Mark Zuckerberg: ‘వాటితో ఆయన ప్రాణాలకు ప్రమాదం’.. జుకర్బర్గ్ మార్షల్ ఆర్ట్స్పై మెటా ఆందోళన
మార్షల్ ఆర్ట్స్తో జుకర్బర్గ్ ప్రాణాలకు ప్రమాదం కలిగే అవకాశం ఉందని మెటా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: కంపెనీ నిర్వహణ సీఈవోలకు కత్తి మీద సాములాంటిది. వారి చర్యలు సంస్థ ఉద్యోగులతోపాటు, కార్యకలాపాలపై ప్రభావం చూపిస్తాయి. అందుకే వ్యక్తిగత అలవాట్ల నుంచి సంస్థ విధానపరమైన నిర్ణయాల వరకూ ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సిందే. తాజాగా మెటా (Meta) సీఈవో మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg) క్రీడాసక్తిపై కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల విడుదల చేసిన ఫైనాన్షియల్ రిపోర్ట్లో ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA)లో ఆయనకు గాయాలయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
‘‘జుకర్బర్గ్ సహా సంస్థలో ముఖ్యమైన సిబ్బంది పోరాట క్రీడల్లో పాల్గొంటున్నారు. వాటిని ఆస్వాదించే క్రమంలో ప్రమాదాలు జరిగితే.. కంపెనీ కార్యకలాపాలపై ప్రభావం చూపిస్తుంది’’ అని ఫైనాన్షియల్ రిపోర్ట్లో సంస్థ ప్రస్తావించింది. గతేడాది నవంబరులో మార్షల్ ఆర్ట్స్లో పాల్గొంటున్న సమయంలో తన మోకాలికి గాయమైందని.. శస్త్రచికిత్స చేయించుకున్నట్లు జుకర్బర్గ్ వెల్లడించారు.
యుద్ధ కళలో ఆయనకు ప్రావీణ్యం ఉందన్న సంగతి తెలిసిందే. గతేడాది జులైలో బ్రెజిలియన్ ‘జు జిట్సు’లో బ్లూ బెల్ట్ సాధించారు. అనంతరం తనతో కేజ్ ఫైట్కు రావాలని టెస్లా (Tesla) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) విసిరిన సవాల్ను స్వీకరించారు. దాని కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ విషయాన్ని మస్క్ తేలిగ్గా తీసుకున్నారని.. దీన్ని ఇక్కడితో వదిలేస్తానని మెటా బాస్ అప్పట్లో పేర్కొన్నారు.
బిల్గేట్స్ను దాటేసిన జుకర్బర్గ్
ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ (Microsoft) వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates)ను జుకర్బర్గ్ అధిగమించారు. శుక్రవారం కంపెనీ విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల అనంతరం మెటా షేర్లు 20 శాతం పెరగడంతో, వాటి విలువ 28.1 బిలియన్ డాలర్లకు చేరింది. మొత్తంగా 170.5 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకారు. బిల్ గేట్స్ 165 బిలియన్ డాలర్ల సంపదతో తర్వాత స్థానంలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.