Radiant Cash IPO: 23న రేడియంట్ క్యాష్ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.94-97
రేడియంట్ క్యాష్ ఐపీఓ ధరల్ని నిర్ణయించింది. మరోవైపు జాగిల్ ప్రీపెయిడ్ ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది.
దిల్లీ: రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఐపీఓ (Radiant Cash Management IPO) ధరల శ్రేణిని రూ.94- 99గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.388 కోట్లు సమీకరించనుంది. ఈ పబ్లిక్ ఇష్యూ (IPO) డిసెంబరు 23- 27 మధ్య జరగనుంది. రూ.60 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 3.31 కోట్ల ఈక్విటీ షేర్లు ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద విక్రయించనున్నారు. ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్, యెస్ సెక్యూరిటీస్ (ఇండియా) లిమిటెడ్ ఈ ఐపీఓ (IPO)కి లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
2015లో రేడియంట్ క్యాష్లో ‘అసెంట్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఇండియా’ 37.2 శాతం వాటా కోనుగోలు చేసింది. దీంట్లో ఇప్పుడు కొంత భాగాన్ని ఓఎఫ్ఎస్ కింద అసెంట్ వదులుకోనుంది. మరోవైపు ప్రమోటర్ డేవిడ్ దేవసహాయం సైతం కొన్ని షేర్లను విక్రయించనున్నారు. ఈ ఐపీఓలో సమీకరించిన నిధుల్లో కొంత భాగాన్ని నిర్వహణ మూలధనం కింద, మరికొంత మూలధన వ్యయం కింద ఉపయోగించనున్నారు. అలాగే కొన్ని నిధుల్ని ప్రత్యేకంగా తయారు చేసిన వ్యాన్ల కొనుగోలుకు కూడా వినియోగించనున్నారు. మదుపర్లు కనీసం 150 ఈక్విటీ షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఐపీఓకి జాగిల్ సన్నాహాలు
ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ ‘జాగిల్ ప్రీపెయిడ్ ఓషియన్ సర్వీసెస్ లిమిటెడ్’ ఐపీఓ (Zaggle Prepaid Ocean Services IPO)కి సన్నాహాలు చేసుకుంటోంది. ఈ మేరకు మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ అనుమతి కోరుతూ ముసాయిదా పత్రాలు సమర్పించింది. రూ.490 కోట్ల తాజా షేర్లతో పాటు 1.05 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్లో భాగంగా విక్రయించనున్నారు.
ఈ ఐపీఓలో సమీకరించిన నిధులను వ్యాపారాన్ని బలోపేతం చేయడం, రుణభారాన్ని తగ్గించుకోవడం, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు. జాగిల్ ప్రీపెయిడ్ను 2011లో ఏర్పాటు చేశారు. ఇది ‘బిజినెస్-టు-బిజినెస్-టు-కస్టమర్’ విభాగంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రీపెయిడ్ కార్డ్లు, ఉద్యోగుల నిర్వహణ (SaaS ద్వారా) ద్వారా ఖర్చులను నియంత్రించేందుకు కావాల్సిన సంయుక్త పరిష్కారాన్ని అందిస్తూ దేశంలో తమకంటూ ఓ ప్రత్యేక మార్కెట్ను సృష్టించుకుంది. ఉద్యోగుల పన్ను ప్రయోజనాలు, వ్యయ నిర్వహణ, కార్పొరేట్ బహుమతులు, రివార్డుల వంటి కార్యక్రమాల కోసం డిజిటలైజ్డ్ సొల్యూషన్లను అందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.