మరో అయిదేళ్లు ముకేశ్ అంబానీయే!
దేశీయంగా అత్యధిక మార్కెట్ విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు (సీఎండీ)గా ముకేశ్ అంబానీ (66)ని మరో అయిదేళ్లు కొనసాగించేందుకు వాటాదార్ల ఆమోదాన్ని కంపెనీ కోరుతోంది.
వేతనం లేకుండానే సీఎండీగా
వాటాదార్ల ఆమోదం కోరుతున్న ఆర్ఐఎల్
దిల్లీ: దేశీయంగా అత్యధిక మార్కెట్ విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు (సీఎండీ)గా ముకేశ్ అంబానీ (66)ని మరో అయిదేళ్లు కొనసాగించేందుకు వాటాదార్ల ఆమోదాన్ని కంపెనీ కోరుతోంది. ప్రస్తుతం ముకేశ్ పదవీకాలం 2024 ఏప్రిల్ 19 వరకు ఉంది. దీన్ని 2029 ఏప్రిల్ 18 వరకు పొడిగించాలన్నది కంపెనీ బోర్డు ప్రతిపాదన. 2027 ఏప్రిల్ 19కి ఆయనకు 70 ఏళ్లు వస్తాయి. కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వయసు 70 ఏళ్లు మించకూడదనే కంపెనీ చట్ట నిబంధన ఉంది. అందువల్ల 2029 వరకు ముకేశ్ సీఎండీగా కొనసాగాలంటే, వాటాదార్లు ప్రత్యేక తీర్మానం చేయాల్సి ఉంది. 1977 నుంచి ఆర్ఐఎల్ బోర్డులో ఉన్న ముకేశ్, ధీరూభాయి అంబానీ మరణంతో 2002 జులైలో కంపెనీ ఛైర్మన్గా ఎంపికయ్యారు. 2008-09 నుంచి 2019-20 వరకు ఆయన వార్షిక వేతనంగా రూ.15 కోట్లు చొప్పున తీసుకున్నారు. కొవిడ్ 19 పరిణామాల నుంచి ఆయన వేతనం ఏమీ తీసుకోవడం లేదు.
2,62,558 మందికి ఉద్యోగాలు
గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2,62,558 మందికి తమ గ్రూప్ వ్యాపారాల్లో ఉద్యోగావకాశాలు కల్పించినట్లు ఆర్ఐఎల్ వెల్లడించింది. రిటైల్లో 2,45,581 మంది ఉద్యోగులున్నారు.
రిటైల్లో 100 కోట్ల లావాదేవీలు
రిలయన్స్ రిటైల్, గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 100 కోట్ల లావాదేవీలకు పైగా నిర్వహించింది. నమోదిత ఖాతాదారుల సంఖ్య 24.90 కోట్లకు చేరిందని సంస్థ వార్షిక నివేదికలో వెల్లడించింది. కంపెనీ ఆదాయం రూ.2.60 లక్షల కోట్లలో, డిజిటల్-కొత్త వ్యాపార వాటా 18 శాతంగా ఉంది. 2022-23లో జతచేర్చిన 3,300 స్టోర్లతో కలిపి మొత్తం విక్రయశాలల సంఖ్య 18,040కి చేరింది. 6.56 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్టోర్లున్నాయి. ఎఫ్ఎంసీజీ, దుస్తుల విభాగాల్లో ప్రతిష్ఠాత్మక బ్రాండ్లను కొనుగోలు చేస్తోంది. తమ కొత్త వ్యాపారంలో 30 లక్షల మంది చిరు వ్యాపారులు భాగస్వాములయ్యారని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం దేశీయంగా రిటైల్ వ్యాపారం 800 బిలియన్ డాలర్ల (సుమారు రూ.65.60 లక్షల కోట్ల) స్థాయిలో ఉండగా, 2030కి 2 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.164 లక్షల కోట్లకు పైగా)కు చేరుతుందనేది అంచనా.
రిలయన్స్ జియోకు రూ.18,000 కోట్లు
దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణ కోసం స్వీడిష్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఏజెన్సీ నుంచి 2.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.18,000 కోట్ల) ఆర్థిక సాయం అందుకున్నట్లు రిలయన్స్ జియో ఆదివారం తెలిపింది. 5జీ నెట్వర్క్కు అవసరమైన టెలికాం గేర్లను స్వీడన్ సంస్థ ఎరిక్సన్, ఫిన్లాండ్ కంపెనీ నోకియా నుంచే జియో సమీకరిస్తోంది. వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సేవలను 6.2 లక్షల గ్రామాల్లో అందిస్తున్నామని, గత ఆర్థిక సంవత్సరంలో 70,000 మందికి ఉపాధి కల్పించామని సంస్థ తెలిపింది.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ త్వరలో నమోదు
28న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం
దేశంలోనే అతి పెద్ద రిటైలర్గా, టెలికాం ఆపరేటర్గా మారిన ముకేశ్ అంబానీ తాజాగా ఆర్థిక సేవలు, కొత్త ఇంధన వ్యాపారాలపై దృష్టి సారించారు. 2035 నాటికి నికర శూన్య కర్బన ఉద్గార స్థితికి మారాలనే లక్ష్యాన్ని ఆర్ఐఎల్ నిర్దేశించుకుంది. ఇటీవల సంస్థ నుంచి విడదీసిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్.. డిజిటల్, రిటైల్ వ్యాపారాల స్థాయిని ప్రభావితం చేస్తుందని ఆర్ఐఎల్ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ సంస్థను స్టాక్ మార్కెట్లో త్వరలోనే నమోదు చేస్తామని ముకేశ్ పేర్కొన్నారు. ఎప్పుడనేది, ఈనెల 28న జరిగే వాటాదార్ల వార్షిక సమావేశం (ఏజీఎం)లో ఆయన వెల్లడించే అవకాశం ఉంది.
- జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కు రిలయన్స్ ఇండస్ట్రీస్లో 6.1% వాటా ఉంది. మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు బ్లాక్రాక్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది.
- హరిత ఇంధనం-రసాయనాలపైనా ముకేశ్ దృష్టి కేంద్రీకరించారు. పునరుత్పాదక ఇంధనం, హరిత హైడ్రోజన్ల ఉత్పత్తి, ప్రపంచంలోనే పెద్దదైన గిగా కాంప్లెక్స్లో హరిత ఇంధన పరికరాల తయారీ, 100 గిగావాట్ సామర్థ్యాన్ని చేరుకునేందుకు రిలయన్స్ రూ.75,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. జామ్నగర్లోని గిగా కాంప్లెక్స్లో, ఫ్యాక్టరీల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సంప్రదాయ శిలాజ ఇంధనాల నుంచి, పునరుత్పాదక ఇంధన వనరులకు పరివర్తనం చెందడం కంపెనీ చరిత్రలో కీలక మైలురాయి అని ముకేశ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం.. -
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
Sundar Pichai: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వినియోగం పెరుగుతున్న తరుణంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సలహా అందించారు. -
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం కొంతసేపు పనిచేశాయి. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు లాభపడ్డాయి. -
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం