EPF interest: ఈపీఎఫ్‌ వడ్డీ.. 8.1 శాతానికి కేంద్రం ఓకే

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డిపాజిట్లపై 8.1 శాతం వడ్డీ చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. గతంలో 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8.1 శాతానికి తగ్గించాలన్న ఈపీఎఫ్‌ఓ నిర్ణయానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.

Published : 03 Jun 2022 21:39 IST

దిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డిపాజిట్లపై 8.1 శాతం వడ్డీ చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. గతంలో 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8.1 శాతానికి తగ్గించాలన్న ఈపీఎఫ్‌ఓ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈపీఎఫ్‌ఓ నిర్ణయానికి అనుగుణంగా కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు వెళ్లగా.. ఆ శాఖ ఆమోదించింది. ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ 5 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేయనుంది.

ఈపీఎఫ్‌పై ఇంత తక్కువ వడ్డీ రేటు ఇవ్వడం 1977-78 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆ ఏడాది పీఎఫ్‌పై 8 శాతం వడ్డీ ఇచ్చారు. 2018-19, 2016-17లో 8.65శాతం చొప్పున వడ్డీ జమ చేయగా.. 2013-14, 2014-15లో 8.75శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8 శాతం చొప్పున జమచేశారు. అయితే కొవిడ్‌ సమయంలో విత్‌డ్రాలు పెరగడం, చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గిపోవడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని ఏడేళ్ల కనిష్ఠానికి తగ్గించి 8.5 శాతంగా ఇచ్చారు. 2020-21లో కూడా ఇదే 8.5 శాతం వడ్డీని కొనసాగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు