Boeing 737-9 Max: ఆ విమానం మోడల్ అంబానీకీ ఉంది!
Boeing 737-9 Max: అమెరికాలోని పోర్ట్లాండ్ నుంచి బయలుదేరిన అలాస్కా ఎయిర్లైన్స్కు చెందిన విమానానికి గగనతలంలో తలుపు ఊడిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఫెడరల్ అధికారులు బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా తక్షణం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
వాషింగ్టన్: బిలియనీర్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కూ బోయింగ్ 737-9 మ్యాక్స్ (Boeing 737-9 Max) విమానం ఉంది. ఈ విమానాల భద్రతపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అమెరికా గగనతలంలో తలుపు ఊడినప్పటికీ.. పెనుప్రమాదం నుంచి తప్పించుకున్న అలస్కా ఎయిర్లైన్స్ విమానం ఈ మోడల్కు చెందినదే.
బోయింగ్ 737-9 మ్యాక్స్ (Boeing 737-9 Max) మోడల్ ఉన్న ఏకైక కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ మాత్రమేనని విమానయాన సమాచార నిర్వహణ సంస్థ సిరియం ద్వారా తెలుస్తోంది. గత ఏడాదిలోనే కంపెనీ దీన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. టీ7-లోటస్ పేరిట దీన్ని రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. దీనితో పాటు రిలయన్స్ వద్ద రెండు ఎంబ్రార్ ఎస్ఏ ఈఆర్జే 145, ఎయిర్బస్ ఏ319 విమానాలు; రెండు హెలికాప్టర్లు ఉన్నాయి.
తలుపు ఊడిన ఘటన నేపథ్యంలో బోయింగ్ 737-9 మ్యాక్స్ (Boeing 737-9 Max) విమానాలన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా తక్షణం నిలిపివేయాలని అమెరికా ‘ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్’ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మొత్తం 171 విమానాలు ఆయా విమానాశ్రయాల్లో నిలిచిపోయాయి. వీటన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాత తిరిగి ఉపయోగంలోకి తీసుకురానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.