Cybercrime: సైబర్ కేటుగాళ్ల చేతుల్లోకి రూ.10,300 కోట్లు!
Cybercrime Report: దేశంలో 2021 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబరు మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు రూ.10,300 కోట్లు కాజేసినట్లు ‘ఐ4సీ’ డైరెక్టర్ రాజేశ్ కుమార్ వెల్లడించారు.
Cybercrime Report | ఇంటర్నెట్ డెస్క్: దేశంలో సైబర్ నేరాలు (Cyber Crimes) రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా.. చాలా మంది కేటుగాళ్ల వలలో చిక్కుకుపోతున్నారు. 2021 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబరు 31 వరకు వరకు సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా రూ.10,319 కోట్లు కొల్లగొట్టినట్లు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) వెల్లడించింది. అందులో రూ.1,127 కోట్లను విజయవంతంగా బ్లాక్ చేసినట్లు తెలిపింది. దేశంలో నమోదైన సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలను ‘ఐ4సీ’ డైరెక్టర్ రాజేశ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే..
- నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCCRP)లో 2021లో 4.52 లక్షలకుపైగా సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి.
- 2022లో సైబర్ కేసుల సంఖ్యలో 113.7 శాతం పెరుగుదల నమోదై.. 9.66 లక్షలకు చేరుకుంది.
- 2023లో ఏకంగా 15.56 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష జనాభాకు 129 సైబర్ కేసులు వెలుగుచూశాయి.
- బ్లాక్ చేసిన రూ.1,127 కోట్లలో 9 నుంచి 10 శాతం సొమ్మును బాధితుల ఖాతాల్లోకి మళ్లీ జమచేశారు.
- దాదాపు 50 శాతం సైబర్ దాడులు కంబోడియా, వియత్నాం, చైనా తదితర దేశాల నుంచే జరిగాయి.
- దిల్లీ పరిసర ప్రాంతాల్లో సెక్స్టార్షన్, ఆన్లైన్ బుకింగ్, ఓఎల్ఎక్స్ వంటి మార్గాల ద్వారా ఎక్కువగా మోసాలకు పాల్పడ్డారు.
- సైబర్ బాధితులు తమ డబ్బును సులభంగా క్లెయిమ్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందిస్తోందని, వాటిని త్వరలోనే అమల్లోకి తీసుకురానుందని రాజేశ్ కుమార్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.