AI: భారత్లో కృత్రిమ మేధ అభివృద్ధికి ఎన్విడియాతో రిలయన్స్ భాగస్వామ్యం
AI: కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో భారత్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్లో ఈ అత్యాధునిక సాంకేతిక అభివృద్ధి, అమలుకు అమెరికా టెక్ కంపెనీ ఎన్విడియాతో వ్యాపార దిగ్గజం రిలయన్స్ చేతులు కలిపింది.
దిల్లీ: భారత్లో కృత్రిమ మేధ (Artificial intelligence- AI) ఆధారిత సూపర్ కంప్యూటర్ల అభివృద్ధికి అమెరికాకు చెందిన టెక్ కంపెనీ ఎన్విడియా (NVIDIA), భారత వ్యాపార దిగ్గజం రిలయన్స్ (Reliance) చేతులు కలిపాయి. ఈ మేరకు ఇరు కంపెనీలు శుక్రవారం ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం భారత్లో ఉన్న అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ కంటే శక్తిమంతమైన AI మౌలిక సదుపాయాలను నిర్మించనున్నట్లు వెల్లడించాయి. NVIDIA వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన కొన్ని రోజులకే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.
భారత్లో ఎన్విడియా (NVIDIA) 2004 నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గురుగ్రామ్, హైదరాబాద్, పుణె, బెంగళూరులో ఈ సంస్థకు ఇంజినీరింగ్, డెవలప్మెంట్ కేంద్రాలున్నాయి. దాదాపు 3,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశంలోని విభిన్న భాషలపై శిక్షణ పొందిన, భారత్కు మాత్రమే ప్రత్యేకమైన అతిపెద్ద ఏఐ భాషా నమూనాను రిలయన్స్ సహకారంతో అభివృద్ధి చేయనున్నట్లు ఎన్విడియా తెలిపింది. దాని ఆధారంగా పలు ఏఐ అప్లికేషన్లను రూపొందిచనున్నట్లు పేర్కొంది. క్లౌడ్లోని GH200 గ్రేస్ హాప్పర్ సూపర్చిప్, DGX క్లౌడ్ వంటి అత్యాధునిక AI సూపర్ కంప్యూటింగ్ సేవలను అందించనున్నట్లు తెలిపింది.
NVIDIA ఆధారిత AI మౌలిక సదుపాయాలు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, రిలయన్స్ ఇండస్ట్రీస్కు కొత్త పునాదులు వేయనున్నట్లు ప్రకటనలో ఇరు కంపెనీలు పేర్కొన్నాయి. 450 మిలియన్ల జియో కస్టమర్ల కోసం AI అప్లికేషన్లు, సేవలను రిలయన్స్ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపాయి. దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, డెవలపర్లు, స్టార్టప్లకు AI మౌలిక సదుపాయాలను అందించనున్నట్లు పేర్కొన్నాయి.
వాతావరణం, ధరల వంటి సమాచారాన్ని గ్రామీణ రైతులు వారి స్థానిక భాషలో సెల్ ఫోన్ల ద్వారా పొందేందుకు ఏఐ ఉపకరిస్తుందని ప్రకటనలో పేర్కొన్నాయి. వైద్య నిపుణులు లేని సమయంలో వ్యాధుల నిర్ధారణకూ సాయంగా ఉంటుందని వెల్లడించాయి. దశాబ్దాల వాతావరణ డేటాను విశ్లేషించి తుపానులను అంచనా వేయవచ్చని తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.