Gold: పండగ వేళ బంగారం కొనాలనుకునే వారికి చేదు వార్త!
పండగ సీజన్లో భారత్లో బంగారానికి గిరాకీ భారీగా ఉంటుంది. కానీ, మన దేశానికి బంగారం సరఫరా చేసే బ్యాంకులు మాత్రం కోత విధించాయి. దీంతో ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
దిల్లీ: పండగల వేళ బంగారం కొనాలనుకునే వారికి నిజంగా ఇది చేదు వార్త అనే చెప్పాలి. భారత్కు చేసే బంగారం సరఫరాలో విదేశీ బ్యాంకులు కోత విధించినట్లు సమాచారం. వారు చైనా, తుర్కియే విపణిపై దృష్టి సారించడమే ఇందుకు కారణం. భారత్తో పోలిస్తే ఆ దేశాల నుంచి అధిక లాభాలు వస్తున్నాయని సదరు బ్యాంకులు తెలిపాయి.
సాధారణంగానే పండగ సీజన్లో భారత్లో పసిడికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సరఫరాలో కోత విధించడం ఆందోళన కలిగించే విషయం. దేశీయ అవరాల నిమిత్తం ఇక్కడి విక్రేతలు అధిక ప్రీమియంతో బంగారాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి అనివార్యమవుతుంది. ఇదే జరిగితే ఈ పండగ సీజన్లో పసిడి ధరలు గణనీయంగా పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారత్కు ఐసీబీసీ స్టాండర్డ్ బ్యాంక్, జేపీ మోర్గాన్, స్టాండర్డ్ ఛార్టెర్డ్ ప్రధానంగా బంగారాన్ని సరఫరా చేస్తుంటాయి. సాధారణంగా ఈ సంస్థలు పండగ సీజన్కు ముందు భారీ ఎత్తున పసిడిని దిగుమతి చేసుకొని నిల్వ చేసుకుంటుంటాయి. ఈ సమయానికి వీరి వద్ద టన్నుల కొద్దీ బంగారం ఉండాలి. కానీ, ప్రస్తుతం కొన్ని వందల కిలోల నిల్వలు మాత్రమే ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. దీనిపై ఆయా బ్యాంకులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
కొవిడ్ లాక్డౌన్ సమయంలోనూ చైనాలో బంగారానికి గిరాకీ ఏమాత్రం తగ్గలేదు. దీంతో భారత్తో పోలిస్తే అక్కడి విక్రేతలు ఎక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లిస్తున్నారు. మరోవైపు తుర్కియేలో భారీ ద్రవ్యోల్బణం కారణంగా అక్కడి ప్రజలు బంగారంలో ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. దీంతో అక్కడి విక్రేతలు కూడా భారీ ప్రీమియంతో పసిడిని కొనడానికి ముందుకు వస్తున్నారు. ఫలితంగా బంగారాన్ని సరఫరా చేసే బ్యాంకులు భారత్ కంటే ఆ రెండు దేశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. సెప్టెంబరు నెలలో భారత్ బంగారం దిగుమతులు 30 శాతం తగ్గాయి. అదే సమయంలో తుర్కియే దిగుమతులు 453 శాతం పెరిగాయి. ఆగస్టులో చైనా దిగుమతులు 40 శాతం పెరగడం గమనార్హం.
భారత ప్రజలు ఈ అక్టోబరులో దసరా, దీపావళి, ధన త్రయోదశి వేడుకలను నిర్వహించుకోనున్నారు. ఈ పండగలకు బంగారాన్ని కొనాలని చాలా మంది సెంటిమెంటుగా పెట్టుకుంటుంటారు. తర్వాత పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బంగారానికి ఇప్పటి నుంచే గిరాకీ భారీగా పుంజుకోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు