించాలని కేంద్రం భావిస్తోంది. సంస్థకు, మదుపర్లకు మేలు చేసేలా మాత్రమే ఐపీఓ నిర్వహించాలన్నది తమ లక్ష్యంగా వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!