Cage Fight: కేజ్ ఫైట్ అంతా ఉత్తిదేనా..? మస్క్ ఏం చెప్పారంటే..?
టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్(Elon Musk), మార్క్ జుకర్ బర్గ్(Mark Zukerberg) మధ్య కేజ్ ఫైట్ ఉంటుందా..? ఉండదా..? తాజాగా దీనిపై మస్క్ చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో కేజ్ఫైట్ పదం తెగ వైరలవుతోంది. టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్ (Elon Musk), మార్క్ జుకర్బర్గ్ (Mark Zukerberg) మధ్య దానిపై మాటల యుద్ధం జరుగుతుండటమే అందుకు కారణం. ఇంతకాలం ఈ ఫైట్ నిజంగా జరుగుతుందనేలా వారి మాటలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదంతా ఉత్తిదేనా అన్న సందేహం కలుగుతోంది. తాజాగా మస్క్ చేసిన ట్వీట్ చూస్తుంటే దీనికి బలం చేకూరుతోంది. ఫైట్ రీకాప్ అంటూ ఇప్పటివరకూ జరిగిన తతంగాన్ని ఎక్స్ (గతంలో ట్విటర్)లో పోస్టు చేశారు.
‘నేను ఫైట్ గురించి జుకర్బర్గ్తో జోక్ చేశాను. లొకేషన్ పంపమంటూ జుక్ నుంచి సమాధానం వచ్చింది. మా పోటీ కోసం వేదిక ఇచ్చేందుకు ఇటలీ ముందుకు వచ్చింది. కానీ జుక్ దానిని తిరస్కరించారు. అప్పుడు దీనికి వేదికగా జుకర్ బర్గ్ ఇంటినే నేను సూచించాను. దురదృష్టవశాత్తూ ఆయన ఇంట్లో లేరు. అసలు ఆయనకు పోరాడే ఉద్దేశం ఉందా..?’అని ఇప్పటివరకు జరిగిన తతంగాన్నంతా వివరించారు.
కొన్నేళ్లుగా రాజకీయాలు, కృత్రిమ మేధ( AI)కు సంబంధించి పలు విషయాల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తూ.. మస్క్, జుకర్బర్గ్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. గత నెలలో ఇవి తారస్థాయికి చేరాయి. ఎక్స్ (Twitter)కు పోటీగా మెటా సంస్థ థ్రెడ్స్ అనే యాప్ను తీసుకొచ్చింది. దీనిపై మస్క్ ఆరోపణలు చేశారు. ఎక్స్ను కాపీ కొట్టి థ్రెడ్స్ను డిజైన్ చేశారని పేర్కొన్నారు.
2047 నాటికి ₹15 లక్షలకు తలసరి ఆదాయం: ఎస్బీఐ రీసెర్చ్
ఈ క్రమంలోనే జుకర్బర్గ్ రెడీ అంటే అతడితో కేజ్ ఫైట్కు తాను సిద్ధమని తొలుత మస్క్ ఎక్స్లో పేర్కొన్నారు. దీనిపై జుకర్బర్గ్ స్పందిస్తూ ‘ప్లేస్ ఎక్కడో చెప్పు’ అంటూ సవాల్కు సై అన్నారు. తొలుత ఇదంతా ప్రచారం కోసమేనని నెటిజన్లు భావించినా.. వీరిద్దరూ ట్రైనింగ్ సెషన్లో పాల్గొనడంతో దీనిపై ఆసక్తి పెరిగింది. తర్వాత పరిణామాలు వారి పోటీ ఖాయమనేలా కనిపించాయి. ఫైట్ కోసం ప్రాక్టీస్ చేసిన దృశ్యాలను వారు పోస్టు చేశారు.
ఈ క్రమంలోనే ఫైట్ కోసం మస్క్ డేట్లు ఇవ్వడం లేదని జుకర్ బర్గ్ ఆరోపించారు. దాంతో కేజ్ ఫైట్ గురించి మస్క్ మరోసారి పోస్టు చేశారు. తన టెస్లా కారును (ఆటోపైలట్) జుకర్బర్గ్ ఇంటికి డ్రైవ్ చేయాలని అడుగుతానని.. మెటా సీఈవో ఇంట్లో ఉంటే అక్కడే ఫైట్ చేస్తానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి. -
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!