Kia: ADAS-2 ఫీచర్‌తో కియా కొత్త సెల్టోస్‌

Kia: దక్షిణ కొరియా ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా సెల్టోస్‌లో ADAS-2 అడ్వాన్స్‌డ్‌ ఫీచర్‌తో కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Updated : 21 Jul 2023 15:19 IST

ఇంటర్నెట్‌డస్క్‌: దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ కియా మిడ్‌ సైజ్డ్‌ (SUV) సెల్టోస్‌లో ఆధునికీకరించిన మోడల్‌ను శుక్రవారం ఆవిష్కరించింది. దీని ధర రూ.10.89-19.99 (ఎక్స్‌ షోరూం) లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ వాహనం ఎక్స్‌లైట్‌, జీటీ లైన్‌, టెక్‌ లైన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్‌, డీజిల్‌ రెండు పవర్‌ ట్రైన్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని కియా వెల్లడించింది. గత వారంలోనే కొత్త సెల్టోస్‌ బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించింది. మొదటిరోజే 13,424 బుకింగ్‌లు జరిగినట్లు కంపెనీ తెలిపింది.

కొత్త కియా సెల్టోస్‌లో అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్ సిస్టమ్‌ (ADAS)-2లో అగ్రశ్రేణి భద్రతా ఫీచర్లు, ఆధునిక సాంకేతికతను అమర్చారు. డ్యుయల్ టోన్‌ వేరియంట్లుతో పాటు, ఎనిమిది ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తెచ్చారు. ఈ కారును మూడు ఇంజిన్‌ వేరియంట్లలో తీసుకొచ్చారు. 1.5-లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 6-స్పీడ్ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తోపాటు, ఐవీటీ గేర్‌ ఆప్షన్లు ఉన్నాయి. ఇక 1.5-లీటర్‌ డీజిల్‌ వేరియంట్‌ 6-స్పీడ్‌ ఐఎమ్‌టీ ట్రాన్స్‌మిషన్‌తో పాటు, 6-స్పీడ్‌ ఆటోగేర్‌ ట్రాన్స్‌మిషన్‌తో తీసుకొచ్చారు. ఈ మోడల్‌లో కొత్తగా 1.5-లీటర్ల పెట్రోల్‌ టీ-జీడీఐ ఇంజిన్‌ వేరియంట్‌ను పరిచయం చేశారు. ఇందులో 6-స్పీడ్‌ ఐఎమ్‌టీ గేర్‌, 6-స్పీడ్ ఆటోగేర్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లు ఉన్నాయి.

హైదరాబాద్‌ To తిరుపతి విమాన ప్రయాణం.. ఆపై శ్రీనివాసుని దర్శనం

ఇక ఎక్స్‌టీరియర్‌ పరంగా చూస్తే ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ లైట్‌, ఎల్‌ఈడీ లైట్‌ బార్‌ ఇందులో ఉన్నాయి. 18 అంగుళాల క్రిస్టల్‌ కట్ గ్లాసీ బ్లాక్‌ అలాయ్‌ వీల్స్‌ను ఇస్తున్నారు. ఫాక్స్ డ్యుయల్ ఎగ్జాస్ట్‌ టిప్‌, ఫాక్స్‌ స్కిడ్‌ ప్లేట్‌తో వస్తోంది. కారు లోపల 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ అమర్చారు. ఇందులో కియా హోమ్‌ స్మార్ట్‌ కనెక్ట్ ఫీచర్‌, 360 డిగ్రీల కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్‌ ఫీచర్లు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని