Musk vs Zuckerberg: కేజ్ ఫైట్ లైవ్ స్ట్రీమింగ్.. మస్క్ ట్వీట్కు జుకర్ కౌంటర్
Musk vs Zuckerberg: మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ మధ్య పోరు జరుగుతుందని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మస్క్, జుకర్ పోస్టులతో వీరి మధ్య పోరు ఖాయంగా కన్పిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్ (Elon Musk), మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg) మధ్య కేజ్ ఫైట్ (cage fight) ఖాయంగానే కన్పిస్తోంది. దీనిపై మస్క్ ఆదివారం చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. తమ మధ్య జరిగే పోరు ‘ఎక్స్ (ట్విటర్)’లో ప్రత్యక్ష ప్రసారమవుతుందని స్పేస్ఎక్స్ అధినేత చెప్పారు. అయితే, ఈ ట్వీట్కు జుకర్బర్గ్ స్పందిస్తూ మస్క్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. లైవ్ స్ట్రీమింగ్కు ఇంతకంటే మంచి వేదిక లేదా? అంటూ ఎద్దేవా చేశారు.
‘‘జుకర్, మస్క్ మధ్య జరిగే పోరు ఎక్స్లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది. దాని ద్వారా వచ్చిన నిధులు స్వచ్ఛంద సంస్థలకు వెళతాయి’’ అని మస్క్ (Elon Musk) నిన్న పోస్ట్ చేశారు. ఈ ట్వీట్పై జుకర్బర్గ్ తాను కొత్తగా ప్రారంభించిన ‘థ్రెడ్స్ (Threads)’ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఛారిటీ కోసం డబ్బును సేకరించేప్పుడు ఇంతకంటే విశ్వసనీయమైన వేదికను మనం ఉపయోగించలేమా?’’ అని కౌంటర్ ఇచ్చారు. జుకర్బర్గ్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. కేజ్ ఫైట్ కంటే ముందే వీరిద్దరి నుంచి పంచ్లు దూసుకొస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ రోజైనా నేను రెడీ: జుకర్
ఇదిలా ఉండగా.. ఈ కేజ్ ఫైట్ కోసం తాను సిద్ధమవుతున్నానని మస్క్ మరో ట్వీట్ చేశారు. ‘‘ఈ పోరు కోసం నేను రోజంతా బరువులు ఎత్తుతూనే ఉన్నాను. ఇంటి వద్ద వర్క్అవుట్ చేయడానికి సమయం లేకపోవడంతో ఆఫీసుకే వాటిని తెచ్చుకున్నా’’ అని ఆయన రాసుకొచ్చారు. దీనికి కూడా జుకర్బర్గ్ (Zuckerberg) గట్టిగా బదులిచ్చారు.
మరో అయిదేళ్లు ముకేశ్ అంబానీయే!
‘‘ఈ రోజు ఫైట్ చేయడానికైనా నేను సిద్ధమే. ఆయన (మస్క్) తొలుత దీని గురించి ఛాలెంజ్ చేసినప్పుడు ఆగస్టు 26వ తేదీని నేను సూచించా. కానీ, ఆయన నుంచి అంగీకారం రాలేదు. ఈ పోరు గురించి నేను పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ గేమ్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రత్యర్థి ఎలాంటి శిక్షణ తీసుకున్నా సరే.. పోటీని నేను కొనసాగిస్తా’’ అని జుకర్ మరో కౌంటర్ వేశారు.
కొన్నేళ్లుగా రాజకీయాలు, కృత్రిమ మేధ( AI)కు సంబంధించి పలు విషయాల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తూ.. మస్క్, జుకర్బర్గ్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. గత నెలలో ఇవి తారస్థాయికి చేరాయి. ఎక్స్ (Twitter)కు పోటీగా మెటా సంస్థ థ్రెడ్స్ అనే యాప్ను తీసుకొచ్చింది. దీనిపై మస్క్ ఆరోపణలు చేశారు. ఎక్స్ను కాపీ కొట్టి థ్రెడ్స్ను డిజైన్ చేశారని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే జుకర్బర్గ్ రెడీ అంటే అతడితో కేజ్ ఫైట్కు తాను సిద్ధమని తొలుత మస్క్ ఎక్స్లో పేర్కొన్నాడు. దీనిపై జుకర్బర్గ్ స్పందిస్తూ ‘ప్లేస్ ఎక్కడో చెప్పు’ అంటూ సవాల్కు సై అన్నాడు. తొలుత ఇదంతా ప్రచారం కోసమేనని నెటిజన్లు భావించినా.. వీరిద్దరూ ట్రైనింగ్ సెషన్లో పాల్గొనడంతో దీనిపై ఆసక్తి పెరిగింది. తాజాగా మస్క్, జుకర్ పోస్టులతో వీరి మధ్య పోరు ఖాయమేనని తెలుస్తోంది. అయితే, ఈ ఫైట్ ఎప్పుడు జరుగనుందో మాత్రం ఇంత వరకు తెలియరాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి. -
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!