Jio 5G: మరో 27 సిటీల్లో జియో 5జీ సేవలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పట్టణాల్లోనే..
జియో 5జీ సేవలను మరో 27నగరాలకు విస్తరించినట్లు రిలయన్స్ సంస్థ వెల్లడించింది. హోలీ పర్వదినం సందర్భంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నగరాల జాబితాలో తెలంగాణలోనే అత్యధికం ఉండటం విశేషం.
దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Jio) తన 5జీ సేవల్ని శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 5జీ సేవల్ని(Jio 5G services) అందుబాటులోకి తీసుకొచ్చిన జియో.. తాజాగా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని మరో 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 331 నగరాలు/పట్టణాల్లో 5జీ సేవలను తీసుకొచ్చినట్లు టెలికం దిగ్గజం వెల్లడించింది. తాజాగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన పట్టణాల జాబితా తెలంగాణలోనే అత్యధికం ఉండటం విశేషం.
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్లోని అదనంగా మరో 27 నగరాల్లో 5జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు జియో తెలిపింది. కొత్తగా సేవలు ప్రారంభించిన ఆయా నగరాలు/పట్టణా జాబితాలో ఏపీలో తాడిపత్రి, తెలంగాణలోని జగిత్యాల, కోదాడ, కొత్తగూడెం, నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట, తాండూరు, జహీరాబాద్ ఉన్నాయి. అలాగే, భాటపర (ఛత్తీస్గఢ్), అనంత్నాగ్ (జమ్మూకశ్మీర్), కర్ణాటకలోని భద్రావతి, దొడ్డబళ్లాపూర్, చింతామణి, రామనగర; కేరళలోని చంగరస్సీ, కొడుంగల్లూర్, మువతుపుళ ఉండగా..కకాట్ని ముర్వారా (మధ్యప్రదేశ్), సతారా (మహారాష్ట్ర), పఠాన్కోఠ్ (పంజాబ్), కోవిల్పట్టి, పొల్లాచి (తమిళనాడు; రాంపూర్ (ఉత్తర్ప్రదేశ్); కాశీపూర్, రామ్నగర్ (ఉత్తరాఖండ్), బంకురా (పశ్చిమబెంగాల్) ఉన్నాయి. ఆయా నగరాల పరిధిలోని వినియోగదారులు జియో వెల్కమ్ ఆఫర్ను వినియోగించుకోవచ్చని తెలిపింది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే 1జీబీపీఎస్ కంటే ఎక్కువ వేగంతో అపరిమిత డేటాను వాడుకోవచ్చని పేర్కొంది. 2023 నాటికల్లా దేశవ్యాప్తంగా జియో 5జీ సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. జియో ట్రూ 5జీ టెక్నాలజీ ప్రయోజనాలను ప్రతి వినియోగదారుడికీ అందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి ఈ సేవలు ప్రతి పట్టణం/నగరంలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నది ఈ నగరాలు/పట్టణాల్లోనే..
జియో అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, అనకాపల్లి, మచిలీపట్నం, అనంతపురం, భీమవరం, చీరాల చిత్తూరు, ఏలూరు, గుంతకల్, గుంటూరు, హిందూపూర్, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లి, నంద్యాల్, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తెనాలి, తిరుమల, తిరుపతి, విజయవాడ, విజయనగరంలలో జియో 5జీ సర్వీసులు ఉన్నాయి. తాజాగా తాడిపత్రిలో సర్వీసులు మొదలైనట్టు ఆ సంస్థ ఈరోజు ప్రకటించింది. ఇకపోతే తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటివరకు హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మంచిర్యాల, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, వరంగల్ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా.. తాజాగా హోలీ సందర్భంగా రాష్ట్రంలో మరో 8 పట్టణాలకు (జగిత్యాల, కోదాడ, కొత్తగూడెం, నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట, తాండూరు, జహీరాబాద్) ఈ సేవల్ని విస్తరించడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.