IPOకు మామాఎర్త్ మాతృ సంస్థ.. షేర్లు విక్రయించనున్న శిల్పాశెట్టి
Honasa Consumer files IPO papers: మామాఎర్త్ మాతృ సంస్థ హొనాసా కన్జూమర్ ఐపీఓకు రానుంది. ఈ మేరకు సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది.
దిల్లీ: ఎఫ్ఎంసీజీ బ్రాండ్లు అయిన మామాఎర్త్ (Mamaearth), ది డెర్మా కో (The Derma Co) వంటి సంస్థలకు మాతృ సంస్థ అయిన హోనాసా కన్జూమర్ (Honasa Consumer) ఐపీఓకు రానుంది. ఈ మేరకు సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఐపీఓలో భాగంగా రూ.400 కోట్ల విలువైన ఫ్రెష్ షేర్లను జారీ చేయనున్నారు. దీంతో పాటు ప్రమోటర్లు, ఇన్వెస్టర్లకు చెందిన చెందిన 4,68,19,635 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిన విక్రయించనున్నారు.
కంపెనీ ప్రమోటర్లు అయినా వరుణ్ అలాఘ్, గజల్ అలాఘ్తో పాటు, ఇన్వెస్టర్లు ఫైర్సైడ్ వెంచర్స్ ఫండ్, సోఫీనా, స్టెల్లరీస్, కునాల్ బన్సల్, రోహిత్ బన్సల్, మారికో ఎఫ్ఎంసీజీ సంస్థకు చెందిన రిషభ్ హర్ష్ మారివాల్తో పాటు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తమ షేర్లను విక్రయించనున్నారు. ఐపీఓలో 10 కోట్ల విలువైన షేర్లను అర్హులైన ఉద్యోగులకు రిజర్వ్ చేయనున్నారు.
ఐపీఓ కంటే ముందే ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్ ద్వారా రూ.80 కోట్లు కంపెనీ సమీకరించే అవకాశం ఉన్నట్లు ముసాయిదా పత్రాల ద్వారా తెలుస్తోంది. అదే జరిగితే ఆ మేర ఫ్రెష్ ఐపీఓ సైజ్ తగ్గనుంది. ఐపీఓ ద్వారా సమీకరించిన మొత్తాన్ని ప్రకటనలు, బ్రాండ్ ఔట్లెట్ల ఏర్పాటు, అనుబంధ సంస్థల్లో పెట్టుబడులకు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ముసాయిదా పత్రాల్లో హొనాసా కన్జూమర్ తెలిపింది.
కంపెనీ గురించి
గురుగ్రామ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీని వరుణ్, గజల్ అలాఘ్ దంపతులు 2016లో నెలకొల్పారు. మామాఎర్త్తో తొలుత తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తర్వాత ది డెర్మా కో, అక్వాలాజికా, అక్వా, బీబ్లంట్, డాక్టర్ సేత్స్ వంటి మరో ఐదు కంపెనీలను స్థాపించారు. 2022 జనవరిలో హొనాసా కన్జూమర్ యూనికార్న్ క్లబ్లోకి సైతం అడుగుపెట్టింది. ఈ ఐపీఓకు కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, జేఎం ఫైనాన్షియల్, జేపీ మోర్గాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ఈక్విటీ షేర్లు లిస్ట్ కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.