నాలుగు ఔషధ బ్రాండ్లు విక్రయిస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ చిన్న పిల్లల ఔషధ విభాగానికి చెందిన నాలుగు బ్రాండ్లను జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాసూటికల్స్‌కు విక్రయించనుంది. ఇందులో జడ్‌ అండ్‌ డీ, పెడిక్లోరైల్‌, పెసెఫ్‌, ఎజినాపి బ్రాండ్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్రాండ్లు రూ.33 కోట్ల అమ్మకాలు నమోదు చేశాయి.

Published : 01 Jul 2022 02:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ చిన్న పిల్లల ఔషధ విభాగానికి చెందిన నాలుగు బ్రాండ్లను జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాసూటికల్స్‌కు విక్రయించనుంది. ఇందులో జడ్‌ అండ్‌ డీ, పెడిక్లోరైల్‌, పెసెఫ్‌, ఎజినాపి బ్రాండ్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్రాండ్లు రూ.33 కోట్ల అమ్మకాలు నమోదు చేశాయి. రూ.98 కోట్ల ప్రతిఫలానికి ఈ బ్రాండ్లను జేబీ కెమికల్స్‌కు డాక్టర్‌ రెడ్డీస్‌ విక్రయిస్తోంది. ఈ కొనుగోలు ప్రతిపాదనకు జేబీ కెమికల్స్‌ బోర్డు జూన్‌ 29న జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదముద్ర వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని